ఒకపక్క చిరంజీవి బాలకృష్ణ సినిమాలకే తగినన్ని థియేటర్లు దొరుకుతాయా లేదాని ఫ్యాన్స్ టెన్షన్ పడుతుంటే విజయ్ వారసుడుకి తోడుగా అజిత్ మూవీ కూడా నేను సైతం అంటూ ఫిక్స్ కావడం ఎగ్జిబిటర్లను ఖంగారు పెడుతోంది. ముఖ్యంగా నాలుగైదు హాళ్లు మాత్రమే ఉండే కొన్ని బిసి సెంటర్లలో ఇదో పెద్ద తలనెప్పిగా మారుతుంది. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు వచ్చే ఓవర్ ఫ్లోస్ ని మిగిలినవి క్యాష్ చేసుకున్నా మళ్ళీ ఆ ఇద్దరి కోసం ప్రేక్షకులు టికెట్లు కొనడం టాక్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత సంక్రాంతి సీజనైనా ఆ హడావిడి సందడి మహా అయితే వారం రోజులకు మించి ఉండదు. ఆలోగానే రాబట్టుకోవాలి.
ఇప్పుడివి చాలవన్నట్టు సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయంని అదే సమయంలో విడుదల చేయాలని నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్ణయించుకుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కొత్త దర్శకుడు అనిల్ తో డీసెంట్ బడ్జెట్ తో చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. అసలు షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందో మీడియాకు తెలియనంత గుట్టుగా పూర్తి చేస్తున్నారు ఇప్పుడు ఉన్నట్టుండి మేమూ సంక్రాంతికే వస్తామంటే సర్దుబాటు చేయడం అంత ఈజీగా ఉండదు. యువికి డిస్ట్రిబ్యూషన్ లో పట్టు, వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే మల్టీప్లెక్సులు ఉన్నంత మాత్రాన ఇంత రిస్క్ చేయాలా అనేది ప్రశ్న.
ఇదే తరహా ఓవర్ కాన్ఫిడెన్స్ తో దసరా బరిలో గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లతో పాటు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యంని దించితే ఏం జరిగిందో అందరికీ గుర్తే. పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రం అనవసరంగా కిల్ అయిపోయింది. దెబ్బకు కేవలం ఇరవై రోజుల గ్యాప్ తో ఓటిటికి ఇచ్చేశారు. అసలే సంతోష్ శోభన్ కి మార్కెట్ లేదు. కనీస ఓపెనింగ్స్ కూడా తేలేడని లేటెస్ట్ డిజాస్టర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఋజువు చేసింది. అదిరిపోయే కంటెంట్ ఉంటే తప్ప ఇతని కోసం జనం థియేటర్లకు రారు. అలాంటప్పుడు చిరు బాలయ్య విజయ్ అజిత్ ల మధ్య నలిగిపోకుండా ఉండగలడా. అఫీషియల్ చేయలేదు కానీ టాక్ అయితే జోరుగా ఉంది.
This post was last modified on December 6, 2022 2:33 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…