Waltair Veerayya Release Date: రోజురోజుకి రసవత్తరంగా మారుతున్న సంక్రాంతి పందెంలో మరో రిలీజ్ డేట్ ఖరారయ్యింది. మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూసిన వాల్తేర్ వీరయ్య విడుదల తేదీని జనవరి 13కి లాక్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చేశారు. నిజానికీ ఈ లీక్ వారం ముందు నుందే మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటీ అనూహ్యంగా మారుతున్న పరిస్థితుల్లో ఏదైనా ట్విస్టు ఉంటుందేమోనని అభిమానులు ఎదురు చూశారు. అలాంటిదేమీ లేకుండా ఫైనల్ చేశారు. సో అందరికంటే చివరగా వస్తున్నది చిరంజీవే అవుతారు. 12న వారసుడు, వీరసింహారెడ్డిలు అదే రోజు లేదా 11న తెగింపు రాబోతున్నాయి.
ఇలా చేయడం వల్ల ఓపెనింగ్స్ మీద కొంత ప్రభావంతో పాటు ముందొచ్చినవి థియేటర్లను ఎక్కువగా తీసేసుకుంటాయనే టెన్షన్ ఫ్యాన్స్ లో లేకపోలేదు. అయితే పండగ తేదీలు 14, 15 కావడంతో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనక ఈజీగా నిలదొక్కుకోవచ్చనేది వీరయ్య హీరో నిర్మాతల ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవేళ వీరసింహారెడ్డికి ఇదే స్పందన వస్తే మాత్రం చిక్కులు తప్పవు. వారసుడు తాలూకు రచ్చ ఇంకా పూర్తి కాలేదు. ఫిలిం ఛాంబర్ విన్నపాలతో పాటు వైజాగ్ తదితర ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లకు స్ట్రెయిట్ సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలనే లేఖ అందిన నేపథ్యంలో రాబోయే పరిణామాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి.
నిర్మాత దిల్ రాజు వైపు నుంచి కేవలం ఒక న్యూస్ ఛానల్ లో ఇంటర్వ్యూ తప్ప పూర్తి క్లారిటీ రాలేదు. మీడియాతో నేరుగా మాట్లాడిన రోజు ఒక అంచనాకు రావొచ్చు. ఒకవేళ వారసుడు తెలుగు వెర్షన్ కనక రాజీ పడి విజయ్ మార్కెట్ కు తగ్గట్టు తగ్గట్టు తక్కువ స్క్రీన్లతో సర్దుకుంటే చిరు బాలయ్యలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సరిపడా థియేటర్లు ఉంటాయి కాబట్టి రిలీజ్ డేట్లు అటుఇటు అయినా సమస్య లేదు. ఇంకా పాట షూటింగ్ బ్యాలన్స్ ఉన్న వాల్తేర్ వీరయ్య చిరు శృతి హాసన్ లతో పాటు టీమ్ విదేశాలకు ప్రయాణం కానుంది. జనవరి మొదటివారంలోగా సెన్సార్ పూర్తి చేయనున్నారు.
This post was last modified on December 7, 2022 4:33 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…