బాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన కంగనా రనౌత్.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది. బాలీవుడ్లో ఇంకా అంతగా నిలదొక్కుకోని సమయంలోనే ఆమె తమిళంలో ధూమ్ ధామ్, తెలుగులో ఏక్ నిరంజన్ చిత్రాల్లో నటించింది. ఆ రెండూ ఆమెకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
ఐతే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత, తాను బాలీవుడ్లో పెద్ద స్టార్గా ఎదిగాక.. జయలలిత బయోపిక్లో నటించింది కంగనా. తలైవి పేరుతో ఎ.ఎల్.విజయ్ రూపొందించిన ఈ సినిమా సైతం కంగనాకు చేదు అనుభవమే మిగిల్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పెద్ద డిజాస్టర్గా నిలిచింది. దక్షిణాదిన కంగనాకు అస్సలు కంగనాకు అస్సలు కలిసి రాకపోవడంతో ఇక మళ్లీ ఆమె ఇటు వైపు చూడదనే అనుకున్నారంతా. కానీ ఆమెకు మాత్రం సౌత్ మీద మోజు పోయినట్లు లేదు. ఓ పెద్ద సినిమాలో కీలక పాత్ర చేయబోతోంది.
లారెన్స్ కథానాయకుడిగా సీనియర్ దర్శకుడు పి.వాసు రూపొందిస్తున్న చంద్రముఖి-2లో లీడ్ హీరోయిన్ పాత్రకు కంగనా రనౌత్ ఎంపిక కావడం విశేషం. ఆమె ఇలాంటి సినిమాలో నటిస్తుందని ఎవరూ అనుకోరు. నిజానికి ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు కాజల్ అగర్వాల్ను అనుకున్నారు. కానీ ఆమె పెళ్లి చేసుకుని బిడ్డకు తల్లి కావడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తర్వాత హీరోయిన్ పాత్రకు రకరకాల పేర్లు వినిపించాయి కానీ.. వాళ్లెవ్వరూ ఖరారు కాలేదు.
ఐతే చివరికి కంగనా రనౌత్ను ఈ పాత్రకు ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ చంద్రముఖికి సీక్వెల్గా కన్నడలో, తెలుగులో సినిమాలు తీశాడు పి.వాసు. ఐతే తమిళంలో తీయబోయే సీక్వెల్ భిన్నమైందని తెలుస్తోంది. రజినీకాంత్ వీరాభిమాని అయిన లారెన్స్ ఆయన పాత్రను కొనసాగించబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
This post was last modified on December 11, 2022 10:18 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…