ఆల్రెడీ రాజమౌళి డైరక్షన్లో RRR వంటి వరల్డ్-క్లాస్ బ్లాక్బస్టర్ చేసి, ఆ తరువాత శంకర్ డైరక్షన్లో #RC15 చేస్తున్న చరణ్.. సడన్ గా అసలు ‘ఉప్పెన’ డైరక్టర్ బుచ్చిబాబు సినిమా ఓకే చేశాడేంటి అని ఇప్పుడు ట్రోలింగ్కు కూడా గురవుతున్నాడు. అయితే ఈ దర్శకుడితో సినిమా చేయడం అనేది కరెక్ట్ కాదంటూ చెప్పడం తప్పే కాని, సినిమా రేంజ్ ఎలా ఉండాలో మాత్రం మనం చెప్పుకోవచ్చు. అక్కడ తేడా కొడితే మాత్రం చరణ్ పెద్ద రాంగ్ స్టెప్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు.
బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పెనలో ఒక సింపుల్ పాయింట్ పట్టుకుని, దానిని భారీ బడ్జెట్తో తీశాడు. ప్రొడక్షన్ కూడా బాగా లేటవ్వడంతో 6-7 కోట్లతో చేయాల్సిన సినిమాకు 21 కోట్లు ఖర్చయ్యిందని అప్పట్లో రూమర్లు కూడా వినిపించాయి. కాని రామ్ చరణ్ వంటి హీరో చేతిలో ఉన్నప్పుడు అలాంటి సింపుల్ పాయింట్తో ప్యాన్ ఇండియా సినిమా చేయడం కుదరదు. ఏదైనా సరైన పాయింటే ఉండాలి. భారీగా అంటే భారీగానే చూపించాలి. కాబట్టి నెరేషన్ విషయంలో బుచ్చిబాబు చాలా జాగ్రత్తపడాల్సిందే. ఒక్క సినిమా తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో సినిమానే కెజిఎఫ్ చేశాడు కాబట్టి, బుచ్చిబాబు కూడా అదే తరహాలో భారీ హిట్టే కొట్టే ఛాన్స్ ఎప్పుడైనా ఉంటుంది. కాకపోతే హీరో మార్కెట్ని అర్ధం చేసుకుని సినిమా డిజైన్ చెయ్యాలి.
ఆల్రెడీ RRR, ఆ తరువాత #RC15 లైన్లో ఉంది. కాబట్టి తదుపరి వచ్చే బుచ్చిబాబు సినిమా ఖచ్చితంగా చరణ్ రేంజ్ను ఇంకా పెంచేదే అయ్యుండాలి. ఒకవేళ బుచ్చిబాబు ఈ విషయంలో జాగ్రత్తపడకపోతే మాత్రం.. ఆ తరువాత చాలామంది దర్శకుల తరహాలో ఫేం అండ్ నేం పోగొట్టుకునే ఛాన్సుంటుంది. చూద్దాం మరి ఎటువంటి సినిమాతో చరణ్ అండ్ బుచ్చిబాబు మనముందుకు వస్తారో!
This post was last modified on November 30, 2022 8:42 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…