ప్రభాస్ తదుపరి చిత్రం రాధేశ్యామ్ కంటే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తీయబోతున్న సినిమా పట్ల ఎక్కువ ఆసక్తి ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రం పట్ల ప్రభాస్ కూడా చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాడు. నాగ్ అశ్విన్ కి, నిర్మాత అశ్విని దత్ కీ ఈ సినిమా పొటెన్షియల్ ఏమిటనేది బాగా తెలుసు.
అందుకే ఈ చిత్రం బడ్జెట్ పరంగా, కాస్టింగ్ పరంగా ఎలాంటి రాజీ వద్దని డిసైడ్ అయిపోయారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా అప్పీల్ ఎలాగో ఉంటుంది కానీ, అక్కడి వాళ్లంతా సీరియస్ గా తీసుకోవాలంటే ఏమి ఉండాలనేది నాగ్ అశ్విన్ ఆలోచిస్తున్నాడు. అందుకే హీరోయిన్ గా దీపిక పదుకోన్ అయితే బెస్ట్ అని ఆమెను అప్రోచ్ అయ్యాడు.
దీపిక మహానటి చూసి, ఆ సినిమా చూడమంటూ రికమండ్ చేయడంతోనే ఆమెను సంప్రదించారని తెలిసిపోయింది. అయితే పారితోషికం పరంగా దీపికా ఎలాంటి తగ్గింపు ఇవ్వడం లేదట. ఇది హిందీతో పాటు అన్ని ప్రముఖ భాషలలో విడుదల అయ్యే సినిమా కనుక దీపికా పెద్ద అమౌంటే కోట్ చేసిందట. హీరోయిన్ కి అంత ఇస్తే బిజినెస్ పరంగా ఫీజిబుల్ ఉంటుందా లేదా అనేది అశ్విన్ తర్కించుకోవాలట.
This post was last modified on July 15, 2020 11:26 pm
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…
ఏపీ మంత్రి నారా లోకేష్పై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఏకబిగిన ఏడున్నర గంటల పాటు నిలబడి.. ప్రజలకు…