Movie News

పవన్‌తో హరీష్ షూటింగ్ కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ సినిమా కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఎనిమిదేళ్లకు వీరి కలయికలో సినిమాను అనౌన్స్ చేశారు. కానీ రెండేళ్ల పాటు ఈ చిత్రం ప్రకటనలకే పరిమితం అయింది. ఐతే ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమాకు ప్రారంభోత్సవం జరిపారు. ఆదివారం సినిమాకు ముహూర్త వేడుకు నిర్వహించడంతో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే కొత్త టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

ఐతే ఈ సినిమాకు ప్రారంభోత్సవం అయితే జరిపారు కానీ.. ఇప్పట్లో షూటింగ్ ఉండదేమో అని చాలామంది సందేహించారు. కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ సోమవారం ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగినట్లు సమాచారం. అలా అని ఈ షెడ్యూల్ ఇలాగే కొనసాగుతుందని అనుకుంటే పొరబాటే. ‘ద్వితీయ విఘ్నం’ సెంటిమెంటు కోణంలో ఈ ఒక్క రోజు ఇలా చేసినట్లు చర్చించుకుంటున్నారు.

హరీష్ దర్శకత్వంలో పవన్ సినిమాను అనౌన్స్ చేశాక ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఎంతకూ ముందుకు కదల్లేదు. ఒక దశలో ఈ ప్రాజెక్టును పవన్ పక్కన పెట్టేసినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ గత రెండు వారాల్లో అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. ఈ ప్రాజెక్టు లైన్లోకి వచ్చింది. కాకపోతే ముందు అనుకున్న కథను పక్కన పెట్టి ‘తెరి’ రీమేక్‌ను పట్టాలెక్కిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అదెంత వరకు నిజమన్నది తెలియడం లేదు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కథ విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నదే పవన్ ఆలోచన అట. ఐతే తర్వాత పవన్ మనసు ఎలా మారుతుందో.. ఈ సినిమా చిత్రీకరణ ఎంత మేర సజావుగా సాగుతుందో తెలియడం లేదు. ఇంతకుముందు అనుభవాలు ఈసారి పునరావృతం కాకుండా.. రెండో రోజు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి అంతా సానుకూలంగా జరగాలన్న సెంటిమెంటుతో చిత్ర బృందం ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on December 12, 2022 9:44 pm

Share

Recent Posts

లక్షల్లో తీసిన చెత్త సినిమా… కోట్లలో కలెక్షన్లు

ఒక చిన్న వేడుక చేయడానికే కనీసం లక్ష రూపాయలు ఖర్చయ్యే సొసైటీలో ఉన్నాం మనం. అలాంటిది కేవలం రెండు నుంచి…

48 minutes ago

రజిని సినిమాలో విలన్… రాపో పెద్ద రిస్కు?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ధర్మన్ షూటింగ్ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే…

1 hour ago

శ్రీలీల మిస్సయ్యింది మమిత సాధించింది

ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఇరవై, పాతిక వయసు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కానీ వాటిని ఎంచుకోవడం,…

2 hours ago

డీఎస్సీ నిర్వహణ సూపర్… లోకేష్ కు ఢిల్లీ మంత్రి అభినందనలు

రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…

4 hours ago

మూడో బిడ్డను కంటే సంవత్సరం సెలవు

దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…

5 hours ago

వెంకీ త్రివిక్రమ్… ఇంకా ఆ ఒక్క కిక్ రాలేదే!

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. దీని మీద మంచి…

5 hours ago