లాక్ డౌన్ టైంలో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి, కొన్ని వారాల పాటు తన హాస్య చతురతతో అలరించిన చిరంజీవి ఈమధ్య బాగా తక్కువ ట్వీటుతున్నారు. యమోత్సాహం చూపించిన యముడికి మొగుడు ఎందుకు సైలెంట్ అయిపోయాడనేది ఫాన్స్ కి అర్థం కావడం లేదు.
చిరంజీవి ట్వీట్స్ చూసేందుకే ట్విట్టర్ అకౌంట్లు మొదలు పెట్టిన వాళ్ళు కూడా పలువురు ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు నిరుత్సాహపడుతున్నారు. కరోనా క్రైసిస్ చారిటీకి సంబంధించి, తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళుతూ తనను పిలవనందుకు బాలకృష్ణ ఓపెన్ గా చిరంజీవిని ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి అప్పట్నుంచీ ముభావంగానే ఉంటున్నారు.
ఒకటీ అరా సోషల్ అవేర్నెస్ కలిగించే వీడియోలు తప్ప చిరులో ట్వీటింగ్ మొదలుపెట్టినప్పటి ఉత్సాహం అయితే లేదు. సినిమా పరిశ్రమ గురించిన విషయాల్లోనూ చిరంజీవి మునుపటి చొరవ చూపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
This post was last modified on July 17, 2020 4:55 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…