పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో హరీష్ శంకర్ సినిమా కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఎనిమిదేళ్లకు వీరి కలయికలో సినిమాను అనౌన్స్ చేశారు. కానీ రెండేళ్ల పాటు ఈ చిత్రం ప్రకటనలకే పరిమితం అయింది. ఐతే ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమాకు ప్రారంభోత్సవం జరిపారు. ఆదివారం సినిమాకు ముహూర్త వేడుకు నిర్వహించడంతో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే కొత్త టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
ఐతే ఈ సినిమాకు ప్రారంభోత్సవం అయితే జరిపారు కానీ.. ఇప్పట్లో షూటింగ్ ఉండదేమో అని చాలామంది సందేహించారు. కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ సోమవారం ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగినట్లు సమాచారం. అలా అని ఈ షెడ్యూల్ ఇలాగే కొనసాగుతుందని అనుకుంటే పొరబాటే. ‘ద్వితీయ విఘ్నం’ సెంటిమెంటు కోణంలో ఈ ఒక్క రోజు ఇలా చేసినట్లు చర్చించుకుంటున్నారు.
హరీష్ దర్శకత్వంలో పవన్ సినిమాను అనౌన్స్ చేశాక ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఎంతకూ ముందుకు కదల్లేదు. ఒక దశలో ఈ ప్రాజెక్టును పవన్ పక్కన పెట్టేసినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ గత రెండు వారాల్లో అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. ఈ ప్రాజెక్టు లైన్లోకి వచ్చింది. కాకపోతే ముందు అనుకున్న కథను పక్కన పెట్టి ‘తెరి’ రీమేక్ను పట్టాలెక్కిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అదెంత వరకు నిజమన్నది తెలియడం లేదు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కథ విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నదే పవన్ ఆలోచన అట. ఐతే తర్వాత పవన్ మనసు ఎలా మారుతుందో.. ఈ సినిమా చిత్రీకరణ ఎంత మేర సజావుగా సాగుతుందో తెలియడం లేదు. ఇంతకుముందు అనుభవాలు ఈసారి పునరావృతం కాకుండా.. రెండో రోజు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి అంతా సానుకూలంగా జరగాలన్న సెంటిమెంటుతో చిత్ర బృందం ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on December 12, 2022 9:44 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…