బాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్లో మిగతా వాళ్లందరిదీ ఒక దారి అయిత.. కమల్.ఆర్.ఖాన్ది ఇంకో దారి. సోషల్ మీడియాలో అదే పనిగా స్టార్ హీరోలను, నిర్మాతలను టార్గెట్ చేస్తూ నెగెటివ్ కామెంట్లు చేయడం.. సినిమాల గురించి కూడా సంచలనంగా ఏదో ఒకటి మాట్లాడడం ద్వారా అతను నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటాడు. అతణ్ని చాలామంది తిట్టుకుంటూనే తనను ఫాలో అవుతుంటారు. తన పోస్టులు, వీడియోలు చూస్తుంటారు. అలా అతడి ఫాలోయింగ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది.
మిలియన్లలో ఫాలోవర్లు ఉన్న వ్యక్తి కావడంతో అతణ్ని బాలీవుడ్ కూడా విస్మరించలేకపోతుంటుంది. భారీ చిత్రాలను టార్గెట్ చేస్తూ కొన్నిసార్లు అసత్యాలను కూడా ప్రచారం చేస్తుంటాడు కమల్. ఇప్పుడు రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ మీదా అలాంటి కామెంట్లే చేశాడు. ఈ సినిమా వల్ల నిర్మాతలకు రూ.200 కోట్లు నష్టం వచ్చిందంటూ అతను స్టేట్మెంట్ ఇచ్చాడు.
2022 సంవత్సరం చివరికి వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది హిట్లు, ఫ్లాపులు అంటూ మీడియా వాళ్లు విశ్లేషించడం మామూలే. కమల్ కూడా అదే పని చేశాడు. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అంటూ లిస్టు ఇచ్చాడు. అందులో ‘బ్రహ్మాస్త’తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ను కూడా చేర్చేశాడు. ‘బ్రహ్మాస్త్ర’కు రూ.300 కోట్లు, ‘ఆర్ఆర్ఆర్’కు రూ.200 కోట్లు నష్టం వచ్చిందని పేర్కొన్నాడు. ‘బ్రహ్మాస్త్ర’ విషయంలో అతను కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్పి ఉండొచ్చు కానీ.. ఆ సినిమాకు నష్టం వచ్చిన మాట వాస్తవం. నిర్మాతలు, బయ్యర్ల పెట్టుబడిని అది పూర్తి స్థాయిలో రికవర్ చేయలేదు. అది ఫ్లాప్ అనడంలో సందేహం లేదు.
కానీ ‘ఆర్ఆరఆర్’కు ఎక్కడా నష్టం అన్న మాటే లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ఆ చిత్రం చాలా బాగా ఆడింది. భారీ వసూళ్లను తెచ్చుకుంది. ‘బాహుబలి’ స్థాయిలో భారీ లాభాలు తెచ్చి ఉండకపోవచ్చు కానీ.. ఆ సినిమాకు నష్టమైతే లేదు. అది హిట్ మూవీ అనడంలో సందేహమే లేదు. కానీ రాజమౌళిని టార్గెట్ చేస్తే మైలేజీ వస్తుంది కాబట్టే కమల్ ఈ ఎత్తుగడ వేశాడన్నది స్పష్టం.
This post was last modified on December 8, 2022 5:43 pm
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…