బాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన కంగనా రనౌత్.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది. బాలీవుడ్లో ఇంకా అంతగా నిలదొక్కుకోని సమయంలోనే ఆమె తమిళంలో ధూమ్ ధామ్, తెలుగులో ఏక్ నిరంజన్ చిత్రాల్లో నటించింది. ఆ రెండూ ఆమెకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
ఐతే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత, తాను బాలీవుడ్లో పెద్ద స్టార్గా ఎదిగాక.. జయలలిత బయోపిక్లో నటించింది కంగనా. తలైవి పేరుతో ఎ.ఎల్.విజయ్ రూపొందించిన ఈ సినిమా సైతం కంగనాకు చేదు అనుభవమే మిగిల్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పెద్ద డిజాస్టర్గా నిలిచింది. దక్షిణాదిన కంగనాకు అస్సలు కంగనాకు అస్సలు కలిసి రాకపోవడంతో ఇక మళ్లీ ఆమె ఇటు వైపు చూడదనే అనుకున్నారంతా. కానీ ఆమెకు మాత్రం సౌత్ మీద మోజు పోయినట్లు లేదు. ఓ పెద్ద సినిమాలో కీలక పాత్ర చేయబోతోంది.
లారెన్స్ కథానాయకుడిగా సీనియర్ దర్శకుడు పి.వాసు రూపొందిస్తున్న చంద్రముఖి-2లో లీడ్ హీరోయిన్ పాత్రకు కంగనా రనౌత్ ఎంపిక కావడం విశేషం. ఆమె ఇలాంటి సినిమాలో నటిస్తుందని ఎవరూ అనుకోరు. నిజానికి ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు కాజల్ అగర్వాల్ను అనుకున్నారు. కానీ ఆమె పెళ్లి చేసుకుని బిడ్డకు తల్లి కావడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తర్వాత హీరోయిన్ పాత్రకు రకరకాల పేర్లు వినిపించాయి కానీ.. వాళ్లెవ్వరూ ఖరారు కాలేదు.
ఐతే చివరికి కంగనా రనౌత్ను ఈ పాత్రకు ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ చంద్రముఖికి సీక్వెల్గా కన్నడలో, తెలుగులో సినిమాలు తీశాడు పి.వాసు. ఐతే తమిళంలో తీయబోయే సీక్వెల్ భిన్నమైందని తెలుస్తోంది. రజినీకాంత్ వీరాభిమాని అయిన లారెన్స్ ఆయన పాత్రను కొనసాగించబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
This post was last modified on December 11, 2022 10:18 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…