స‌మంత‌ని వదిలేసి దిల్ రాజుని పట్టుకున్నాడు?

చాలా త‌క్కువ టైంలో యూత్‌లో మంచి ఫాలోయింగ్, స్టార్ ఇమేజ్ సంపాదించి సంచ‌ల‌నం రేపాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఐతే వ‌చ్చిన స‌క్సెస్‌ను నిల‌బెట్టుకోవ‌డంలో అత‌ను కొంచెం త‌డ‌బ‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

డియ‌ర్ కామ్రేడ్, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్, లైగ‌ర్.. ఇలా వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు అత‌డి ఖాతాలో ప‌డ్డాయి. అంత‌కుముందు రెండు సినిమాల సంగ‌తేమో కానీ.. లైగ‌ర్ రిజ‌ల్ట్ మాత్రం విజ‌య్ కాన్ఫిడెన్స్‌ను బాగానే దెబ్బ తీసిన‌ట్లు క‌నిపిస్తోంది. దాన్నుంచి వెంట‌నే బ‌య‌టికి వ‌ద్దామ‌న్నా కుద‌ర‌డం లేదు.

స‌మంత‌తో చేస్తున్న ఖుషి మూవీ ఆమె అనారోగ్యం కార‌ణంగా తాత్కాలికంగా ఆగిన సంగ‌తి తెలిసిందే. వేరే సినిమాను మొద‌లుపెడ‌దామ‌ని విజ‌య్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఒక కొలిక్కి రావ‌డానికి టైం ప‌ట్టింది. జెర్సీ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరితో క‌థా చ‌ర్చ‌లు జ‌రిపిన విజ‌య్ అత‌డితో సినిమాను ముందుకు తీసుకెళ్ల‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.

ఐతే ఈ సినిమాకు నిర్మాత‌ను సెట్ చేసుకోవ‌డంలో కొంచెం టైం ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. ఐతే అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టులోకి రావ‌డంతో టెన్ష‌న్ లేక‌పోయింది. ఆయ‌న స్క్రిప్టు విష‌యంలో కొన్ని అభ్యంత‌రాలు చెప్ప‌డం.. ఆ మేర‌కు మార్పులు చేర్పులు చేయ‌డం.. అంతా ఓకే అనుకుని షూటింగ్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం అన్నీ జ‌రిగిపోయిన‌ట్లు స‌మాచారం. రాజు ప‌చ్చ జెండా ఊప‌డంతో మ‌రి కొన్ని రోజుల్లోనే ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్ల‌బోతున్నార‌ట‌.

విజ‌య్ మంచి ఫాంలో ఉండ‌గా అత‌డితో సినిమా చేయ‌డానికి రాజు గ‌ట్టిగా ప్ర‌య‌త్నించాడు. కానీ కుద‌ర్లేదు. కానీ ఇప్పుడు విజ‌య్ వ‌రుస ఫెయిల్యూర్ల‌తో ఇబ్బంది ప‌డుతున్న టైంలో అత‌ను రాజుకు దొరికాడు. రామ్ చ‌ర‌ణ్‌తో ఒక సినిమా ఓకే అయిన‌ట్లే అయి క్యాన్సిల్ కావ‌డంతో గౌత‌మ్‌కు విజ‌య్‌తో హిట్టు కొట్టి త‌నేంటో రుజువు చేసుకోవ‌డం చాలా అవ‌స‌రం.