Movie News

రెండో పెళ్లిపై మీనా క్లారిటీ

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీల ప్రైవసీకి అసలు విలువే లేకుండా పోతోంది. చాలా డీప్‌గా వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతున్న జనాలు.. కొన్ని విషాదకర, బాధాకర సందర్భాల్లోనూ వారిని విడిచిపెట్టడం లేదు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ చనిపోతే.. ఆయన ఆస్తులు, వాటాల గురించి చర్చలు పెట్టాయి యూట్యూబ్ ఛానెళ్లు.

ఇప్పుడు సీనియర్ నటి మీనా రెండో పెళ్లి వ్యవహారం కూడా సోషల్ మీడియాకు ఒక టాపిక్‌గా మారింది. ఆమె భర్త విద్యాసాగర్ ఐదు నెలల కిందట చనిపోయిన సంగతి తెలిసిందే. కొవిడ్ అనంతర దుష్పరిణామాల కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఐతే భర్త చనిపోయి ఆరు నెలలైనా కాకముందే మీనా రెండో పెళ్లి గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది మీనాను బాధించి మీడియాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.

తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలను మీనా ఖండించింది. తన భర్త మరణం తాలూకు బాధ నుంచి తాను ఇంకా కోలుకోలేదని.. అప్పుడే తన రెండో పెళ్లి గురించి ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తమ ప్రైవసీని అందరూ గౌరవించాలని ఆమె కోరింది. మీనా భర్త మరణించినపుడు అందుకు గల కారణాలపైనా రకరకాల ప్రచారాలు జరిగాయి. అప్పుడు కూడా మీనా ఈ ప్రచారాలు కట్టిపెట్టాలని తమ కుటుంబ గోప్యతకు భంగం కలిగించవద్దని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా వార్తలను ఆమె ఖండించింది.

మీనా, ఆమె కూతురు భవిష్యత్తు దృష్ట్యా ఆమెకు రెండో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నట్లు, తెలిసిన వారిలోనే సంబంధం కుదుర్చుకున్నట్లు రూమర్లు వచ్చాయి. మీనా భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు కానీ.. భర్త మరణించి ఆరు నెలలు కూడా కాకముందే ఇలాంటి ప్రచారాలు చేయడం మాత్రం సరికాదు.

Satya

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

24 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

6 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

7 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

7 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago