Waltair Veerayya Release Date: రోజురోజుకి రసవత్తరంగా మారుతున్న సంక్రాంతి పందెంలో మరో రిలీజ్ డేట్ ఖరారయ్యింది. మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూసిన వాల్తేర్ వీరయ్య విడుదల తేదీని జనవరి 13కి లాక్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చేశారు. నిజానికీ ఈ లీక్ వారం ముందు నుందే మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటీ అనూహ్యంగా మారుతున్న పరిస్థితుల్లో ఏదైనా ట్విస్టు ఉంటుందేమోనని అభిమానులు ఎదురు చూశారు. అలాంటిదేమీ లేకుండా ఫైనల్ చేశారు. సో అందరికంటే చివరగా వస్తున్నది చిరంజీవే అవుతారు. 12న వారసుడు, వీరసింహారెడ్డిలు అదే రోజు లేదా 11న తెగింపు రాబోతున్నాయి.
ఇలా చేయడం వల్ల ఓపెనింగ్స్ మీద కొంత ప్రభావంతో పాటు ముందొచ్చినవి థియేటర్లను ఎక్కువగా తీసేసుకుంటాయనే టెన్షన్ ఫ్యాన్స్ లో లేకపోలేదు. అయితే పండగ తేదీలు 14, 15 కావడంతో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనక ఈజీగా నిలదొక్కుకోవచ్చనేది వీరయ్య హీరో నిర్మాతల ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవేళ వీరసింహారెడ్డికి ఇదే స్పందన వస్తే మాత్రం చిక్కులు తప్పవు. వారసుడు తాలూకు రచ్చ ఇంకా పూర్తి కాలేదు. ఫిలిం ఛాంబర్ విన్నపాలతో పాటు వైజాగ్ తదితర ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లకు స్ట్రెయిట్ సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలనే లేఖ అందిన నేపథ్యంలో రాబోయే పరిణామాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి.
నిర్మాత దిల్ రాజు వైపు నుంచి కేవలం ఒక న్యూస్ ఛానల్ లో ఇంటర్వ్యూ తప్ప పూర్తి క్లారిటీ రాలేదు. మీడియాతో నేరుగా మాట్లాడిన రోజు ఒక అంచనాకు రావొచ్చు. ఒకవేళ వారసుడు తెలుగు వెర్షన్ కనక రాజీ పడి విజయ్ మార్కెట్ కు తగ్గట్టు తగ్గట్టు తక్కువ స్క్రీన్లతో సర్దుకుంటే చిరు బాలయ్యలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సరిపడా థియేటర్లు ఉంటాయి కాబట్టి రిలీజ్ డేట్లు అటుఇటు అయినా సమస్య లేదు. ఇంకా పాట షూటింగ్ బ్యాలన్స్ ఉన్న వాల్తేర్ వీరయ్య చిరు శృతి హాసన్ లతో పాటు టీమ్ విదేశాలకు ప్రయాణం కానుంది. జనవరి మొదటివారంలోగా సెన్సార్ పూర్తి చేయనున్నారు.
This post was last modified on December 7, 2022 4:33 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…