వేటూరి, సిరివెన్నెల, చంద్రబోస్ లాంటి దిగ్గజాల తర్వాత టాలీవుడ్కు దొరికిన ఉత్తమ గేయ రచయితల్లో రామజోగయ్య శాస్త్రి ఒకరు. ఓవైపు యూత్కు నచ్చేలా ట్రెండీగా పాటలు రాయడమే కాక.. ఇంకోవైపు మంచి సాహిత్య విలువలతో గాఢత చూపించడం కూడా ఆయనకు తెలుసు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ.. వివాదాలకు దూరంగా… ఎప్పుడూ పాజిటివ్గా మాట్లాడే రామజోగయ్య.. తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఎవరో చేసిన కామెంట్లకు ఫీలయినట్లే కనిపిస్తున్నట్లున్నారు.
నెగెటివ్ కామెంట్లు చేసేవాళ్లు తన ఫాలోవర్లుగా ఉండొద్దని పరోక్షంగా సంకేతాలు ఇస్తూ.. ఆయన తన పేరు వెనుక పెట్టుకున్న సరస్వతి పుత్ర అనే టైటిల్ విషయంలోనూ వివరణ ఇవ్వడం గమనార్హం.
”ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను…దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు..అన్నట్టు…జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి..”
ఇదీ రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్. వీరసింహారెడ్డి నుంచి తాను రాసిన జై బాలయ్యా పాట లాంచ్ అయిన కాసేపటికే ఆయన ఈ ట్వీట్ వేశారు. దీన్ని బట్టి చూస్తే పాటలోని సాహిత్యం గురించి ఎవరో ఏదో కామెంట్ చేశారని.. ఈ క్రమంలోనే సరస్వతి పుత్ర అని తన పేరు వెనుక పెట్టుకున్న టైటిల్ విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తం చేశారని.. ఈ విషయంలో నొచ్చుకున్న రామజోగయ్య ఈ ట్వీట్ వేశారని అర్థమవుతోంది.
This post was last modified on November 25, 2022 10:23 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…