థియేటర్ ఎక్స్ పీరియన్స్ అంటే కేవలం ఆర్ఆర్ఆర్ లాంటి గ్రాఫిక్స్ కాదు, కాంతార లాంటి డిఫరెంట్ జానర్సూ కాదు. ఎందుకంటే ఇవి అరుదుగా జరిగే ప్రయత్నాలు. మహా అయితే రెండేళ్లకు మూడు నాలుగు వస్తాయి అంతే. మిగిలిన టైంలో జనాన్ని థియేటర్ కు రప్పించాలంటే కావాల్సింది మాస్ బొమ్మలే. గత కొన్ని నెలలుగా హీరోయిజంతో విజిళ్లు కేకలు పెట్టించే తెలుగు స్టార్ హీరో బొమ్మ సరిగా పడలేదు. ఈ మధ్యే విడుదలైన సుడిగాలి సుధీర్ గాలోడు సినిమా గురించి ఒక్కరూ పాజిటివ్ గా మాట్లాడింది లేదు. కానీ మొదటి వారం పూర్తి కాకుండానే మూడు కోట్ల షేర్ కు దగ్గరగా వెళ్లడం చూసి ఎవరికి నోటా మాట రావడం లేదు.
ఇదంతా మల్టీప్లెక్సుల నుంచి వచ్చిన కలెక్షన్ కాదు. బిసి సెంటర్ల సింగల్ స్క్రీన్ల నుంచి రాబడుతున్న లెక్క. అసలు మూడో రోజైనా ఉంటుందా లేదానే అనుమానాలకు తెరదించుతూ కొన్ని చోట్ల రెండు వారాలు గ్యారెంటీ రన్ కు స్క్రీన్లను లాక్ చేసుకుంది. దీన్ని బట్టి మాస్ ఆడియన్స్ ఎంత కరువులో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గాలోడు చూశాక సుధీర్ మంచి కథలను ఎంచుకుంటే గొప్ప ఫలితాలు అందుకోవచ్చనే మాట అందరి నోటా వినిపిస్తోంది. అసలు విషయమే లేని ఇలాంటి సినిమానే ఇంతగా ఆడితే కంటెంట్ బలంగా ఉంటే గట్టిగా కొట్టొచ్చనేది అభిమానుల మాట.
మరి సుధీర్ కే ఇంత రేంజ్ రెస్పాన్స్ వస్తే ఇక జనవరిలో రాబోయే వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు ఏ స్థాయి ఊచకోత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ పర్లేదనే టాక్ వచ్చినా చాలు సంక్రాంతి అడ్వాంటేజ్ తో చిరు బాలయ్య రికార్డులను మడత పెట్టేస్తారు. సీతారామం, బింబిసార, కార్తికేయ 2, యశోద, గాడ్ ఫాదర్ ఫలితాలు బ్లాక్ బస్టర్స్ నుంచి యావరేజ్ దాకా బాగానే ఉన్నా మాస్ కి పూర్తి స్థాయి గూస్ బంప్స్ ఇచ్చినవి కాదు. అందుకే ఆ లోటుని తీర్చే బొమ్మలు రావాలి. ఒకవేళ రవితేజ డిసెంబర్ 23న ధమాకాతో ఏదైనా సర్ప్రైజ్ ఇస్తే సంతోషం లేదంటే సంక్రాంతి దాకా ఎదురు చూడాల్సిందే.
This post was last modified on November 23, 2022 12:32 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…