Movie News

బాల‌య్య‌తో మ‌రో అన్‌పాపుల‌ర్ హీరోయిన్

సీనియ‌ర్ హీరోల‌కు ఈ మ‌ధ్య హీరోయిన్ల‌ను సెట్ చేయ‌డం చాలా క‌ష్ట‌మైపోతోంది. ఇంత‌కుముందులా వ‌య‌సు అంత‌రం చూడ‌కుండా ఎవ‌రిని ప‌డితే వాళ్ల‌ను క‌థానాయిక‌లుగా పెట్టే ప‌రిస్థితి లేదు. ఈ త‌రం స్టార్ హీరోయిన్లు మ‌రీ వ‌య‌సు ఎక్కువ ఉన్న హీరోల ప‌క్క‌న చేయ‌డానికి వెనుకంజ వేస్తున్నారు. వాళ్ల డేట్లు కూడా ఖాళీగా ఉండ‌ట్లేద‌న్న సంగ‌తీ తెలిసిందే. దీంతో చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి సీనియ‌ర్ల స‌ర‌స‌న పేరు లేని హీరోయిన్ల‌నే తీసుకోవాల్సి వ‌స్తోంది. అందులోనూ బాల‌య్య సినిమాల్లో క‌థానాయిక‌ల‌కైతే ఒక రేంజ్ అంటూ ఉండ‌ట్లేదు.

బాల‌య్య చివ‌రి సినిమా అఖండ‌లో క‌థానాయిక‌గా న‌టించిన ప్ర‌గ్యా జైశ్వాల్ ప‌రిస్థితి ఏంటో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు వీర‌సింహారెడ్డిలో ఒక క‌థానాయిక‌గా శ్రుతి హాస‌న్ ఓకే కానీ.. మ‌రో హీరోయిన్ హ‌నీ రాజ్ అయితే బాల‌య్య స్థాయికి త‌క్కువే.

ఇక బాల‌య్య న‌టించ‌బోయే కొత్త చిత్రంలో కూడా ఒక అన్‌పాపుల‌ర్ హీరోయినే న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఆమె ప్రియాంక జ‌వాల్క‌ర్ అని లేటెస్ట్ న్యూస్. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని ఈ నెల‌లోనే సెట్స్ మీదికి తీసుకెళ్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల బాల‌య్య కూతురిగా కీల‌క పాత్ర పోషించ‌నుంది. ఇక బాల‌య్య‌కు జోడీగా ప్రియాంక జ‌వాల్క‌ర్ న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఐతే శ్రీలీలను కూతురిగా పెట్టి ప్రియాంక‌ను త‌ల్లిగా చూపించ‌డం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆమె పాత్ర యంగ్ బాల‌య్య‌కు జోడీగా ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. బ‌హుశా ఈ చిత్రంలో ఇద్ద‌రు బాల‌య్య‌లు క‌నిపించొచ్చు. లేదా ప్రియాంక పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో ఉండొచ్చు. తాజాగా ప్రియాంక‌కు లుక్ టెస్ట్ జ‌రిగింద‌ని, ఆమెనే క‌థానాయిక‌గా ఖ‌రారు చేశార‌ని స‌మాచారం.

This post was last modified on December 5, 2022 6:40 am

Share
Show comments

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago