నాగ చైతన్య రెండు సినిమాల మధ్య ‘దూత’ అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. థాంక్యూ షూట్ జరుగుతుండగానే దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన థ్రిల్లర్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి షూట్ కంప్లీట్ చేసేశాడు చైతు. ఎనౌన్స్ మెంట్ కూడా భారీ గా చేశారు. ఇందులో చైతు లుక్ చూసి అక్కినేని ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. టీజర్ కూడా వదిలారు. ఇవన్నీ జరిగి రెండు మూడు నెలలు పైనే అవుతుంది. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థకి రైట్స్ ఇచ్చేశారు.
కానీ ఈ సిరీస్ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేని పరిస్థితి. ఇప్పటి వరకు దూత రిలీజ్ కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. చైతూ వెంకట్ ప్రభుతో చేస్తున్న కస్టడీ షూటింగ్ తో బిజీ అయిపోయాడు. ఇక విక్రం కుమార్ కూడా నెక్స్ట్ సినిమా సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఈ మధ్యే కొంత రీ షూట్ చేశారని తెలుస్తుంది. బహుశ ఆ కారణం చేతే ఈ సిరీస్ ని హోల్డ్ చేస్తున్నారా ? తెలియాల్సి ఉంది.
ఓటీటీ సంస్థలు సిరీస్ ల విషయంలో ఓ లైనప్ మైంటైన్ చేస్తుంటారు. నెలల గ్యాప్ లో ఒక్కొక్కటి వదులుతుంటారు. కానీ రాబోయే లిస్టు ఇది అంటూ ఓ ప్రీ ఎనౌన్స్ మెంట్ చేస్తుంటారు. కానీ ధూత రిలీజ్ గురించి Amazon నోరు మెదపడం లేదు. పైగా ఎనౌన్స్ చేసి ఇన్ని నెలలవుతుంది. మరి ధూత రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్తారో ? ఈ సిరీస్ తో చైతూ ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి ఫీడ్ బ్యాక్ అందుకుంటాడో ?
This post was last modified on December 14, 2022 8:05 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…