సూపర్ స్టార్ కృష్ణ కొన్ని రోజుల కిందటే హఠాత్తుగా మరణించారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. ఒక్క రోజు వ్యవధిలో తుది శ్వాస విడిచారు. ఐతే కృష్ణ అనారోగ్యంతో ఉన్నట్లు ఈ మధ్య వార్తలేమీ రాలేదు. దీంతో ఇలా ఆయన హఠాత్తుగా ప్రాణాలు వదలడం ఏంటని అభిమానులు తీవ్ర మనో వ్యథకు గురయ్యారు. అసలాయనకు ఏం జరిగందో అర్థం కాక అయోమయంలో పడ్డారు. ఇంతకీ కృష్ణ చనిపోవడానికి ముందు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన సోదరుడు ఆదిశేషగిరి రావు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే..
గత ఆదివారం పొద్దునే అన్నయ్య దగ్గరకు వెళ్లాను. రెండు గంటలకు పైగా అక్కడే ఉన్నాను. ఆయనకు ఏమనిపించిందో ఏమో మా చిన్నప్పటి సంగతులు చెబుతూ వచ్చారు. నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని సినిమాలకు తీసుకెళ్లిన రోజుల నుంచీ అన్నీ గుర్తు చేసుకున్నారు. ఇద్దరం నవ్వుకున్నాం. తర్వాత ఇప్పుడొస్తున్న సినిమాల గురించి కూడా కాసేపు చర్చించుకున్నాం. అప్పుడాయనకు అనారోగ్య లక్షణాలేవీ కనిపించలేదు. హుషారుగా ఉన్నారు. నన్ను ఆ రోజు అక్కడే భోజనం చెయ్యమన్నారు కానీ ఇంట్లో వేరే వాళ్లని లంచ్కి పిలవడంతో మళ్లీ వస్తానని వచ్చేశాను.
ఐతే ఆ రోజు రాత్రి భోంచేసి పడుకున్నాక రాత్రి పన్నెండున్నరకి గుండెపోటు వచ్చింది. అన్నయ్య రూం బయట ఓ కుర్రాడు రాత్రిళ్లు ఆయన్ని కనిపెట్టుకుని ఉంటాడు. ఆయన గది తలుపు తెరిచే ఉంటుంది. అవసరం వస్తే పిలుస్తారు. అన్నయ్యకు గురక పెట్టే అలవాటు ఉంది. ఆ టైంలో గురక శబ్దం వినిపించక పోవడంతో ఆ కుర్రాడికి అనుమానం వచ్చి పల్స్ చెక్ చేశాడు. ‘ఎర్రర్’ అని వచ్చింది. వాడికి భయం వేసి నాకు ఫోన్ చేశాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పి నేనూ అక్కడికి చేరుకున్నా. గుండెపోటు వచ్చిన 20 నిమిషాల లోపు వైద్యం అంది ఉంటే కొంత ఫలితం ఉండేది. ఆలస్యం కావడంతో అవయవాల మీద ఆ ప్రభావం పడింది రక్త ప్రసరణ ఆగిపోయింది. దాదాపు 30 గంటలు డాక్టర్లు అన్నయ్యను బతికించడానికి పోరాటం చేశారు కానీ రెండోసారి గుండెపోటు రావడంతో ఫలితం లేకపోయింది అని ఆదిశేషగిరి రావు వివరించారు.
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…