ఓ రెండు రోజుల నుండి నెట్టింట్లో మారుమోగిపోయిన మ్యాటర్ ఏంటంటే.. ఈ మధ్య కాలంలో తమన్ కొడుతున్న ట్యూన్స్ అంతగా క్యాచీగా లేవు కాబట్టి, సర్కారు వారి పాట సినిమాలో పాటలు ఓ రెండు తప్ప ఏవీ పెద్దగా క్లిక్ కాలేదు కాబట్టి, #SSMB28 కోసం ఇప్పుడు త్రివిక్రమ్ మళ్ళీ అనిరుధ్ను దించుతున్నాడంటూ టాక్ వచ్చేసింది. వీటిపై క్లారిటీ ఇవ్వడానికి, తమన్కు బర్త డే విషెస్ చెప్పిన సితార వంశీ, #SSMB28 ట్యూన్స్ కోసం వెయిటింగ్ అంటూ ఒక కామెంట్ చేశాడు. దానితో తమన్ను మార్చట్లేదని క్లారిటీ వచ్చింది. అయితే ఇక్కడ అనిరుధ్ మ్యాటర్ ఓసారి డిస్కస్ చేద్దాం.
అసలు ఈ మ్యూజిక్ డైరక్టర్ను పెట్టుకో, పలానా డైరక్టర్తో వద్దు, పలానా హీరోయిన్ను తీసుకోండి అంటే అవతల దిగ్గజాలైన మహేష్ బాబు, త్రివిక్రమ్ వంటి స్టార్స్ వింటారా? అవన్నీ పక్కన పెట్టేస్తే.. అసలు అనిరుధ్కు తెలుగు బాషను ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎక్కడ హుక్ చేయాలి అనే విషయం తెలియదని.. అందుకే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా రిలీజయ్యాక.. ముందు నువ్వు వెళ్ళి తెలుగు నేర్చుకో అని చెప్పానని త్రివిక్రమ్ స్వయంగా సెలవిచ్చాడు. అటువంటిది ఇప్పుడు తమన్ను తీసేసి అనిరుధ్ను ఎలా పెట్టుకుంటాడు? పైగా తమన్ ఎవరికి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చినా కూడా త్రివిక్రమ్ కోసం మాత్రం ఎప్పుడూ టెరిఫిక్ ట్యూన్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోరే ఇస్తాడు. కాబట్టి #SSMB28కు తమన్ రైట్ చాయిస్ అని అందరూ నమ్మాల్సిందే.
ఒక్క ప్రక్కన మహేష్ పితృవియోగం చెంది బాధలో ఉంటే, త్రివిక్రమ్ కూడా సూపర్ స్టార్ వెంటే ఉంటూ ఆయనకు ధైర్యాన్ని చెప్పే పనిలో ఉన్నాడు. ఈ సమయంలో తమన్ వద్దు, అనిరుధ్ వద్దు, వాళ్లొద్దూ, వీళ్లొద్దూ అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ చేయడం ఏంటమ్మా?
This post was last modified on November 25, 2022 10:08 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…