Movie News

సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ?

ప్రస్తుతం ఇండియా మొత్తంలో ఉత్తమ నటీమణుల జాబితా తీస్తే సాయిపల్లవి పేరు అందులో తప్పకుండా ఉంటుంది. దక్షిణాదిన అంతటా ఆమెకు తిరుగులేని గుర్తింపు ఉంది. కేవలం సాయిపల్లవి అనే పేరు చూసి థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య చాలా పెద్దదే. మలయాళం, తమిళం, తెలుగు.. ఇలా పలు భాషల్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. కన్నడిగులు సైతం ఆమెను అభిమానిస్తారు.

ఇక సాయిపల్లవి జెండా ఎగరేయాల్సింది ఉత్తరాదినే. ఆమెకు ఇంతకుముందే బాలీవుడ్ ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. సినిమాల విషయంలో ఆమె ఎంత చూజీగా ఉంటుందో తెలిసిందే. ఐతే ఎట్టకేలకు సాయిపల్లవి ఓ హిందీ సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో సాయిపల్లవి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

రామాయణ గాథ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రణబీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తారట. ముందు ఈ పాత్ర కోసం దీపికా పదుకొనేను అనుకున్నారని.. ఆ తర్వాత కరీనా కపూర్ పేరు కూడా తెర మీదికి వచ్చిందని. కానీ ప్రస్తుత దశలో వాళ్లు ఈ పాత్రకు సెట్ కాదనే ఉద్దేశంతో సాయిపల్లవిని సంప్రదించారని.. భారీ ప్రాజెక్టు కావడం, అందులోనూ సీత పాత్ర కావడంతో సాయిపల్లవి ఓకే చెప్పిందని అంటున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ రావణాసురుడి పాత్ర చేస్తాడని కూడా ప్రచారం సాగిస్తున్నారు.

ఈ కాంబినేషన్ అయితే క్రేజీగానే అనిపిస్తోంది కానీ.. ఆల్రెడీ ‘ఆదిపురుష్’ రామాయణం నేపథ్యంలో తెరకెక్కింది.. మరోవైపు అల్లు అరవింద్ రామాయణం నేపథ్యంలో ఓ ప్రాజెక్టు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి కొత్తగా అదే కథతో ఇంకో సినిమా ఏంటి అన్నదే డౌటు. ప్రస్తుతానికి దక్షిణాదిన సాయిపల్లవి పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు.

This post was last modified on December 7, 2022 7:58 pm

Share

Recent Posts

జాన్విని మ‌ళ్లీ చూస్తామా?

బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేట‌స్ సంపాదించాక‌, తెలుగులో…

4 hours ago

చివరి సినిమా చేదు జ్ఞాపకమే అయ్యింది

గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…

5 hours ago

వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కేసులు కొన‌సాగుతున్నాయి. అనేక మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదై... ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి.…

5 hours ago

‘జగన్ వస్తున్నారా.. అయితే మూతే’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…

5 hours ago

వైసీపీకి చెక్‌: మండలి వైస్ చైర్మన్‌పై కూటమి కీలక నిర్ణయం!

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…

5 hours ago

గంజాయి బ్యాచ్ హద్దులు మీరుతుంది

హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…

5 hours ago