టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, మీడియాలో బాగా నానుతున్న సంగతి తెలిసిందే. తన నిర్మాణంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘వారిసు’ తెలుగు అనువాదానికి ఎక్కువ థియేటర్లు అట్టి పెడుతున్నాడన్న ఆరోపణలను రాజు ఎదుర్కొంటున్నాడు. పండుగలప్పుడు తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఉండాలని, డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కష్టమని గతంలో వ్యాఖ్యానించి ఇప్పుడు అందుకు భిన్నంగా రాజు వ్యవహరిస్తున్నాడంటూ ఆయన తీరును తప్పుబడుతున్నారు. తెలుగు నిర్మాతల మండలి సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఐతే ఈ వివాదంపై ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో రాజు ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. గతంలో ‘పేట’ సినిమా చాలా లేటుగా సంక్రాంతి రేసులోకి రావడం, ‘వారసుడు’ సినిమాకు చాలా ముందే డేట్ ఇచ్చి థియేటర్లు బుక్ చేయడం గురించి వివరణ ఇచ్చాడు. అన్నిటికీ మించి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలను రిలీజ్ చేస్తున్న మైత్రీ సంస్థతో తనకు మంచి అండర్స్టాండింగ్ ఉందని, వాళ్లకు లేని ఇబ్బంది మిగతా వాళ్లకు ఎందుకని ఆయన ప్రశ్నించడంతో వివాదానికి తెరపడినట్లు అయింది. దీని మీద తర్వాత నిర్మాతల మండలి కూడా సైలెంట్ అయిపోవడంతో గొడవ ముగిసిందనే అనుకున్నారంతా.
కానీ ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మళ్లీ అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. సంక్రాంతి, దసరా సీజన్లలో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ గత నెల 30వ తేదీన విశాఖపట్నంలో జరిగిన ఫిలిం ఛాంబర్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించామని, ఈ మేరకు 2017లో జరిగిన తీర్మానం మీదా చర్చ జరిగిందని పేర్కొంటూ వైజాగ్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్కు ఫిలిం ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ రాసిన లేఖ సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ లేఖను అనుసరించి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న తెలుగు చిత్రాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకే ప్రాధాన్యం ఇవ్వాలంటూ తమ పరిధి వైజాగ్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఎగ్జిబిటర్లకు సూచించినట్లు తెలుస్తోంది. మరి ఈ పరిణామాలపై దిల్ రాజు ఎలా స్పందిస్తాడో.. సంక్రాంతికి థియేటర్ల సర్దుబాటు ఎలా ఉండబోతోందో చూడాలి.
This post was last modified on December 7, 2022 2:26 pm
గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో హీరోయిన్ తాప్సీ తెగ హడావుడి చేస్తోంది. కారణం తన బాలీవుడ్ మూవీ అస్సీ ఇటీవలే…
ఇటీవలే విడుదలైన టాక్సిక్ టీజర్ మీద పాజిటివ్, నెగటివ్ రెండు రకాల రియాక్షన్లు సోషల్ మీడియాలో కనిపించాయి. వయొలెన్స్ ఎక్కువయ్యిందని…
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…