ప్రభాస్ తదుపరి చిత్రం రాధేశ్యామ్ కంటే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తీయబోతున్న సినిమా పట్ల ఎక్కువ ఆసక్తి ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రం పట్ల ప్రభాస్ కూడా చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాడు. నాగ్ అశ్విన్ కి, నిర్మాత అశ్విని దత్ కీ ఈ సినిమా పొటెన్షియల్ ఏమిటనేది బాగా తెలుసు.
అందుకే ఈ చిత్రం బడ్జెట్ పరంగా, కాస్టింగ్ పరంగా ఎలాంటి రాజీ వద్దని డిసైడ్ అయిపోయారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా అప్పీల్ ఎలాగో ఉంటుంది కానీ, అక్కడి వాళ్లంతా సీరియస్ గా తీసుకోవాలంటే ఏమి ఉండాలనేది నాగ్ అశ్విన్ ఆలోచిస్తున్నాడు. అందుకే హీరోయిన్ గా దీపిక పదుకోన్ అయితే బెస్ట్ అని ఆమెను అప్రోచ్ అయ్యాడు.
దీపిక మహానటి చూసి, ఆ సినిమా చూడమంటూ రికమండ్ చేయడంతోనే ఆమెను సంప్రదించారని తెలిసిపోయింది. అయితే పారితోషికం పరంగా దీపికా ఎలాంటి తగ్గింపు ఇవ్వడం లేదట. ఇది హిందీతో పాటు అన్ని ప్రముఖ భాషలలో విడుదల అయ్యే సినిమా కనుక దీపికా పెద్ద అమౌంటే కోట్ చేసిందట. హీరోయిన్ కి అంత ఇస్తే బిజినెస్ పరంగా ఫీజిబుల్ ఉంటుందా లేదా అనేది అశ్విన్ తర్కించుకోవాలట.
This post was last modified on July 15, 2020 11:26 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…