సంక్రాంతికి నువ్వా నేనా అని తలపడుతున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల తాలూకు ప్రమోషన్లు వేగమందుకుంటున్నాయి. చిరు వైపు నుంచి బాస్ పార్టీ ఆల్రెడీ పాతిక మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుండగా జై బాలయ్య పాటతో పాటు తాజాగా సుగుణ సుందరి సాంగ్ తో తమన్ ఫ్యాన్స్ కి జోష్ ఇచ్చే పనిని కొనసాగిస్తున్నాడు. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో రెండూ రిలీజవుతున్న తరుణంలో మైత్రి మూవీ మేకర్స్ షూటింగ్ చివరి దశ పనులను వేగంగా పూర్తి చేసేందుకు పరుగులు పెడుతోంది. ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనే పరిస్థితి లేకపోవడంతో బ్యాలన్స్ చేయడమనే సవాల్ ని గట్టిగానే తలకెత్తుకుంది.
ఇప్పుడు అభిమానుల చూపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మీద ఉంది. ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు కానీ ఈ వేడుకలకు సంబంధించి ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. వాల్తేరు వీరయ్యది సముద్ర నేపథ్యంలో జరిగే కథ కాబట్టి దానికి అనుగుణంగా వైజాగ్ ని ఎంచుకున్నట్టు వినికిడి. ఇందుకుగాను స్పెషల్ గా హైదరాబాద్ నుంచి ట్రైన్ వేయించే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. ఇక వీరసింహారెడ్డిది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కాబట్టి సీమగడ్డని సెలెక్ట్ చేస్తారట. కర్నూలులో అఖండకు సంబంధించిన ఈవెంట్ చేశారు కాబట్టి ఈసారి అనంతపూర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇదే ఫైనల్ కావొచ్చు
వాల్తేరు వీరయ్య జనవరి 8న ఈవెంట్ జరిగే ప్రతిపాదన ఉండగా వీరసింహారెడ్డి నాలుగు లేదా ఆరో తేదీకి ప్లాన్ చేయొచ్చు. ఒకే రోజు నిర్వహించడం సాధ్యం కాదు కనక దానికి అనుగుణంగానే సెట్ చేయాల్సి ఉంటుంది. ఒకే ప్రొడక్షన్ ఒకే హీరోయిన్ అయినప్పటికీ మేకింగ్ తో మొదలుకుని పబ్లిసిటీ దాకా ప్రతిదాంట్లోనూ పోటీ కనిపిస్తున్న చిరు బాలయ్య అభిమానులను సంతృప్తి పరిచేలా రెండూ ఒకే రేంజ్ లో జరగాల్సి ఉంటుంది. గెస్టులు ఎవరు వస్తారు లేక వాటిలో చేసిన నటీనటులతోనే మేనేజ్ చేస్తారా లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఒక్కొక్కటిగా రోజులు గడిచేకొద్దీ రానున్నాయి.
This post was last modified on December 15, 2022 12:25 pm
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…