Movie News

రామ‌జోగ‌య్య శాస్త్రి హ‌ర్టు

వేటూరి, సిరివెన్నెల, చంద్ర‌బోస్ లాంటి దిగ్గ‌జాల త‌ర్వాత టాలీవుడ్‌కు దొరికిన ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌ల్లో రామ‌జోగ‌య్య శాస్త్రి ఒక‌రు. ఓవైపు యూత్‌కు న‌చ్చేలా ట్రెండీగా పాట‌లు రాయ‌డ‌మే కాక‌.. ఇంకోవైపు మంచి సాహిత్య విలువ‌ల‌తో గాఢ‌త చూపించ‌డం కూడా ఆయ‌న‌కు తెలుసు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. వివాదాల‌కు దూరంగా… ఎప్పుడూ పాజిటివ్‌గా మాట్లాడే రామ‌జోగ‌య్య‌.. తాజాగా చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఆయ‌న ఎవ‌రో చేసిన కామెంట్ల‌కు ఫీల‌యిన‌ట్లే క‌నిపిస్తున్న‌ట్లున్నారు.

నెగెటివ్ కామెంట్లు చేసేవాళ్లు తన ఫాలోవ‌ర్లుగా ఉండొద్ద‌ని ప‌రోక్షంగా సంకేతాలు ఇస్తూ.. ఆయ‌న త‌న పేరు వెనుక పెట్టుకున్న స‌ర‌స్వ‌తి పుత్ర అనే టైటిల్ విష‌యంలోనూ వివ‌ర‌ణ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

”ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను…దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు..అన్నట్టు…జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి..”

ఇదీ రామ‌జోగ‌య్య శాస్త్రి చేసిన ట్వీట్. వీర‌సింహారెడ్డి నుంచి తాను రాసిన‌ జై బాల‌య్యా పాట లాంచ్ అయిన కాసేప‌టికే ఆయ‌న ఈ ట్వీట్ వేశారు. దీన్ని బ‌ట్టి చూస్తే పాట‌లోని సాహిత్యం గురించి ఎవ‌రో ఏదో కామెంట్ చేశార‌ని.. ఈ క్ర‌మంలోనే స‌ర‌స్వ‌తి పుత్ర అని త‌న పేరు వెనుక పెట్టుకున్న టైటిల్ విష‌యంలోనూ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశార‌ని.. ఈ విష‌యంలో నొచ్చుకున్న రామ‌జోగ‌య్య ఈ ట్వీట్ వేశార‌ని అర్థ‌మ‌వుతోంది.

This post was last modified on November 25, 2022 10:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

7 minutes ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

45 minutes ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

47 minutes ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

2 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

4 hours ago

బెంగాల్ కోసం మోదీ ఎంత పరితపించారో

దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…

5 hours ago