షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ నుంచి ఇటీవలే రిలీజైన ‘బేషారమ్ రంగ్’ పాట ఎంత దుమారం రేపిందో తెలిసిందే. అందులో హీరోయిన్ దీపికా పదుకొనే వీర లెవెల్లో ఎక్స్పోజింగ్ చేసింది. ఆమె దుస్తులు.. హావభావాల విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ఐతే సామాన్య ప్రేక్షకులు ఈ పాట గురించి ఏం కామెంట్ చేసినా ఓకే కానీ.. ఇందులోకి రాజకీయ నాయకులు తలదూర్చడమే అభ్యంతరకరంగా మారింది.
దీపిక కాషాయ రంగు దుస్తులు ధరించి ఎక్స్పోజింగ్ చేయడాన్ని తప్పుబడుతూ మధ్యప్రదేశ్కు చెందిన ఒక మంత్రి విమర్శలు చేయడం, ఆ దుస్తులు మార్చకుంటే సినిమాను తమ రాష్ట్రంలో ఆడనివ్వబోమన్నట్లుగా హెచ్చరికలు చేయడం దుమారం రేపింది. దీని మీద ఇంకో వర్గం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ‘పఠాన్’ టీంకు బాసటగా నిలుస్తూ పోస్టులు పెడుతుండడం చూస్తున్నాం.
ఇలాంటి టైంలో ఫిలిం ఇండస్ట్రీకే చెందిన ఒక వ్యక్తి ‘బేషారమ్ రంగ్’ పాట మీద తీవ్ర విమర్శలు గుప్పించాడు. ‘శక్తిమాన్’గా నిన్నటితరం ప్రేక్షకులను అమితంగా అలరించిన ముకేష్ ఖన్నా.. ఈ పాట మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.. బేషారమ్ రంగ్ పాటను చాలా అసభ్యకరంగా చిత్రీకరించారని అన్నాడు.
‘‘బాలీవుడ్ గాడి తప్పింది. సినిమాల్లో అశ్లీలత ఎక్కువ అవుతోంది. ఇప్పుడు హీరోయిన్లను పొట్టి పొట్టి దుస్తుల్లో చూపిస్తున్న ఫిలిం మేకర్స్.. రేప్పొద్దున నగ్నంగా కూడా చూపిస్తారేమో. ఇలాంటి వాటిని అంగీకరించడానికి మన దేశం స్పెయిన్ లేదా స్వీడన్ కాదు. ఎవరి మనోభావాలకు, నమ్మకాలకు ఇబ్బంది కలగకుండా సినిమాలు ఉండేలా చూడడం సెన్సార్ బోర్డు పని. యువతను తప్పుదోవ పట్టించే చిత్రాలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకూడదు. బేషారమ్ రంగ్ పాటను అసభ్యకరంగా చిత్రీకరించారు. ఇతరుల ఫీలింగ్స్ను రెచ్చగొట్టేలా ఉన్న ఈ పాటను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించింది’’ అని ముకేష్ ఖన్నా ప్రశ్నించాడు.
జనవరిలో 'అనగనగా ఒక రాజు' విడుదల టైంలో నిర్మాత నాగవంశీ ఇకపై తమ బ్యానర్ నుంచి నెలకో సినిమా ఉంటుందని…
టాలీవుడ్ హీరోయిన్లలో సమంత చాలా చాలా స్పెషల్ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. విజయశాంతిలా, అనుష్కలా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయకపోయినా…
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్…
సరిగ్గా ఇంకో పదిహేను రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ…
ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యూపీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ సిరీస్.. తొలి…
ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్తో…