ఈ మధ్యే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణతో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. అందులో రకరకాల విషయాలపై మాట్లాడిన ఆయన.. సినిమా పబ్లిసిటీ కోసం విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించాడు.
పబ్లిసిటీ ఖర్చును తగ్గించేందుకు అమలు చేస్తున్న ప్రణాళికల గురించి కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ రోజుల్లో మొత్తం సోషల్ మీడియా మీదే నడుస్తోందని.. కంటెంట్ బాగుంటే సోషల్ మీడియానే సినిమాను జనాల్లోకి తీసుకెళ్తుందని, మౌత్ పబ్లిసిటీనే ముఖ్యం అని ఆయన అన్నారు. ‘కాంతార’ అనే సినిమాకు ఏమైనా పబ్లిసిటీ చేశారా అంటూ ఉదాహరణ కూడా చూపించారు. తన బేనర్ ద్వారా రిలీజ్ చేస్తున్న తమిళ అనువాద చిత్రం ‘లవ్ టుడే’ కూడా థియేటర్లలో మ్యాజిక్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజు చెప్పిన స్థాయిలో ‘లవ్ టుడే’ మరీ వసూళ్ల మోత మోగించేయలేదు కానీ.. దాని స్థాయిలో అది బాగానే ఆడుతోంది. ఈ సినిమాకు ఒక చిన్న ప్రమోషనల్ ఈవెంట్ చేయడం తప్పితే పబ్లిసిటీ పరంగా దిల్ రాజు ఏమంత హడావుడి చేయలేదు. మీడియాలో ప్రకటనలతో ఏమీ హోరెత్తించలేదు. సినిమాలో విషయం ఉందని, అది యూత్ను ఆకర్షిస్తుందని నమ్మారు. ఆయన నమ్మకమే నిజమైంది.
‘లవ్ టుడే’ తొలి వీకెండ్లో, ఆ తర్వాత మంచి వసూళ్లతో సాగుతోంది. ఇప్పటిదాకా ‘లవ్ టుడే’ తెలుగులో రూ.7-8 కోట్ల మధ్య నెట్ వసూళ్లు సాధించింది. ఈ వీకెండ్లో ‘హిట్-2’ లాంటి క్రేజీ మూవీ వస్తున్నప్పటికీ.. ‘లవ్ టుడే’ స్ట్రాంగ్గానే నిలబడుతుందని ఆశిస్తున్నారు. ఫుల్ రన్లో రూ.10 కోట్ల మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇలాంటి ఓ చిన్న అనువాద చిత్రానికి ఆ ఫిగర్ చాలా పెద్దదే. అది కూడా పబ్లిసిటీ ఏమీ లేకుండా పది కోట్లు రాబట్టడం అంటే మాటలా?
This post was last modified on November 30, 2022 7:07 pm
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…