ప్రభాస్ తదుపరి చిత్రం రాధేశ్యామ్ కంటే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తీయబోతున్న సినిమా పట్ల ఎక్కువ ఆసక్తి ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రం పట్ల ప్రభాస్ కూడా చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాడు. నాగ్ అశ్విన్ కి, నిర్మాత అశ్విని దత్ కీ ఈ సినిమా పొటెన్షియల్ ఏమిటనేది బాగా తెలుసు.
అందుకే ఈ చిత్రం బడ్జెట్ పరంగా, కాస్టింగ్ పరంగా ఎలాంటి రాజీ వద్దని డిసైడ్ అయిపోయారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా అప్పీల్ ఎలాగో ఉంటుంది కానీ, అక్కడి వాళ్లంతా సీరియస్ గా తీసుకోవాలంటే ఏమి ఉండాలనేది నాగ్ అశ్విన్ ఆలోచిస్తున్నాడు. అందుకే హీరోయిన్ గా దీపిక పదుకోన్ అయితే బెస్ట్ అని ఆమెను అప్రోచ్ అయ్యాడు.
దీపిక మహానటి చూసి, ఆ సినిమా చూడమంటూ రికమండ్ చేయడంతోనే ఆమెను సంప్రదించారని తెలిసిపోయింది. అయితే పారితోషికం పరంగా దీపికా ఎలాంటి తగ్గింపు ఇవ్వడం లేదట. ఇది హిందీతో పాటు అన్ని ప్రముఖ భాషలలో విడుదల అయ్యే సినిమా కనుక దీపికా పెద్ద అమౌంటే కోట్ చేసిందట. హీరోయిన్ కి అంత ఇస్తే బిజినెస్ పరంగా ఫీజిబుల్ ఉంటుందా లేదా అనేది అశ్విన్ తర్కించుకోవాలట.
This post was last modified on July 15, 2020 11:26 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…