లాక్ డౌన్ టైంలో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి, కొన్ని వారాల పాటు తన హాస్య చతురతతో అలరించిన చిరంజీవి ఈమధ్య బాగా తక్కువ ట్వీటుతున్నారు. యమోత్సాహం చూపించిన యముడికి మొగుడు ఎందుకు సైలెంట్ అయిపోయాడనేది ఫాన్స్ కి అర్థం కావడం లేదు.
చిరంజీవి ట్వీట్స్ చూసేందుకే ట్విట్టర్ అకౌంట్లు మొదలు పెట్టిన వాళ్ళు కూడా పలువురు ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు నిరుత్సాహపడుతున్నారు. కరోనా క్రైసిస్ చారిటీకి సంబంధించి, తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళుతూ తనను పిలవనందుకు బాలకృష్ణ ఓపెన్ గా చిరంజీవిని ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి అప్పట్నుంచీ ముభావంగానే ఉంటున్నారు.
ఒకటీ అరా సోషల్ అవేర్నెస్ కలిగించే వీడియోలు తప్ప చిరులో ట్వీటింగ్ మొదలుపెట్టినప్పటి ఉత్సాహం అయితే లేదు. సినిమా పరిశ్రమ గురించిన విషయాల్లోనూ చిరంజీవి మునుపటి చొరవ చూపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
This post was last modified on July 17, 2020 4:55 pm
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…