హిట్-2.. ఇంకో రెండు రోజుల్లో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న థ్రిల్లర్ మూవీ. ఇంతకుముందు విశ్వక్సేన్ హీరోగా ‘హిట్’ సినిమాను తీసిన కొత్త దర్శకుడు శైలేష్ కొలను.. ‘హిట్’ను ఒక ఫ్రాంఛైజీగా మార్చి ‘సెకండ్ కేస్’ పేరుతో ఒక కొత్త కథను ఎంచుకుని ఈ సినిమా తీశాడు. డీసెంట్ హిట్ అయిన ‘హిట్’ను మించి ఇంకో లెవెల్ అనేలా ఈ సినిమా ప్రోమోలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. చివరగా వచ్చిన ట్రైలర్లోని కొన్ని షాట్లు అయితే ఒళ్లు గగుర్పొడిచేలా అనిపించాయి.
ఈ శుక్రవారం ఒక స్పైన్ చిల్లింగ్-థ్రిల్లింగ్ రైడ్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించాయి. ట్రైలర్లో హీరోను మించి అందరి దృష్టినీ ఆకర్షించిన క్యారెక్టర్ విలన్దే. అత్యంత కిరాతకమైన రీతిలో అమ్మాయిలను చంపే సైకో కిల్లర్ క్యారెక్టర్ ట్రైలర్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది.
వేర్వేరు అమ్మాయిలను చంపి.. ఒక్కొక్కరి బాడీ పార్ట్స్ తీసి ఒక అమ్మాయిది ప్లేస్ చేయడం.. అమ్మాయి మెడపై కొరికితే పళ్ల గాటు పడడం.. లాంటి సన్నివేశాలు చాలా క్యూరియస్గా అనిపించాయి. ఇక కోడి బుర్ర డైలాగ్తో ముడిపడ్డ షాట్ అయితే వేరే లెవెల్. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికీ ఎవరా విలన్ అనే ఉత్కంఠ కలిగింది. ఐతే ఆ విలన్ ఎవరనే విషయంలో నెటిజన్లు రకరకాల ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారు.
ఒక నెటిజన్ ఏమో నానీనే విలన్ అంటే.. ఇంకొకరేమో విలన్ అమ్మాయి, అది మీనాక్షి చౌదరినే అంటూ గెస్ చేస్తున్నారు. ఈ ట్వీట్లను అడివి శేష్ చదివి ఆసక్తికర రీతిలో స్పందిస్తున్నాడు. ప్రేక్షకులను అంచనాలపై కొంచెం సరదాగా, వెటకారంగానే స్పందించాడు శేష్. అతడి ట్వీట్లు సినిమాలో విలన్ ఎవరనే విషయంలో మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. సినిమాలో ఆ సస్పెన్స్ ఎలిమెంటే కీలకంగా ఉండేలా ఉంది. అందుకేనేమో సినిమా చూసిన వాళ్లు స్పాయిలర్స్ లేకుండా చూడాలని శేష్ ప్రి రిలీజ్ ఈవెంట్లో విజ్ఞప్తి చేశాడు..
This post was last modified on November 30, 2022 5:54 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…