ఓ రెండు రోజుల నుండి నెట్టింట్లో మారుమోగిపోయిన మ్యాటర్ ఏంటంటే.. ఈ మధ్య కాలంలో తమన్ కొడుతున్న ట్యూన్స్ అంతగా క్యాచీగా లేవు కాబట్టి, సర్కారు వారి పాట సినిమాలో పాటలు ఓ రెండు తప్ప ఏవీ పెద్దగా క్లిక్ కాలేదు కాబట్టి, #SSMB28 కోసం ఇప్పుడు త్రివిక్రమ్ మళ్ళీ అనిరుధ్ను దించుతున్నాడంటూ టాక్ వచ్చేసింది. వీటిపై క్లారిటీ ఇవ్వడానికి, తమన్కు బర్త డే విషెస్ చెప్పిన సితార వంశీ, #SSMB28 ట్యూన్స్ కోసం వెయిటింగ్ అంటూ ఒక కామెంట్ చేశాడు. దానితో తమన్ను మార్చట్లేదని క్లారిటీ వచ్చింది. అయితే ఇక్కడ అనిరుధ్ మ్యాటర్ ఓసారి డిస్కస్ చేద్దాం.
అసలు ఈ మ్యూజిక్ డైరక్టర్ను పెట్టుకో, పలానా డైరక్టర్తో వద్దు, పలానా హీరోయిన్ను తీసుకోండి అంటే అవతల దిగ్గజాలైన మహేష్ బాబు, త్రివిక్రమ్ వంటి స్టార్స్ వింటారా? అవన్నీ పక్కన పెట్టేస్తే.. అసలు అనిరుధ్కు తెలుగు బాషను ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎక్కడ హుక్ చేయాలి అనే విషయం తెలియదని.. అందుకే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా రిలీజయ్యాక.. ముందు నువ్వు వెళ్ళి తెలుగు నేర్చుకో అని చెప్పానని త్రివిక్రమ్ స్వయంగా సెలవిచ్చాడు. అటువంటిది ఇప్పుడు తమన్ను తీసేసి అనిరుధ్ను ఎలా పెట్టుకుంటాడు? పైగా తమన్ ఎవరికి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చినా కూడా త్రివిక్రమ్ కోసం మాత్రం ఎప్పుడూ టెరిఫిక్ ట్యూన్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోరే ఇస్తాడు. కాబట్టి #SSMB28కు తమన్ రైట్ చాయిస్ అని అందరూ నమ్మాల్సిందే.
ఒక్క ప్రక్కన మహేష్ పితృవియోగం చెంది బాధలో ఉంటే, త్రివిక్రమ్ కూడా సూపర్ స్టార్ వెంటే ఉంటూ ఆయనకు ధైర్యాన్ని చెప్పే పనిలో ఉన్నాడు. ఈ సమయంలో తమన్ వద్దు, అనిరుధ్ వద్దు, వాళ్లొద్దూ, వీళ్లొద్దూ అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ చేయడం ఏంటమ్మా?
This post was last modified on November 25, 2022 10:08 am
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…