తెలుగులో చాలా తక్కువగా వచ్చే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జానర్ లో ఒక ప్రత్యేకత సంతరించుకున్న సినిమా హిట్. విశ్వక్ సేన్ నటించిన మొదటి భాగం హిట్టయ్యాక దానికి కొనసాగింపు ఉంటే బాగుండుననే ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే హిట్ 2 సిద్ధమైపోయింది. శైలేష్ కొలను దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ మర్డర్ మిస్టరీ డిసెంబర్ 2న విడుదల కానుంది. మేజర్ తర్వాత ప్యాన్ ఇండియా గుర్తింపు వచ్చేసిన అడవి శేష్ ఈసారి పోలీస్ ఆఫీసర్ పాత్రను టేకప్ చేయడంతో అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ లోనే అంత వయొలెన్స్ చూపిస్తే నెక్స్ట్ జరగబోయే పబ్లిసిటీ మీద హైప్ రాకుండా ఉంటుందా.
దానికి తగ్గట్టే ఇవాళ ట్రైలర్ వచ్చేసింది. కృష్ణదేవ్(అడవి శేష్)సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నేరస్తులకు కోడి బుర్ర ఉంటుందని వాళ్ళను పట్టుకోవడం చాలా తేలికనే అభిప్రాయంతో ఉంటాడు. అదే మీడియా ముందు కూడా అంటాడు. సంజన అనే అమ్మాయి దారుణంగా హత్య చేయబడిన తర్వాత ఆ కేసుని ఛేదించడం కృష్ణదేవ్ కు సవాల్ గా మారుతుంది. మర్డర్లు చేస్తున్న వాడు తాను అంచనా వేసినంత తక్కువ కాదని త్వరగా అర్థం చేసుకుంటాడు. కానీ మరోవైపు యువతుల హత్యలు జరుగుతూనే ఉంటాయి. ఆఖరికి కృష్ణ దేవ్ ఇంట్లోకే వచ్చేంత ప్రమాదకరంగా మారిన ఆ సైకో కిల్లర్ ని ఎలా పట్టుకున్నారనేదే స్టోరీ.
లైన్ పరంగా చూసుకుంటే గతంలో ఇలాంటివి చాలానే వచ్చాయి కానీ ఊహించని థ్రిల్స్ ట్విస్టులు లేకుండా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించరు కాబట్టి అవేంటో స్క్రీన్ మీద చూడాల్సిందే. ముందు నిర్లక్ష్యం ఆ తర్వాత భయం బాధ్యతతో కూడిన పోలీస్ గా అడవి శేష్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించాడు. విజువల్స్ లో మంచి ఇంటెన్సిటీ కనిపిస్తోంది. రావురమేష్, భరణి, పోసాని ఇలా సీనియర్ క్యాస్టింగ్ పెద్దదే ఉంది. మీనాక్షి ఫిమేల్ లీడ్. జాన్ స్టీవర్ట్ ఎడూరి నేపధ్య సంగీతం అరెస్టింగ్ గా ఉంది. మొత్తానికి హిట్ 2 నుంచి ఆశిస్తున్నది ట్రైలర్ ద్వారా అయితే ఇచ్చారు. ఇక సినిమా ఎలా ఉంటుందో పది రోజులు ఆగితే రిజల్ట్ వచ్చేస్తుంది.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…