ఆల్రెడీ రాజమౌళి డైరక్షన్లో RRR వంటి వరల్డ్-క్లాస్ బ్లాక్బస్టర్ చేసి, ఆ తరువాత శంకర్ డైరక్షన్లో #RC15 చేస్తున్న చరణ్.. సడన్ గా అసలు ‘ఉప్పెన’ డైరక్టర్ బుచ్చిబాబు సినిమా ఓకే చేశాడేంటి అని ఇప్పుడు ట్రోలింగ్కు కూడా గురవుతున్నాడు. అయితే ఈ దర్శకుడితో సినిమా చేయడం అనేది కరెక్ట్ కాదంటూ చెప్పడం తప్పే కాని, సినిమా రేంజ్ ఎలా ఉండాలో మాత్రం మనం చెప్పుకోవచ్చు. అక్కడ తేడా కొడితే మాత్రం చరణ్ పెద్ద రాంగ్ స్టెప్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు.
బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పెనలో ఒక సింపుల్ పాయింట్ పట్టుకుని, దానిని భారీ బడ్జెట్తో తీశాడు. ప్రొడక్షన్ కూడా బాగా లేటవ్వడంతో 6-7 కోట్లతో చేయాల్సిన సినిమాకు 21 కోట్లు ఖర్చయ్యిందని అప్పట్లో రూమర్లు కూడా వినిపించాయి. కాని రామ్ చరణ్ వంటి హీరో చేతిలో ఉన్నప్పుడు అలాంటి సింపుల్ పాయింట్తో ప్యాన్ ఇండియా సినిమా చేయడం కుదరదు. ఏదైనా సరైన పాయింటే ఉండాలి. భారీగా అంటే భారీగానే చూపించాలి. కాబట్టి నెరేషన్ విషయంలో బుచ్చిబాబు చాలా జాగ్రత్తపడాల్సిందే. ఒక్క సినిమా తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో సినిమానే కెజిఎఫ్ చేశాడు కాబట్టి, బుచ్చిబాబు కూడా అదే తరహాలో భారీ హిట్టే కొట్టే ఛాన్స్ ఎప్పుడైనా ఉంటుంది. కాకపోతే హీరో మార్కెట్ని అర్ధం చేసుకుని సినిమా డిజైన్ చెయ్యాలి.
ఆల్రెడీ RRR, ఆ తరువాత #RC15 లైన్లో ఉంది. కాబట్టి తదుపరి వచ్చే బుచ్చిబాబు సినిమా ఖచ్చితంగా చరణ్ రేంజ్ను ఇంకా పెంచేదే అయ్యుండాలి. ఒకవేళ బుచ్చిబాబు ఈ విషయంలో జాగ్రత్తపడకపోతే మాత్రం.. ఆ తరువాత చాలామంది దర్శకుల తరహాలో ఫేం అండ్ నేం పోగొట్టుకునే ఛాన్సుంటుంది. చూద్దాం మరి ఎటువంటి సినిమాతో చరణ్ అండ్ బుచ్చిబాబు మనముందుకు వస్తారో!
This post was last modified on November 30, 2022 8:42 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…