బాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన కంగనా రనౌత్.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది. బాలీవుడ్లో ఇంకా అంతగా నిలదొక్కుకోని సమయంలోనే ఆమె తమిళంలో ధూమ్ ధామ్, తెలుగులో ఏక్ నిరంజన్ చిత్రాల్లో నటించింది. ఆ రెండూ ఆమెకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
ఐతే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత, తాను బాలీవుడ్లో పెద్ద స్టార్గా ఎదిగాక.. జయలలిత బయోపిక్లో నటించింది కంగనా. తలైవి పేరుతో ఎ.ఎల్.విజయ్ రూపొందించిన ఈ సినిమా సైతం కంగనాకు చేదు అనుభవమే మిగిల్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పెద్ద డిజాస్టర్గా నిలిచింది. దక్షిణాదిన కంగనాకు అస్సలు కంగనాకు అస్సలు కలిసి రాకపోవడంతో ఇక మళ్లీ ఆమె ఇటు వైపు చూడదనే అనుకున్నారంతా. కానీ ఆమెకు మాత్రం సౌత్ మీద మోజు పోయినట్లు లేదు. ఓ పెద్ద సినిమాలో కీలక పాత్ర చేయబోతోంది.
లారెన్స్ కథానాయకుడిగా సీనియర్ దర్శకుడు పి.వాసు రూపొందిస్తున్న చంద్రముఖి-2లో లీడ్ హీరోయిన్ పాత్రకు కంగనా రనౌత్ ఎంపిక కావడం విశేషం. ఆమె ఇలాంటి సినిమాలో నటిస్తుందని ఎవరూ అనుకోరు. నిజానికి ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు కాజల్ అగర్వాల్ను అనుకున్నారు. కానీ ఆమె పెళ్లి చేసుకుని బిడ్డకు తల్లి కావడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తర్వాత హీరోయిన్ పాత్రకు రకరకాల పేర్లు వినిపించాయి కానీ.. వాళ్లెవ్వరూ ఖరారు కాలేదు.
ఐతే చివరికి కంగనా రనౌత్ను ఈ పాత్రకు ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ చంద్రముఖికి సీక్వెల్గా కన్నడలో, తెలుగులో సినిమాలు తీశాడు పి.వాసు. ఐతే తమిళంలో తీయబోయే సీక్వెల్ భిన్నమైందని తెలుస్తోంది. రజినీకాంత్ వీరాభిమాని అయిన లారెన్స్ ఆయన పాత్రను కొనసాగించబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
This post was last modified on December 11, 2022 10:18 am
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…