ఒకపక్క చిరంజీవి బాలకృష్ణ సినిమాలకే తగినన్ని థియేటర్లు దొరుకుతాయా లేదాని ఫ్యాన్స్ టెన్షన్ పడుతుంటే విజయ్ వారసుడుకి తోడుగా అజిత్ మూవీ కూడా నేను సైతం అంటూ ఫిక్స్ కావడం ఎగ్జిబిటర్లను ఖంగారు పెడుతోంది. ముఖ్యంగా నాలుగైదు హాళ్లు మాత్రమే ఉండే కొన్ని బిసి సెంటర్లలో ఇదో పెద్ద తలనెప్పిగా మారుతుంది. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు వచ్చే ఓవర్ ఫ్లోస్ ని మిగిలినవి క్యాష్ చేసుకున్నా మళ్ళీ ఆ ఇద్దరి కోసం ప్రేక్షకులు టికెట్లు కొనడం టాక్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత సంక్రాంతి సీజనైనా ఆ హడావిడి సందడి మహా అయితే వారం రోజులకు మించి ఉండదు. ఆలోగానే రాబట్టుకోవాలి.
ఇప్పుడివి చాలవన్నట్టు సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయంని అదే సమయంలో విడుదల చేయాలని నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్ణయించుకుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కొత్త దర్శకుడు అనిల్ తో డీసెంట్ బడ్జెట్ తో చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. అసలు షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందో మీడియాకు తెలియనంత గుట్టుగా పూర్తి చేస్తున్నారు ఇప్పుడు ఉన్నట్టుండి మేమూ సంక్రాంతికే వస్తామంటే సర్దుబాటు చేయడం అంత ఈజీగా ఉండదు. యువికి డిస్ట్రిబ్యూషన్ లో పట్టు, వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే మల్టీప్లెక్సులు ఉన్నంత మాత్రాన ఇంత రిస్క్ చేయాలా అనేది ప్రశ్న.
ఇదే తరహా ఓవర్ కాన్ఫిడెన్స్ తో దసరా బరిలో గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లతో పాటు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యంని దించితే ఏం జరిగిందో అందరికీ గుర్తే. పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రం అనవసరంగా కిల్ అయిపోయింది. దెబ్బకు కేవలం ఇరవై రోజుల గ్యాప్ తో ఓటిటికి ఇచ్చేశారు. అసలే సంతోష్ శోభన్ కి మార్కెట్ లేదు. కనీస ఓపెనింగ్స్ కూడా తేలేడని లేటెస్ట్ డిజాస్టర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఋజువు చేసింది. అదిరిపోయే కంటెంట్ ఉంటే తప్ప ఇతని కోసం జనం థియేటర్లకు రారు. అలాంటప్పుడు చిరు బాలయ్య విజయ్ అజిత్ ల మధ్య నలిగిపోకుండా ఉండగలడా. అఫీషియల్ చేయలేదు కానీ టాక్ అయితే జోరుగా ఉంది.
This post was last modified on December 6, 2022 2:33 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…