టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, మీడియాలో బాగా నానుతున్న సంగతి తెలిసిందే. తన నిర్మాణంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘వారిసు’ తెలుగు అనువాదానికి ఎక్కువ థియేటర్లు అట్టి పెడుతున్నాడన్న ఆరోపణలను రాజు ఎదుర్కొంటున్నాడు. పండుగలప్పుడు తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఉండాలని, డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కష్టమని గతంలో వ్యాఖ్యానించి ఇప్పుడు అందుకు భిన్నంగా రాజు వ్యవహరిస్తున్నాడంటూ ఆయన తీరును తప్పుబడుతున్నారు. తెలుగు నిర్మాతల మండలి సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఐతే ఈ వివాదంపై ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో రాజు ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. గతంలో ‘పేట’ సినిమా చాలా లేటుగా సంక్రాంతి రేసులోకి రావడం, ‘వారసుడు’ సినిమాకు చాలా ముందే డేట్ ఇచ్చి థియేటర్లు బుక్ చేయడం గురించి వివరణ ఇచ్చాడు. అన్నిటికీ మించి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలను రిలీజ్ చేస్తున్న మైత్రీ సంస్థతో తనకు మంచి అండర్స్టాండింగ్ ఉందని, వాళ్లకు లేని ఇబ్బంది మిగతా వాళ్లకు ఎందుకని ఆయన ప్రశ్నించడంతో వివాదానికి తెరపడినట్లు అయింది. దీని మీద తర్వాత నిర్మాతల మండలి కూడా సైలెంట్ అయిపోవడంతో గొడవ ముగిసిందనే అనుకున్నారంతా.
కానీ ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మళ్లీ అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. సంక్రాంతి, దసరా సీజన్లలో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ గత నెల 30వ తేదీన విశాఖపట్నంలో జరిగిన ఫిలిం ఛాంబర్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించామని, ఈ మేరకు 2017లో జరిగిన తీర్మానం మీదా చర్చ జరిగిందని పేర్కొంటూ వైజాగ్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్కు ఫిలిం ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ రాసిన లేఖ సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ లేఖను అనుసరించి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న తెలుగు చిత్రాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకే ప్రాధాన్యం ఇవ్వాలంటూ తమ పరిధి వైజాగ్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఎగ్జిబిటర్లకు సూచించినట్లు తెలుస్తోంది. మరి ఈ పరిణామాలపై దిల్ రాజు ఎలా స్పందిస్తాడో.. సంక్రాంతికి థియేటర్ల సర్దుబాటు ఎలా ఉండబోతోందో చూడాలి.
This post was last modified on December 7, 2022 2:26 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…