టాలీవుడ్ బాహుబలి ప్రభాస్తో కొంచెం సాన్నిహిత్యం ఉన్న ఎవ్వరు మాట్లాడినా.. అతడి అతిథి సత్కారాల గురించిన ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. తనతో ఎవరు కలిసి పని చేసినా.. తనను కలవడానికి ఎవరు వచ్చినా వారి కడుపు పగిలిలా అద్భుతమైన వంటకాలు తినిపించడం ప్రభాస్కు అలవాటు. తన పెదనాన్న కృష్ణం రాజు నుంచి వారసత్వంగా అందుకున్న ఈ సంప్రదాయం ద్వారా ప్రభాస్ ఎన్నో సందర్భాల్లో వార్తల్లో నిలిచాడు. ఎవరైనా అతిథి వస్తే ఐదో పదో వంటకాలు వడ్డిస్తారు కానీ.. ప్రభాస్ 30-40 రకాల వంటకాలతో వారిని ముంచెత్తుతాడు.
‘రాధేశ్యామ్’లో ప్రభాస్ అమ్మ క్యారెక్టర్ చేసిన భాగ్యశ్రీ సహా ఎంతోమంది.. ప్రభాస్ ఫుడ్డుతో, ప్రేమతో ఎలా ఇబ్బంది పెడతాడో చెప్పుకొచ్చారు. ఇప్పుడీ జాబితాలోకి తమిళ స్టార్ హీరో సూర్య కూడా వచ్చాడు. ప్రభాస్ రాజు గారి భోజనం గురించి సూర్య సైతం ఒక ఇంగ్లిష్ డైలీ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా మాట్లాడాడు.
‘‘నేను ఒక సినిమా షూటింగ్ కోసం ఒకసారి హైదరాబాద్ వెళ్లాను. అప్పుడు ప్రభాస్ నన్ను డిన్నర్కు పిలిచాడు. సాయంత్రం 6 గంటలకు వస్తానని చెప్పా. కానీ షూటింగ్లోనే రాత్రి 11 గంటలు దాటిపోయింది. ప్రభాస్కు సారీ చెప్పి ఇంకోసారి కలుద్దామని చెప్పాలని అనుకున్నా. కానీ రాత్రి 11.30కి ప్రభాస్ను హోటల్లో కలిస్తే.. నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. డిన్నర్ అంటే హోటల్ లేదా ప్రొడక్షన్ హౌస్ నుంచి భోజనం తెప్పిస్తాడని అనుకున్నా. కానీ ఇంటి నుంచి వాళ్ల అమ్మగారు పంపిన రకరకాల వంటలతో డిన్నర్ సిద్ధం చేశాడు. నాకు ఇంకా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే.. నా కోసం అప్పటి వరకు ప్రభాస్ భోజనం చేయకుండా ఎదురు చూశాడు. నా జీవితంలో అంత రుచికరమైన బిర్యానీ ఎప్పుడూ తినలేదు’’ అంటూ ప్రభాస్ ఆతిథ్యాన్ని కొనియాడాడు సూర్య.
గతంలో సూర్య నటించిన ‘రాక్షసుడు’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు అతిథిగా వచ్చిన ప్రభాస్.. సూర్య మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
This post was last modified on November 30, 2022 6:07 pm
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మూణ్నాలుగు రోజులుగా నడుస్తున్న సస్పెన్సుకు తెరపడింది. ఎట్టకేలకు గవర్నర్ విజయ్కి అవకాశమిచ్చాడు. సొంతంగా…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు.. గత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన…
తెలంగాణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఆయన పార్లమెంటులో…
తమిళనాడు రాజకీయాల్లో యువ నాయకత్వానికి కొత్త గుర్తింపుగా నిలిచిన టీవీకే నేత ఎస్. కీర్తన సంపత్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు…
హీరోగా అవకాశాలు ఆగిపోయిన టైంలో ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారం ఎత్తారు సీనియర్ నటుడు జగపతిబాబు. దీంతో ఓవర్ నైట్…