ఇటీవల తెలుగు కమర్షియల్ సినిమాలపై సెటైర్ వేసి స్టార్ హీరోల అభిమానుల ఆగ్రహం చవిచూసిన యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన తదుపరి చిత్రాన్ని వెంకటేష్ తో చేయబోతున్నాడు. కరోనా విపత్తు వల్ల వెంకటేష్ షెడ్యూల్స్ డిస్టర్బ్ అవడంతో ఆ చిత్రం మొదలు కావడానికి మరింత సమయం పడుతుంది. అందుకే ఈలోగా తరుణ్ భాస్కర్ వేరే పనులతో బిజీ అవుతున్నాడు.
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు డైరెక్ట్ చేసి, సడన్ గా నటన వైపు దృష్టి మరల్చిన తరుణ్ భాస్కర్ మంచి రచయిత కూడా. అందుకే అతనితో ఓ మై కడవులే చిత్రానికి మాటలు రాయించుకుంటున్నారు. ఇందుకోసం తరుణ్ కి భారీ పారితోషికమే ఇచ్చినట్టు భోగట్టా. మాములుగా డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఇక అదే పని మీద ఉంటారు కానీ, తరుణ్ మాత్రం ప్రతి కథ రాయడానికి తగినంత సమయం తీసుకుంటాడు.
అయితే ఈలోగా సమయం వృధా చేయకుండా అటు నటిస్తూ, ఇటు సంభాషణలు కూడా రాస్తూ అటు క్రియేటివ్ గా యాక్టివ్ గా ఉంటూ, ఇటు క్యాష్ ఇన్ ఫ్లో కూడా ఉండేట్టు చూసుకుంటున్నాడు.
This post was last modified on July 17, 2020 4:51 pm
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…