ఇటీవల తెలుగు కమర్షియల్ సినిమాలపై సెటైర్ వేసి స్టార్ హీరోల అభిమానుల ఆగ్రహం చవిచూసిన యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన తదుపరి చిత్రాన్ని వెంకటేష్ తో చేయబోతున్నాడు. కరోనా విపత్తు వల్ల వెంకటేష్ షెడ్యూల్స్ డిస్టర్బ్ అవడంతో ఆ చిత్రం మొదలు కావడానికి మరింత సమయం పడుతుంది. అందుకే ఈలోగా తరుణ్ భాస్కర్ వేరే పనులతో బిజీ అవుతున్నాడు.
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు డైరెక్ట్ చేసి, సడన్ గా నటన వైపు దృష్టి మరల్చిన తరుణ్ భాస్కర్ మంచి రచయిత కూడా. అందుకే అతనితో ఓ మై కడవులే చిత్రానికి మాటలు రాయించుకుంటున్నారు. ఇందుకోసం తరుణ్ కి భారీ పారితోషికమే ఇచ్చినట్టు భోగట్టా. మాములుగా డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఇక అదే పని మీద ఉంటారు కానీ, తరుణ్ మాత్రం ప్రతి కథ రాయడానికి తగినంత సమయం తీసుకుంటాడు.
అయితే ఈలోగా సమయం వృధా చేయకుండా అటు నటిస్తూ, ఇటు సంభాషణలు కూడా రాస్తూ అటు క్రియేటివ్ గా యాక్టివ్ గా ఉంటూ, ఇటు క్యాష్ ఇన్ ఫ్లో కూడా ఉండేట్టు చూసుకుంటున్నాడు.
This post was last modified on July 17, 2020 4:51 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…