కొవిడ్ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ ఎలా ఢీలా పడిందో తెలిసిందే. గత ఏడాది కాలంలో అరడజను సినిమాలు కూడా థియేటర్లలో బాగా ఆడి లాభాలు తెచ్చిపెట్టలేదు. పెద్ద హీరోలు నటించిన భారీ చిత్రాలు కూడా బోల్తా కొడుతుండడంతో బాలీవుడ్ బెంబేలెత్తిపోతోంది. ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లాంటి బడా స్టార్లకు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవాలు తప్పలేదు. రోజు రోజుకూ పరిస్థితి ఘోరంగా తయారవుతుండడంతో బాలీవుడ్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇలాంటి టైంలో ఒక సినిమా బాలీవుడ్లో కొత్త ఆశలు రేపుతోంది. ఆ చిత్రమే.. దృశ్యం-2.
మలయాళ బ్లాక్బస్టర్ దృశ్యంను హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టిన అజయ్ దేవగణ్.. దాని సీక్వెల్ను సైతం రీమేక్ చేశాడు. అభిషేక్ పాఠక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. మలయాళ వెర్షన్తో పోలిస్తే కొన్ని మార్పులు చేర్పులు చేసి మరింత ఎగ్జైటింగ్గా సినిమాను తీర్చిదిద్దారు.
ట్రైలర్ ఆసక్తికరంగా సాగడం, దృశ్యం సీక్వెల్ పట్ల ఉన్న ఆసక్తి సినిమాకు ప్లస్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్లోనే మంచి ఊపు చూపించిన దృశ్యం-2.. తొలి రోజు రూ.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర శుభారంభం చేసింది. రివ్యూలకు తోడు మౌత్ టాక్ కూడా బాగుండడంతో హిందీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు. శనివారం వసూళ్లు మరింతగా పుంజుకున్నాయి. రూ.25 కోట్ల దాకా గ్రాస్ వచ్చిందీ చిత్రానికి. శనివారం ప్యాక్డ్ హౌసెస్తో నడిచింది దృశ్యం-2.
డిమాండ్ ఎక్కువ ఉండడంతో షోలు, స్క్రీన్లు పెంచుతూ పోతున్నారు సినిమాకు. ఆదివారం టికెట్లు దొరకడం కష్టమయ్యే పరిస్థితి అంటే సినిమా ఎంత బాగా ఆడుతోందో అర్థం చేసుకోవచ్చు. వీకెండ్లో సినిమా రూ.60 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసేలా ఉంది. సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి దృశ్యం-2 బాలీవుడ్కు గొప్ప ఉపశమనాన్ని ఇస్తోందనడంలో సందేహం లేదు.
This post was last modified on November 20, 2022 8:34 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…