సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీల ప్రైవసీకి అసలు విలువే లేకుండా పోతోంది. చాలా డీప్గా వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతున్న జనాలు.. కొన్ని విషాదకర, బాధాకర సందర్భాల్లోనూ వారిని విడిచిపెట్టడం లేదు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ చనిపోతే.. ఆయన ఆస్తులు, వాటాల గురించి చర్చలు పెట్టాయి యూట్యూబ్ ఛానెళ్లు.
ఇప్పుడు సీనియర్ నటి మీనా రెండో పెళ్లి వ్యవహారం కూడా సోషల్ మీడియాకు ఒక టాపిక్గా మారింది. ఆమె భర్త విద్యాసాగర్ ఐదు నెలల కిందట చనిపోయిన సంగతి తెలిసిందే. కొవిడ్ అనంతర దుష్పరిణామాల కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఐతే భర్త చనిపోయి ఆరు నెలలైనా కాకముందే మీనా రెండో పెళ్లి గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది మీనాను బాధించి మీడియాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.
తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలను మీనా ఖండించింది. తన భర్త మరణం తాలూకు బాధ నుంచి తాను ఇంకా కోలుకోలేదని.. అప్పుడే తన రెండో పెళ్లి గురించి ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తమ ప్రైవసీని అందరూ గౌరవించాలని ఆమె కోరింది. మీనా భర్త మరణించినపుడు అందుకు గల కారణాలపైనా రకరకాల ప్రచారాలు జరిగాయి. అప్పుడు కూడా మీనా ఈ ప్రచారాలు కట్టిపెట్టాలని తమ కుటుంబ గోప్యతకు భంగం కలిగించవద్దని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా వార్తలను ఆమె ఖండించింది.
మీనా, ఆమె కూతురు భవిష్యత్తు దృష్ట్యా ఆమెకు రెండో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నట్లు, తెలిసిన వారిలోనే సంబంధం కుదుర్చుకున్నట్లు రూమర్లు వచ్చాయి. మీనా భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు కానీ.. భర్త మరణించి ఆరు నెలలు కూడా కాకముందే ఇలాంటి ప్రచారాలు చేయడం మాత్రం సరికాదు.
This post was last modified on December 1, 2022 10:17 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…