షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ నుంచి ఇటీవలే రిలీజైన ‘బేషారమ్ రంగ్’ పాట ఎంత దుమారం రేపిందో తెలిసిందే. అందులో హీరోయిన్ దీపికా పదుకొనే వీర లెవెల్లో ఎక్స్పోజింగ్ చేసింది. ఆమె దుస్తులు.. హావభావాల విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ఐతే సామాన్య ప్రేక్షకులు ఈ పాట గురించి ఏం కామెంట్ చేసినా ఓకే కానీ.. ఇందులోకి రాజకీయ నాయకులు తలదూర్చడమే అభ్యంతరకరంగా మారింది.
దీపిక కాషాయ రంగు దుస్తులు ధరించి ఎక్స్పోజింగ్ చేయడాన్ని తప్పుబడుతూ మధ్యప్రదేశ్కు చెందిన ఒక మంత్రి విమర్శలు చేయడం, ఆ దుస్తులు మార్చకుంటే సినిమాను తమ రాష్ట్రంలో ఆడనివ్వబోమన్నట్లుగా హెచ్చరికలు చేయడం దుమారం రేపింది. దీని మీద ఇంకో వర్గం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ‘పఠాన్’ టీంకు బాసటగా నిలుస్తూ పోస్టులు పెడుతుండడం చూస్తున్నాం.
ఇలాంటి టైంలో ఫిలిం ఇండస్ట్రీకే చెందిన ఒక వ్యక్తి ‘బేషారమ్ రంగ్’ పాట మీద తీవ్ర విమర్శలు గుప్పించాడు. ‘శక్తిమాన్’గా నిన్నటితరం ప్రేక్షకులను అమితంగా అలరించిన ముకేష్ ఖన్నా.. ఈ పాట మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.. బేషారమ్ రంగ్ పాటను చాలా అసభ్యకరంగా చిత్రీకరించారని అన్నాడు.
‘‘బాలీవుడ్ గాడి తప్పింది. సినిమాల్లో అశ్లీలత ఎక్కువ అవుతోంది. ఇప్పుడు హీరోయిన్లను పొట్టి పొట్టి దుస్తుల్లో చూపిస్తున్న ఫిలిం మేకర్స్.. రేప్పొద్దున నగ్నంగా కూడా చూపిస్తారేమో. ఇలాంటి వాటిని అంగీకరించడానికి మన దేశం స్పెయిన్ లేదా స్వీడన్ కాదు. ఎవరి మనోభావాలకు, నమ్మకాలకు ఇబ్బంది కలగకుండా సినిమాలు ఉండేలా చూడడం సెన్సార్ బోర్డు పని. యువతను తప్పుదోవ పట్టించే చిత్రాలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకూడదు. బేషారమ్ రంగ్ పాటను అసభ్యకరంగా చిత్రీకరించారు. ఇతరుల ఫీలింగ్స్ను రెచ్చగొట్టేలా ఉన్న ఈ పాటను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించింది’’ అని ముకేష్ ఖన్నా ప్రశ్నించాడు.
This post was last modified on December 17, 2022 5:14 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…