Movie News

షారుఖ్‌కు ముస్లిం బోర్డు షాక్

షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘పఠాన్’ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘బేషారమ్ రంగ్’ అనే పాట మీద హిందూ అనుకూల వర్గాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ పాట చిత్రీకరణ చాలా అసభ్యంగా ఉందంటూ న్యూట్రల్ జనాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీపికా పదుకొనే డ్రెస్సింగ్, ఎక్స్‌పోజింగ్, హావభావాలు హద్దులు దాటిపోయాని చాలామంది విమర్శలు చేశారు. కాగా బీజేపీ అనుకూల వర్గాలేమో.. ఆమె కాషాయం ధరించి ఎక్స్‌పోజింగ్ చేయడాన్ని తప్పుబట్టడం కొంచెం విడ్డూరంగా అనిపించింది.

ఇంతలో ఆ పార్టీని వ్యతిరేకించే లిబరల్స్ అందరూ ఒక్కటై ‘పఠాన్’ టీంకు బాసటగా నిలిచారు. ఈ వివాదం మీద జోరుగా చర్చ నడుస్తుండగా.. షారుఖ్ ఖాన్‌కు ఇప్పుడో పెద్ద షాక్ తగిలింది. హిందూ వర్గాలు షారుఖ్ సినిమాను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ముస్లిం సంఘాలు ఆయనకు బాసటగా నిలుస్తాయనుకుంటే.. సీన్ రివర్సయింది.

‘బేషారమ్ రంగ్’ పాట మీద మధ్యప్రదేశ్‌కు చెందిన ఉలేమా బోర్డు తీవ్ర అభ్యంతరం తెలిపింది. సినిమాకు ‘పఠాన్’ పేరు పెట్టి అందులో చాలా అభ్యంతరకరమైన విషయాలు చూపిస్తున్నారని ఆ బోర్డు విమర్శించింది. పఠాన్లు చాలా గౌరవంగా ఉంటారని, వారిది అత్యంత గౌరవమైన సమాజమని, అయితే ఈ సినిమాలో వారిని చాలా అభ్యంతకరంగా చూపించారంటూ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ సినిమాను విడుదల కాకుండా ఆపాలని, లేని పక్షంలో సినిమాలోని అశ్లీల దృశ్యాలను తెరపై కనిపించకుండా కత్తిరించాలని డిమాండ్ ఆ బోర్డు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సినిమాను ఆల్ ఇండియా ముస్లిం ఫెస్టివల్ కమిటీ బహిష్కరించిందని ఉలేమా బోర్డు అధ్యక్షుడు సయ్యద్ అనాస్ అలీస్ పేర్కొన్నారు. ఇటు హిందూ వర్గాలు సినిమాను బహిష్కరించాలని పిలుపునిస్తుండగా.. ఇప్పుడు ముస్లిం బోర్డు ప్రతినిధి సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడుతుండడంతో ‘పఠాన్’ భవితవ్యం ఏమవుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

This post was last modified on December 19, 2022 6:26 am

Share
Show comments
Published by
Satya
Tags: Sharukh Khan

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

3 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

7 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

8 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

9 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

9 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

11 hours ago