మామూలుగా అయితే రొట్టి విరిగి నేతిలో పడుతుంది.. మరి మనోడు మోడ్రన్ జనరేషన్ కమెడియన్ కాబట్టి, బిస్కెట్ విరిగి తేనెలో పడిందని చెప్పుకోవాలి. జబర్దస్త్ ప్రోగ్రామ్తో విపరీతంగా పాపులర్ అయిన కమెడియన్ సుడిగాలి సుధీర్.. ఇప్పుడు తన సుడిని మార్చేసుకున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయ్. అయితే ఈ దెబ్బతో ఈ కామెడీ స్టార్ కూడా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాడంటూ ఇప్పుడు ఒక న్యూస్ చెక్కర్లు కొడుతోంది.
ఈ మధ్య కాలంలో కొంతమంది యంగ్ హీరోలు భలే క్లిక్ అయ్యారు. కాకపోతే వాళ్ళు క్లిక్ అయిన వెంటనే తమ రెమ్యూనరేషన్ను కోటి రూపాయలకు చేశారు. అందుకు ఉదాహరణ కిరణ్ అబ్బవరం. రెండో సినిమా ఆడింది అనగానే పారితోషకం కోటి చేశాడంట. దానితో ఇప్పుడు కమెడియన్ సుధీర్ కూడా.. హీరో సుధీర్గా మారిపోయి.. కోటి డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు. గతంలో కిరణ్ అబ్బవరం సినిమా సమ్మతమే.. ఫ్లాప్ అండ్ యావరేజ్ టాక్ మధ్య నలిగిపోతూ.. ₹5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత వచ్చిన నేను మీకు బాగా కావల్సిన వాడిని సినిమా కూడా అంతే.
ఇప్పడు సుధీర్ ‘గాలోడు’ సినిమా కూడా తొలి వీకెండ్లోనే ₹3 కోట్ల గ్రాస్ వసూళ్లతో షాకిచ్చింది. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా.. కలక్షన్లు మాత్రం మొత్తంగా ఒక ₹5 కోట్లు టచ్ అయ్యే ఛాన్సుంది. ఒకవేళ నిర్మాతలకు ఈ రెవన్యూ నుండి ₹3 కోట్లు షేర్ వస్తే.. మరో 3-4 కోట్లు రూపాయలు డిజిటల్, శాటిలైట్ రైట్స్ నుండి వచ్చే ఛాన్సుంది. అందుకే ఇప్పుడు ‘గాలోడు’ కూడా కోటి కావాలంటున్నాడని మార్కెట్లో టాక్ వినిపిస్తోంది.
This post was last modified on November 22, 2022 9:19 am
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…