ఈ మధ్యే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణతో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. అందులో రకరకాల విషయాలపై మాట్లాడిన ఆయన.. సినిమా పబ్లిసిటీ కోసం విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించాడు.
పబ్లిసిటీ ఖర్చును తగ్గించేందుకు అమలు చేస్తున్న ప్రణాళికల గురించి కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ రోజుల్లో మొత్తం సోషల్ మీడియా మీదే నడుస్తోందని.. కంటెంట్ బాగుంటే సోషల్ మీడియానే సినిమాను జనాల్లోకి తీసుకెళ్తుందని, మౌత్ పబ్లిసిటీనే ముఖ్యం అని ఆయన అన్నారు. ‘కాంతార’ అనే సినిమాకు ఏమైనా పబ్లిసిటీ చేశారా అంటూ ఉదాహరణ కూడా చూపించారు. తన బేనర్ ద్వారా రిలీజ్ చేస్తున్న తమిళ అనువాద చిత్రం ‘లవ్ టుడే’ కూడా థియేటర్లలో మ్యాజిక్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజు చెప్పిన స్థాయిలో ‘లవ్ టుడే’ మరీ వసూళ్ల మోత మోగించేయలేదు కానీ.. దాని స్థాయిలో అది బాగానే ఆడుతోంది. ఈ సినిమాకు ఒక చిన్న ప్రమోషనల్ ఈవెంట్ చేయడం తప్పితే పబ్లిసిటీ పరంగా దిల్ రాజు ఏమంత హడావుడి చేయలేదు. మీడియాలో ప్రకటనలతో ఏమీ హోరెత్తించలేదు. సినిమాలో విషయం ఉందని, అది యూత్ను ఆకర్షిస్తుందని నమ్మారు. ఆయన నమ్మకమే నిజమైంది.
‘లవ్ టుడే’ తొలి వీకెండ్లో, ఆ తర్వాత మంచి వసూళ్లతో సాగుతోంది. ఇప్పటిదాకా ‘లవ్ టుడే’ తెలుగులో రూ.7-8 కోట్ల మధ్య నెట్ వసూళ్లు సాధించింది. ఈ వీకెండ్లో ‘హిట్-2’ లాంటి క్రేజీ మూవీ వస్తున్నప్పటికీ.. ‘లవ్ టుడే’ స్ట్రాంగ్గానే నిలబడుతుందని ఆశిస్తున్నారు. ఫుల్ రన్లో రూ.10 కోట్ల మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇలాంటి ఓ చిన్న అనువాద చిత్రానికి ఆ ఫిగర్ చాలా పెద్దదే. అది కూడా పబ్లిసిటీ ఏమీ లేకుండా పది కోట్లు రాబట్టడం అంటే మాటలా?
This post was last modified on November 30, 2022 7:07 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…