కొన్నేళ్ల ముందు ‘ప్యార్ ప్రేమ కాదల్’ అనే సినిమా ఒకటి వచ్చింది. అందులో హరీష్ కళ్యాణ్ అనే చిన్న హీరో నటించాడు. హీరోయిన్గా రైజా విల్సన్ అనే చిన్న స్థాయి కథానాయిక నటించింది. అందులో ఆమెది బోల్డ్ రోల్. ఆ సినిమా ట్రైలర్లో ఒక సీన్ చూసి అందరూ షాకైపోయారు. హీరో హీరోయిన్ ఒక మెడికల్ షాప్ ముందు ఆగితే.. హీరోను ముందు ఏదో తీసుకురమ్మని చెప్పి.. ఆ తర్వాత ఇంట్లో నాన్న లేడు అని హింట్ ఇచ్చి నువ్వు కూడా ఏదైనా కావాలంటే తెచ్చుకో అంటుంది హీరోయిన్. పరోక్షంగా ఇక్కడ కండోమ్ తెచ్చుకోమని హీరోయిన్ చెబుతుందన్నమాట.
ఈ ట్రైలర్ చూసి ఇదొక బి గ్రేడ్ సినిమాలా ఫీలయ్యారు జనాలు. ఆ సినిమాను కూడా ఆ కోణంలోనే చూశారు. ఇప్పుడు ఆ చిత్రాన్నే తెలుగులో ‘ఊర్వశివో రాక్షసివో’ పేరుతో రీమేక్ చేశారు. ఇలాంటి సినిమాలో అల్లు శిరీష్ లాంటి పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో… పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోల సరసన నటించిన అను ఇమ్మాన్యుయెల్ నటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ముఖ్యంగా కాస్త ఇమేజ్ ఉన్న ఏ హీరోయిన్ అయినా ఇలాంటి పాత్ర చేయడానికి సందేహిస్తుంది. కానీ అను ధైర్యం చేసి ఈ సినిమాలో నటించింది. అందాల ప్రదర్శనలో, ఇంటిమేట్ సీన్లలో ఏమాత్రం హద్దులు పెట్టుకోలేదు. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఆమే అంటే ఆశ్చర్యం లేదు. ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయిందన్నా.. ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయన్నా ఆమే కారణం.
ఐతే అను ఇంత కష్టపడ్డా పెద్దగా ప్రయోజనం ఏమీ లేకపోయిందనే అనిపిస్తోంది. ‘ఊర్వశివో రాక్షసివో’ అవ్వాల్సినంత పెద్ద హిట్ కాలేదు. అను గురించి రిలీజ్ తర్వాత పెద్దగా డిస్కషన్ జరగలేదు. కొత్తగా తెలుగులో ఆమెకు అవకాశాలేమీ వచ్చినట్లు కనిపించడం లేదు. మామూలుగా ఏదైనా సినిమా హిట్టయినా.. హీరోయిన్ బాగా హైలైట్ అయినా చకచకా సినిమాలు వరుస కట్టేస్తుంటాయి. కానీ ప్రస్తుతానికైతే అను విషయంలో సౌండ్ లేదు. మరి రాబోయే రోజుల్లో అయినా అనుకు ఏవైనా అవకాశాలు దక్కి తన కష్టానికి ఫలితం అందుతుందేమో చూడాలి.
This post was last modified on November 27, 2022 9:06 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…