Movie News

రామ‌జోగ‌య్య శాస్త్రి హ‌ర్టు

వేటూరి, సిరివెన్నెల, చంద్ర‌బోస్ లాంటి దిగ్గ‌జాల త‌ర్వాత టాలీవుడ్‌కు దొరికిన ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌ల్లో రామ‌జోగ‌య్య శాస్త్రి ఒక‌రు. ఓవైపు యూత్‌కు న‌చ్చేలా ట్రెండీగా పాట‌లు రాయ‌డ‌మే కాక‌.. ఇంకోవైపు మంచి సాహిత్య విలువ‌ల‌తో గాఢ‌త చూపించ‌డం కూడా ఆయ‌న‌కు తెలుసు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. వివాదాల‌కు దూరంగా… ఎప్పుడూ పాజిటివ్‌గా మాట్లాడే రామ‌జోగ‌య్య‌.. తాజాగా చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఆయ‌న ఎవ‌రో చేసిన కామెంట్ల‌కు ఫీల‌యిన‌ట్లే క‌నిపిస్తున్న‌ట్లున్నారు.

నెగెటివ్ కామెంట్లు చేసేవాళ్లు తన ఫాలోవ‌ర్లుగా ఉండొద్ద‌ని ప‌రోక్షంగా సంకేతాలు ఇస్తూ.. ఆయ‌న త‌న పేరు వెనుక పెట్టుకున్న స‌ర‌స్వ‌తి పుత్ర అనే టైటిల్ విష‌యంలోనూ వివ‌ర‌ణ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

”ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను…దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు..అన్నట్టు…జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి..”

ఇదీ రామ‌జోగ‌య్య శాస్త్రి చేసిన ట్వీట్. వీర‌సింహారెడ్డి నుంచి తాను రాసిన‌ జై బాల‌య్యా పాట లాంచ్ అయిన కాసేప‌టికే ఆయ‌న ఈ ట్వీట్ వేశారు. దీన్ని బ‌ట్టి చూస్తే పాట‌లోని సాహిత్యం గురించి ఎవ‌రో ఏదో కామెంట్ చేశార‌ని.. ఈ క్ర‌మంలోనే స‌ర‌స్వ‌తి పుత్ర అని త‌న పేరు వెనుక పెట్టుకున్న టైటిల్ విష‌యంలోనూ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశార‌ని.. ఈ విష‌యంలో నొచ్చుకున్న రామ‌జోగ‌య్య ఈ ట్వీట్ వేశార‌ని అర్థ‌మ‌వుతోంది.

This post was last modified on November 25, 2022 10:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago