Movie News

పక్కా ప్లానింగ్ తో అఖండ 2

గత ఏడాది డిసెంబర్ లో విడుదలై బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన అఖండ సీక్వెల్ కు రంగం సిద్ధమవుతోంది. గోవాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో ఈ ప్రస్తావన మీడియా తెచ్చినప్పటికీ దాని గురించి వివరాలు ఎక్కువ వెల్లడించకపోయినా బాలకృష్ణ పక్కనే ఉన్న బోయపాటి శీను మాత్రం తప్పకుండ చేస్తామనే హామీ అయితే ఇచ్చేశారు. దానికి అనుగుణంగానే పక్కా ప్లాన్ తో స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట. ప్రస్తుతం వీరసింహారెడ్డి పూర్తి చేసి విడుదల కాగానే అనిల్ రావిపూడి రెగ్యులర్ షూట్ మొదలవుతుంది.

2023 వేసవిలోగా కంప్లీట్ చేసి ఆ తర్వాత రెండు బాధ్యతలు బాలయ్య భుజాల మీద ఉంటాయి. ఒకటి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ. ఆదిత్య 999 ద్వారా లాంచ్ చేస్తారనే టాక్ ఉంది కానీ అదంత త్వరగా తెరకెక్కేలా లేదు. పైగా స్వీయ దర్శకత్వం కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా బాలకృష్ణ పూర్తిగా దీని మీద కాన్సన్ ట్రేట్ చేయాల్సి ఉంటుంది. నాన్న ఎన్టీఆర్ తాతమ్మ కలతో తన సినిమాలోనే పరిచయం చేసిన సెంటిమెంట్ ని రిపీట్ చేయాలని బాలయ్య చూస్తున్నారు. అలాంటప్పుడు ఆదిత్య 999 కంటే మంచి ఆప్షన్ ఉండదు. పైకి వచ్చే ఏడాది అంటున్నారు కానీ 2024 అవ్వొచ్చు.

అటువైపు బోయపాటి శీను రామ్ సినిమా పూర్తి చేసి ఫ్రీ అయ్యేలోగా సమ్మర్ వచ్చేస్తుంది. ఆపై రెండు మూడు నెలలకు బాలయ్య అందుబాటులోకి వస్తారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాణంలో అఖండ 2 రూపొందుతుందని ఆల్రెడీ లీక్ వచ్చేసింది. అఖండకు కొనసాగింపే అయినా ఈసారి పొలిటికల్ టచ్ ఇస్తారని సమాచారం. లెజెండ్ క్లైమాక్స్ లో పలు రాజకీయ సంభాషణలు వ్యంగ్యాస్త్రాలు బలంగా వాడిన బోయపాటి రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అంతకు మించిన మసాలానే ఇస్తారట. ఏదైతేనేం బాలయ్య కెరీర్ లో మొదటి సీక్వెల్ కి రంగం సిద్ధమవుతోంది.

This post was last modified on November 28, 2022 8:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

15 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

35 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

1 hour ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago