రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో బాలీవుడ్ మూవీ పఠాన్కు సంబంధించిన ఒక పాటపై పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. బేషారం రంగ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ పాటలో హీరోయిన్ దీపికా పదుకొనే ఒక రేంజిలో ఎక్స్పోజింగ్ చేసింది. దీపికా అందాలు ఆరబోయడం కొత్తేమీ కాదు కానీ.. ఈ పాటలో ఆమె డ్రెస్సింగ్, హావభావాలు, అందాలను ప్రదర్శించిన తీరు వేరే లెవెల్ అన్నట్లే ఉన్నాయి.
మామూలుగా అయితే యూత్ ఇలాంటి వాటిని బాగానే ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ మధ్య బాలీవుడ్ సినిమాలను సిల్లీ కారణాలు వెతుక్కుని టార్గెట్ చేస్తున్న బాయ్కాట్ బ్యాచ్కు దీపికా ఎక్స్పోజింగ్ ఒక ఆయుధం లాగా మారిపోయింది. ఆమె డ్రెస్సింగ్ గురించి, ఎక్స్పోజింగ్ గురించి రెండు రోజులుగా విపరీతంగా ట్రోల్ చేస్తోంది ఆ వర్గం.
ఐతే దీపికను మామూలు వ్యక్తులు ట్రోల్ చేయడం వేరు. కానీ ఈ వ్యవహారంలోకి ఒక మంత్రి ఎంటర్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. మధ్యప్రదేశ్కు చెందిన బీజేపి నేత, మంత్రి నరోత్తమ్ మిశ్రా.. బేషారం రంగ్ పాటలో దీపిక డ్రెస్సింగ్ మీద అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పాటలో దీపిక వస్త్రధారణ ఏమాత్రం బాగా లేదని, ఒక డర్టీ మైండ్సెట్తో ఈ పాటను చిత్రీకరించినట్లు అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పాటలోని సన్నివేశాలను, అలాగే దీపిక డ్రెస్సింగ్ను కరెక్ట్ చేయాల్సిన అవసరముందని ఆయనన్నారు. అలా చేయని పక్షంలో పఠాన్ సినిమాను మధ్య ప్రదేశ్లో రిలీజ్ చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన హెచ్చరిక జారీ చేయడం గమనార్హం.
ఐతే మంత్రి గారి కామెంట్ మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సినిమాలకు సెన్సార్షిప్ చేసే బాధ్యతను మంత్రులు ఎప్పుడు తీసుకున్నారు.. హీరోయిన్ డ్రెస్సింగ్ మీద మంత్రి కామెంట్ చేయడం ఏంటి అంటూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on December 15, 2022 7:25 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…