సూపర్ స్టార్ కృష్ణ కొన్ని రోజుల కిందటే హఠాత్తుగా మరణించారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. ఒక్క రోజు వ్యవధిలో తుది శ్వాస విడిచారు. ఐతే కృష్ణ అనారోగ్యంతో ఉన్నట్లు ఈ మధ్య వార్తలేమీ రాలేదు. దీంతో ఇలా ఆయన హఠాత్తుగా ప్రాణాలు వదలడం ఏంటని అభిమానులు తీవ్ర మనో వ్యథకు గురయ్యారు. అసలాయనకు ఏం జరిగందో అర్థం కాక అయోమయంలో పడ్డారు. ఇంతకీ కృష్ణ చనిపోవడానికి ముందు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన సోదరుడు ఆదిశేషగిరి రావు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే..
గత ఆదివారం పొద్దునే అన్నయ్య దగ్గరకు వెళ్లాను. రెండు గంటలకు పైగా అక్కడే ఉన్నాను. ఆయనకు ఏమనిపించిందో ఏమో మా చిన్నప్పటి సంగతులు చెబుతూ వచ్చారు. నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని సినిమాలకు తీసుకెళ్లిన రోజుల నుంచీ అన్నీ గుర్తు చేసుకున్నారు. ఇద్దరం నవ్వుకున్నాం. తర్వాత ఇప్పుడొస్తున్న సినిమాల గురించి కూడా కాసేపు చర్చించుకున్నాం. అప్పుడాయనకు అనారోగ్య లక్షణాలేవీ కనిపించలేదు. హుషారుగా ఉన్నారు. నన్ను ఆ రోజు అక్కడే భోజనం చెయ్యమన్నారు కానీ ఇంట్లో వేరే వాళ్లని లంచ్కి పిలవడంతో మళ్లీ వస్తానని వచ్చేశాను.
ఐతే ఆ రోజు రాత్రి భోంచేసి పడుకున్నాక రాత్రి పన్నెండున్నరకి గుండెపోటు వచ్చింది. అన్నయ్య రూం బయట ఓ కుర్రాడు రాత్రిళ్లు ఆయన్ని కనిపెట్టుకుని ఉంటాడు. ఆయన గది తలుపు తెరిచే ఉంటుంది. అవసరం వస్తే పిలుస్తారు. అన్నయ్యకు గురక పెట్టే అలవాటు ఉంది. ఆ టైంలో గురక శబ్దం వినిపించక పోవడంతో ఆ కుర్రాడికి అనుమానం వచ్చి పల్స్ చెక్ చేశాడు. ‘ఎర్రర్’ అని వచ్చింది. వాడికి భయం వేసి నాకు ఫోన్ చేశాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పి నేనూ అక్కడికి చేరుకున్నా. గుండెపోటు వచ్చిన 20 నిమిషాల లోపు వైద్యం అంది ఉంటే కొంత ఫలితం ఉండేది. ఆలస్యం కావడంతో అవయవాల మీద ఆ ప్రభావం పడింది రక్త ప్రసరణ ఆగిపోయింది. దాదాపు 30 గంటలు డాక్టర్లు అన్నయ్యను బతికించడానికి పోరాటం చేశారు కానీ రెండోసారి గుండెపోటు రావడంతో ఫలితం లేకపోయింది అని ఆదిశేషగిరి రావు వివరించారు.
This post was last modified on November 20, 2022 8:43 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…