‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమాలకు సంగీత దర్శకులను సెట్ చేసుకోవడం ఇబ్బందయిపోతోంది. అతడి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. టాలీవుడ్ సంగీత దర్శకుల్ని ఎంచుకుంటే పాన్ ఇండియా అప్పీల్ ఉన్న మ్యూజిక్ ఇవ్వగలరో లేదన్న సందేహం. అలాగని బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టుకుందామంటే.. వాళ్లు మన వాళ్ల అభిరుచికి తగ్గ మ్యూజిక్ ఇస్తారో లేదో అని డౌట్.
ఈ సందిగ్ధతతోనే ‘సాహో’ సినిమా రిలీజ్ ముంగిట సంగీత విషయంలో చాలా తర్జన భర్జనలు నడిచాయి. చివరికి వివిధ భాషలకు చెందిన సంగీత దర్శకులతో వేర్వేరుగా పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేయించుకున్నారు. ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోయింది.
దీని తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ విషయంలోనూ ఇదే సందిగ్ధత నడుస్తోంది. ఈ సినిమా మొదలై ఏడాది దాటినా ఇప్పటిదాకా సంగీత దర్శకుడు ఖరారవ్వలేదు. మొన్న ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలితే.. దాని మీద సంగీత దర్శకుడి పేరు కనిపించలేదు. ఈ గందరగోళం ఇంకెంతో కాలం కొనసాగితే బాగుండదని సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహమాన్ను గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఐతే ఆయన ఈ సినిమాకు పని చేయడం సందేహంగానే కనిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయి అయినా సరే.. తెలుగు సినిమా చేయడానికి రెహమాన్ అంతగా ఆసక్తి చూపించరు. ‘సైరా’ సినిమాకు కూడా ఒప్పుకున్నట్లే ఒప్పుకుని తప్పుకున్నారు. ‘రాధే శ్యామ్’ విషయంలో ఏం చేస్తారో చూడాలి. ఆయన కాదంటే తమన్ను ఫిక్స్ చేయాలని చూస్తోందట చిత్ర బృందం. ఇదే నిజమైతే తమన్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఛాన్స్ అందుకున్నట్లే.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…