బాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్లో మిగతా వాళ్లందరిదీ ఒక దారి అయిత.. కమల్.ఆర్.ఖాన్ది ఇంకో దారి. సోషల్ మీడియాలో అదే పనిగా స్టార్ హీరోలను, నిర్మాతలను టార్గెట్ చేస్తూ నెగెటివ్ కామెంట్లు చేయడం.. సినిమాల గురించి కూడా సంచలనంగా ఏదో ఒకటి మాట్లాడడం ద్వారా అతను నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటాడు. అతణ్ని చాలామంది తిట్టుకుంటూనే తనను ఫాలో అవుతుంటారు. తన పోస్టులు, వీడియోలు చూస్తుంటారు. అలా అతడి ఫాలోయింగ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది.
మిలియన్లలో ఫాలోవర్లు ఉన్న వ్యక్తి కావడంతో అతణ్ని బాలీవుడ్ కూడా విస్మరించలేకపోతుంటుంది. భారీ చిత్రాలను టార్గెట్ చేస్తూ కొన్నిసార్లు అసత్యాలను కూడా ప్రచారం చేస్తుంటాడు కమల్. ఇప్పుడు రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ మీదా అలాంటి కామెంట్లే చేశాడు. ఈ సినిమా వల్ల నిర్మాతలకు రూ.200 కోట్లు నష్టం వచ్చిందంటూ అతను స్టేట్మెంట్ ఇచ్చాడు.
2022 సంవత్సరం చివరికి వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది హిట్లు, ఫ్లాపులు అంటూ మీడియా వాళ్లు విశ్లేషించడం మామూలే. కమల్ కూడా అదే పని చేశాడు. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అంటూ లిస్టు ఇచ్చాడు. అందులో ‘బ్రహ్మాస్త’తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ను కూడా చేర్చేశాడు. ‘బ్రహ్మాస్త్ర’కు రూ.300 కోట్లు, ‘ఆర్ఆర్ఆర్’కు రూ.200 కోట్లు నష్టం వచ్చిందని పేర్కొన్నాడు. ‘బ్రహ్మాస్త్ర’ విషయంలో అతను కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్పి ఉండొచ్చు కానీ.. ఆ సినిమాకు నష్టం వచ్చిన మాట వాస్తవం. నిర్మాతలు, బయ్యర్ల పెట్టుబడిని అది పూర్తి స్థాయిలో రికవర్ చేయలేదు. అది ఫ్లాప్ అనడంలో సందేహం లేదు.
కానీ ‘ఆర్ఆరఆర్’కు ఎక్కడా నష్టం అన్న మాటే లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ఆ చిత్రం చాలా బాగా ఆడింది. భారీ వసూళ్లను తెచ్చుకుంది. ‘బాహుబలి’ స్థాయిలో భారీ లాభాలు తెచ్చి ఉండకపోవచ్చు కానీ.. ఆ సినిమాకు నష్టమైతే లేదు. అది హిట్ మూవీ అనడంలో సందేహమే లేదు. కానీ రాజమౌళిని టార్గెట్ చేస్తే మైలేజీ వస్తుంది కాబట్టే కమల్ ఈ ఎత్తుగడ వేశాడన్నది స్పష్టం.
This post was last modified on December 8, 2022 5:43 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…