పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాక ప్రకటించిన ప్రాజెక్టుల్లో అభిమానులను అత్యంత ఎగ్జైట్ చేసింది హరీష్ శంకర్ చిత్రమే అనడంలో మరో మాట లేదు. అందుక్కారణం వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘గబ్బర్ సింగ్’ బ్లాక్బస్టర్ కావడమే. పవన్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించి వారిని ఉర్రూతలూగించాడు హరీష్. తీసింది రీమేకే అయినా.. మార్పులు చేర్పులతో, అనేక కొత్త మెరుపులతో ఆ సినిమాను వేరే లెవెల్లో నిలబెట్టాడు హరీష్.
ఈసారి రీమేక్ కాకుండా ‘భవదీయుడు భగత్ సింగ్’ పేరుతో పవన్తో స్ట్రెయిట్ మూవీ తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు హరీష్. ఈ సినిమా అనౌన్స్మెంట్ దగ్గర్నుంచి విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. కానీ ఎంతకీ ఆ సినిమా పట్టాలెక్కకపోవడం మాత్రం నిరాశ కలిగించే విషయమే.
ఇప్పట్లో సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు లేకపోయినా హరీష్ నీరుగారి పోవట్లేదు. ఛాన్స్ వచ్చినపుడు సత్తా చాటాలని ఎదురు చూస్తున్నాడు. కాగా పవన్తో చేయబోయే సినిమా గురించి ట్విట్టర్లో ఒక అభిమానితో హరీష్ జరిపిన సంభాషణ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
రాజమౌళి గురించి అమెరికన్ మీడియాలో వచ్చిన కథనంపై స్పందించిన హరీష్ను ఉద్దేశించి ఒక నెటిజన్ మాట్లాడుతూ.. పీకేతో ఈసారి ‘గబ్బర్ సింగ్’ లాంటి రొటీన్ మసాలా సినిమా చేయొద్దని.. అందులో బౌన్సింగ్ పైట్లు కాకుండా రియలిస్టిక్ స్టంట్స్ ఉండేలా చూడాలని.. సినిమా ఇంటర్నేషనల్ రేంజిలో ఉండాలని సూచించాడు.
దీనికి హరీష్ స్పందిస్తూ.. “మిమ్మల్ని నిరాశ పరుస్తున్నందుకు సారీ. మీతో నేను ఏకీభవించను” అని పేర్కొన్నాడు. అంతే కాక ‘విజ్ఞాన ప్రదర్శనలు వద్దు’ అనే ‘వెంకీ’ సినిమా మీమ్ను కూడా పోస్ట్ చేశాడు. దీన్ని బట్టి తన నుంచి కల్ట్లు క్లాసిక్లు ఆశించొద్దని.. మెజారిటీ పవన్ అభిమానులు కోరుకునేలా తాను పవర్ స్టార్తో మాస్ మసాలా సినిమానే తీయబోతున్నానని హరీష్ చెప్పకనే చెప్పినట్లుంది.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…