ఈ మధ్యే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణతో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. అందులో రకరకాల విషయాలపై మాట్లాడిన ఆయన.. సినిమా పబ్లిసిటీ కోసం విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించాడు.
పబ్లిసిటీ ఖర్చును తగ్గించేందుకు అమలు చేస్తున్న ప్రణాళికల గురించి కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ రోజుల్లో మొత్తం సోషల్ మీడియా మీదే నడుస్తోందని.. కంటెంట్ బాగుంటే సోషల్ మీడియానే సినిమాను జనాల్లోకి తీసుకెళ్తుందని, మౌత్ పబ్లిసిటీనే ముఖ్యం అని ఆయన అన్నారు. ‘కాంతార’ అనే సినిమాకు ఏమైనా పబ్లిసిటీ చేశారా అంటూ ఉదాహరణ కూడా చూపించారు. తన బేనర్ ద్వారా రిలీజ్ చేస్తున్న తమిళ అనువాద చిత్రం ‘లవ్ టుడే’ కూడా థియేటర్లలో మ్యాజిక్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజు చెప్పిన స్థాయిలో ‘లవ్ టుడే’ మరీ వసూళ్ల మోత మోగించేయలేదు కానీ.. దాని స్థాయిలో అది బాగానే ఆడుతోంది. ఈ సినిమాకు ఒక చిన్న ప్రమోషనల్ ఈవెంట్ చేయడం తప్పితే పబ్లిసిటీ పరంగా దిల్ రాజు ఏమంత హడావుడి చేయలేదు. మీడియాలో ప్రకటనలతో ఏమీ హోరెత్తించలేదు. సినిమాలో విషయం ఉందని, అది యూత్ను ఆకర్షిస్తుందని నమ్మారు. ఆయన నమ్మకమే నిజమైంది.
‘లవ్ టుడే’ తొలి వీకెండ్లో, ఆ తర్వాత మంచి వసూళ్లతో సాగుతోంది. ఇప్పటిదాకా ‘లవ్ టుడే’ తెలుగులో రూ.7-8 కోట్ల మధ్య నెట్ వసూళ్లు సాధించింది. ఈ వీకెండ్లో ‘హిట్-2’ లాంటి క్రేజీ మూవీ వస్తున్నప్పటికీ.. ‘లవ్ టుడే’ స్ట్రాంగ్గానే నిలబడుతుందని ఆశిస్తున్నారు. ఫుల్ రన్లో రూ.10 కోట్ల మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇలాంటి ఓ చిన్న అనువాద చిత్రానికి ఆ ఫిగర్ చాలా పెద్దదే. అది కూడా పబ్లిసిటీ ఏమీ లేకుండా పది కోట్లు రాబట్టడం అంటే మాటలా?
This post was last modified on November 30, 2022 7:07 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…