టాలీవుడ్ బాహుబలి ప్రభాస్తో కొంచెం సాన్నిహిత్యం ఉన్న ఎవ్వరు మాట్లాడినా.. అతడి అతిథి సత్కారాల గురించిన ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. తనతో ఎవరు కలిసి పని చేసినా.. తనను కలవడానికి ఎవరు వచ్చినా వారి కడుపు పగిలిలా అద్భుతమైన వంటకాలు తినిపించడం ప్రభాస్కు అలవాటు. తన పెదనాన్న కృష్ణం రాజు నుంచి వారసత్వంగా అందుకున్న ఈ సంప్రదాయం ద్వారా ప్రభాస్ ఎన్నో సందర్భాల్లో వార్తల్లో నిలిచాడు. ఎవరైనా అతిథి వస్తే ఐదో పదో వంటకాలు వడ్డిస్తారు కానీ.. ప్రభాస్ 30-40 రకాల వంటకాలతో వారిని ముంచెత్తుతాడు.
‘రాధేశ్యామ్’లో ప్రభాస్ అమ్మ క్యారెక్టర్ చేసిన భాగ్యశ్రీ సహా ఎంతోమంది.. ప్రభాస్ ఫుడ్డుతో, ప్రేమతో ఎలా ఇబ్బంది పెడతాడో చెప్పుకొచ్చారు. ఇప్పుడీ జాబితాలోకి తమిళ స్టార్ హీరో సూర్య కూడా వచ్చాడు. ప్రభాస్ రాజు గారి భోజనం గురించి సూర్య సైతం ఒక ఇంగ్లిష్ డైలీ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా మాట్లాడాడు.
‘‘నేను ఒక సినిమా షూటింగ్ కోసం ఒకసారి హైదరాబాద్ వెళ్లాను. అప్పుడు ప్రభాస్ నన్ను డిన్నర్కు పిలిచాడు. సాయంత్రం 6 గంటలకు వస్తానని చెప్పా. కానీ షూటింగ్లోనే రాత్రి 11 గంటలు దాటిపోయింది. ప్రభాస్కు సారీ చెప్పి ఇంకోసారి కలుద్దామని చెప్పాలని అనుకున్నా. కానీ రాత్రి 11.30కి ప్రభాస్ను హోటల్లో కలిస్తే.. నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. డిన్నర్ అంటే హోటల్ లేదా ప్రొడక్షన్ హౌస్ నుంచి భోజనం తెప్పిస్తాడని అనుకున్నా. కానీ ఇంటి నుంచి వాళ్ల అమ్మగారు పంపిన రకరకాల వంటలతో డిన్నర్ సిద్ధం చేశాడు. నాకు ఇంకా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే.. నా కోసం అప్పటి వరకు ప్రభాస్ భోజనం చేయకుండా ఎదురు చూశాడు. నా జీవితంలో అంత రుచికరమైన బిర్యానీ ఎప్పుడూ తినలేదు’’ అంటూ ప్రభాస్ ఆతిథ్యాన్ని కొనియాడాడు సూర్య.
గతంలో సూర్య నటించిన ‘రాక్షసుడు’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు అతిథిగా వచ్చిన ప్రభాస్.. సూర్య మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
This post was last modified on November 30, 2022 6:07 pm
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…
ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి…
సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు..…
దాయాది దేశం పాకిస్థాన్కు ఊహించని పరిణామం ఎదురైంది. వాస్తవానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. తమపై భారత్ కత్తి దూస్తుందని పాక్…