షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ నుంచి ఇటీవలే రిలీజైన ‘బేషారమ్ రంగ్’ పాట ఎంత దుమారం రేపిందో తెలిసిందే. అందులో హీరోయిన్ దీపికా పదుకొనే వీర లెవెల్లో ఎక్స్పోజింగ్ చేసింది. ఆమె దుస్తులు.. హావభావాల విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ఐతే సామాన్య ప్రేక్షకులు ఈ పాట గురించి ఏం కామెంట్ చేసినా ఓకే కానీ.. ఇందులోకి రాజకీయ నాయకులు తలదూర్చడమే అభ్యంతరకరంగా మారింది.
దీపిక కాషాయ రంగు దుస్తులు ధరించి ఎక్స్పోజింగ్ చేయడాన్ని తప్పుబడుతూ మధ్యప్రదేశ్కు చెందిన ఒక మంత్రి విమర్శలు చేయడం, ఆ దుస్తులు మార్చకుంటే సినిమాను తమ రాష్ట్రంలో ఆడనివ్వబోమన్నట్లుగా హెచ్చరికలు చేయడం దుమారం రేపింది. దీని మీద ఇంకో వర్గం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ‘పఠాన్’ టీంకు బాసటగా నిలుస్తూ పోస్టులు పెడుతుండడం చూస్తున్నాం.
ఇలాంటి టైంలో ఫిలిం ఇండస్ట్రీకే చెందిన ఒక వ్యక్తి ‘బేషారమ్ రంగ్’ పాట మీద తీవ్ర విమర్శలు గుప్పించాడు. ‘శక్తిమాన్’గా నిన్నటితరం ప్రేక్షకులను అమితంగా అలరించిన ముకేష్ ఖన్నా.. ఈ పాట మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.. బేషారమ్ రంగ్ పాటను చాలా అసభ్యకరంగా చిత్రీకరించారని అన్నాడు.
‘‘బాలీవుడ్ గాడి తప్పింది. సినిమాల్లో అశ్లీలత ఎక్కువ అవుతోంది. ఇప్పుడు హీరోయిన్లను పొట్టి పొట్టి దుస్తుల్లో చూపిస్తున్న ఫిలిం మేకర్స్.. రేప్పొద్దున నగ్నంగా కూడా చూపిస్తారేమో. ఇలాంటి వాటిని అంగీకరించడానికి మన దేశం స్పెయిన్ లేదా స్వీడన్ కాదు. ఎవరి మనోభావాలకు, నమ్మకాలకు ఇబ్బంది కలగకుండా సినిమాలు ఉండేలా చూడడం సెన్సార్ బోర్డు పని. యువతను తప్పుదోవ పట్టించే చిత్రాలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకూడదు. బేషారమ్ రంగ్ పాటను అసభ్యకరంగా చిత్రీకరించారు. ఇతరుల ఫీలింగ్స్ను రెచ్చగొట్టేలా ఉన్న ఈ పాటను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించింది’’ అని ముకేష్ ఖన్నా ప్రశ్నించాడు.
This post was last modified on December 17, 2022 5:14 pm
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…