మామూలుగా అయితే రొట్టి విరిగి నేతిలో పడుతుంది.. మరి మనోడు మోడ్రన్ జనరేషన్ కమెడియన్ కాబట్టి, బిస్కెట్ విరిగి తేనెలో పడిందని చెప్పుకోవాలి. జబర్దస్త్ ప్రోగ్రామ్తో విపరీతంగా పాపులర్ అయిన కమెడియన్ సుడిగాలి సుధీర్.. ఇప్పుడు తన సుడిని మార్చేసుకున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయ్. అయితే ఈ దెబ్బతో ఈ కామెడీ స్టార్ కూడా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాడంటూ ఇప్పుడు ఒక న్యూస్ చెక్కర్లు కొడుతోంది.
ఈ మధ్య కాలంలో కొంతమంది యంగ్ హీరోలు భలే క్లిక్ అయ్యారు. కాకపోతే వాళ్ళు క్లిక్ అయిన వెంటనే తమ రెమ్యూనరేషన్ను కోటి రూపాయలకు చేశారు. అందుకు ఉదాహరణ కిరణ్ అబ్బవరం. రెండో సినిమా ఆడింది అనగానే పారితోషకం కోటి చేశాడంట. దానితో ఇప్పుడు కమెడియన్ సుధీర్ కూడా.. హీరో సుధీర్గా మారిపోయి.. కోటి డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు. గతంలో కిరణ్ అబ్బవరం సినిమా సమ్మతమే.. ఫ్లాప్ అండ్ యావరేజ్ టాక్ మధ్య నలిగిపోతూ.. ₹5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత వచ్చిన నేను మీకు బాగా కావల్సిన వాడిని సినిమా కూడా అంతే.
ఇప్పడు సుధీర్ ‘గాలోడు’ సినిమా కూడా తొలి వీకెండ్లోనే ₹3 కోట్ల గ్రాస్ వసూళ్లతో షాకిచ్చింది. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా.. కలక్షన్లు మాత్రం మొత్తంగా ఒక ₹5 కోట్లు టచ్ అయ్యే ఛాన్సుంది. ఒకవేళ నిర్మాతలకు ఈ రెవన్యూ నుండి ₹3 కోట్లు షేర్ వస్తే.. మరో 3-4 కోట్లు రూపాయలు డిజిటల్, శాటిలైట్ రైట్స్ నుండి వచ్చే ఛాన్సుంది. అందుకే ఇప్పుడు ‘గాలోడు’ కూడా కోటి కావాలంటున్నాడని మార్కెట్లో టాక్ వినిపిస్తోంది.
This post was last modified on November 22, 2022 9:19 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…