Movie News

ప్రభాస్ భోజనంపై సూర్య కూడా..

టాలీవుడ్ బాహుబలి ప్రభాస్‌‌తో కొంచెం సాన్నిహిత్యం ఉన్న ఎవ్వరు మాట్లాడినా.. అతడి అతిథి సత్కారాల గురించిన ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. తనతో ఎవరు కలిసి పని చేసినా.. తనను కలవడానికి ఎవరు వచ్చినా వారి కడుపు పగిలిలా అద్భుతమైన వంటకాలు తినిపించడం ప్రభాస్‌కు అలవాటు. తన పెదనాన్న కృష్ణం రాజు నుంచి వారసత్వంగా అందుకున్న ఈ సంప్రదాయం ద్వారా ప్రభాస్ ఎన్నో సందర్భాల్లో వార్తల్లో నిలిచాడు. ఎవరైనా అతిథి వస్తే ఐదో పదో వంటకాలు వడ్డిస్తారు కానీ.. ప్రభాస్ 30-40 రకాల వంటకాలతో వారిని ముంచెత్తుతాడు.

‘రాధేశ్యామ్’లో ప్రభాస్ అమ్మ క్యారెక్టర్ చేసిన భాగ్యశ్రీ సహా ఎంతోమంది.. ప్రభాస్ ఫుడ్డుతో, ప్రేమతో ఎలా ఇబ్బంది పెడతాడో చెప్పుకొచ్చారు. ఇప్పుడీ జాబితాలోకి తమిళ స్టార్ హీరో సూర్య కూడా వచ్చాడు. ప్రభాస్ రాజు గారి భోజనం గురించి సూర్య సైతం ఒక ఇంగ్లిష్ డైలీ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా మాట్లాడాడు.

‘‘నేను ఒక సినిమా షూటింగ్ కోసం ఒకసారి హైదరాబాద్ వెళ్లాను. అప్పుడు ప్రభాస్ నన్ను డిన్నర్‌కు పిలిచాడు. సాయంత్రం 6 గంటలకు వస్తానని చెప్పా. కానీ షూటింగ్‌లోనే రాత్రి 11 గంటలు దాటిపోయింది. ప్రభాస్‌కు సారీ చెప్పి ఇంకోసారి కలుద్దామని చెప్పాలని అనుకున్నా. కానీ రాత్రి 11.30కి ప్రభాస్‌ను హోటల్లో కలిస్తే.. నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. డిన్నర్ అంటే హోటల్ లేదా ప్రొడక్షన్ హౌస్ నుంచి భోజనం తెప్పిస్తాడని అనుకున్నా. కానీ ఇంటి నుంచి వాళ్ల అమ్మగారు పంపిన రకరకాల వంటలతో డిన్నర్ సిద్ధం చేశాడు. నాకు ఇంకా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే.. నా కోసం అప్పటి వరకు ప్రభాస్ భోజనం చేయకుండా ఎదురు చూశాడు. నా జీవితంలో అంత రుచికరమైన బిర్యానీ ఎప్పుడూ తినలేదు’’ అంటూ ప్రభాస్ ఆతిథ్యాన్ని కొనియాడాడు సూర్య.

గతంలో సూర్య నటించిన ‘రాక్షసుడు’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన ప్రభాస్.. సూర్య మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

This post was last modified on November 30, 2022 6:07 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

43 mins ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

1 hour ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

1 hour ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

1 hour ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

2 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

3 hours ago