హిట్-2.. ఇంకో రెండు రోజుల్లో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న థ్రిల్లర్ మూవీ. ఇంతకుముందు విశ్వక్సేన్ హీరోగా ‘హిట్’ సినిమాను తీసిన కొత్త దర్శకుడు శైలేష్ కొలను.. ‘హిట్’ను ఒక ఫ్రాంఛైజీగా మార్చి ‘సెకండ్ కేస్’ పేరుతో ఒక కొత్త కథను ఎంచుకుని ఈ సినిమా తీశాడు. డీసెంట్ హిట్ అయిన ‘హిట్’ను మించి ఇంకో లెవెల్ అనేలా ఈ సినిమా ప్రోమోలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. చివరగా వచ్చిన ట్రైలర్లోని కొన్ని షాట్లు అయితే ఒళ్లు గగుర్పొడిచేలా అనిపించాయి.
ఈ శుక్రవారం ఒక స్పైన్ చిల్లింగ్-థ్రిల్లింగ్ రైడ్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించాయి. ట్రైలర్లో హీరోను మించి అందరి దృష్టినీ ఆకర్షించిన క్యారెక్టర్ విలన్దే. అత్యంత కిరాతకమైన రీతిలో అమ్మాయిలను చంపే సైకో కిల్లర్ క్యారెక్టర్ ట్రైలర్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది.
వేర్వేరు అమ్మాయిలను చంపి.. ఒక్కొక్కరి బాడీ పార్ట్స్ తీసి ఒక అమ్మాయిది ప్లేస్ చేయడం.. అమ్మాయి మెడపై కొరికితే పళ్ల గాటు పడడం.. లాంటి సన్నివేశాలు చాలా క్యూరియస్గా అనిపించాయి. ఇక కోడి బుర్ర డైలాగ్తో ముడిపడ్డ షాట్ అయితే వేరే లెవెల్. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికీ ఎవరా విలన్ అనే ఉత్కంఠ కలిగింది. ఐతే ఆ విలన్ ఎవరనే విషయంలో నెటిజన్లు రకరకాల ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారు.
ఒక నెటిజన్ ఏమో నానీనే విలన్ అంటే.. ఇంకొకరేమో విలన్ అమ్మాయి, అది మీనాక్షి చౌదరినే అంటూ గెస్ చేస్తున్నారు. ఈ ట్వీట్లను అడివి శేష్ చదివి ఆసక్తికర రీతిలో స్పందిస్తున్నాడు. ప్రేక్షకులను అంచనాలపై కొంచెం సరదాగా, వెటకారంగానే స్పందించాడు శేష్. అతడి ట్వీట్లు సినిమాలో విలన్ ఎవరనే విషయంలో మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. సినిమాలో ఆ సస్పెన్స్ ఎలిమెంటే కీలకంగా ఉండేలా ఉంది. అందుకేనేమో సినిమా చూసిన వాళ్లు స్పాయిలర్స్ లేకుండా చూడాలని శేష్ ప్రి రిలీజ్ ఈవెంట్లో విజ్ఞప్తి చేశాడు..
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…