ఢిల్లీలో ఒక ఆగంతకుడు తన ప్రేయసిని చంపేసి 35 ముక్కలు చేసి.. మూడ్నెళ్ళు ఫ్రిజ్లో ఉంచి.. తరువాత ఒక్కో శరీరభాగాన్ని ఒక్కోచోట పడేయటం అనేది పెద్ద సంచలనమే. దీన్ని క్యాష్ చేసుకుంటున్న టివి ఛానల్స్ ఆల్రెడీ రోజూ ఈ న్యూస్పైన స్పెషల్ స్టోరీలు వేసుకుంటూ టి.ఆర్.పి.లు పెంచుకుంటున్నాయ్. ఏ చిన్న క్లూ గురించి ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా.. వెంటనే దానిని భూతద్దంలో చూపించేసి, సదరు క్రైమ్ గురించి భయంకరమైన స్టోరీలు వేస్తున్నాయ్. సరే, పబ్లిక్కు మ్యాటర్ తెలియాలి కాబట్టి, చూపించడంలో తప్పే లేదు. కాని రామ్ గోపాల్ వర్మ వంటి డైరక్టర్లు ఈ బ్రూటల్ మర్డర్ గురించి ప్రస్తావిస్తుంటే మాత్రం భయం వేస్తోంది.
”దేవుడికి నేను చేసుకునే విన్నపం ఏంటంటే.. కఠినమైన చట్టాలు ఉన్నంతమాత్రాన కరుడుగట్టిన నేరస్తులు నేరాలు చేయడం మానేయరు. అదే చనిపోయినవారి ఆత్మలు తిరిగొచ్చి వీళ్ళని చంపేస్తే మాత్రం భయం ఉంటుంది” అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ వేశాడు. దీన్ని చూస్తుంటే మాత్రం, వర్మ ఏదో సలహా ఇచ్చినట్లు లేదు, ఈ ఇన్సిడెంట్ను వాడుకుని తను తీయబోతున్న సినిమా తాలూకు లైన్ చెబుతున్నట్లుంది. అందుకే ఇప్పుడు ఆ ట్వీట్ చూసినవారందరూ.. దయచేసి మీరు ఈ టాపిక్ మీద సినిమా తియ్యకండి సార్ అంటూ వర్మను రిక్వెస్ట్ చేస్తున్నారు.
అప్పట్లో తన ప్రియుడు నీరజ్ గ్రోవర్.. మారియా సుసైరాజ్ అనే నటీమణి ఘోరంగా చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఇలాగే ప్యాక్ చేసి పాడేసింది. ఈ టాపిక్ తీసుకుని, ‘నాట్ ఏ లవ్ స్టోరీ’ అంటూ రాము సినిమా తీసేశాడు. ఆ తరువాత నల్గొండ జిల్లాలో జరిగిన ప్రణయ్ హత్యోదంతాన్ని కూడా మనోడు సినిమా రూపంలో తెరకెక్కించేశాడు. అలాగే హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక సామూహిక రేప్ ఇన్సిడెంట్ను కూడా సినిమాగా మార్చేశాడు. ఈ సినిమా వలన ప్రజలకు కలిగే ఎంటర్టయిన్మెంట్ ఏంటో రామూకే తెలియాలి కాని.. అనవసరంగా ఆడియన్స్ మాత్రం భయపడే ఛాన్సుంది. కాబట్టి వర్మ ఈ కొత్త మర్డర్ను ప్రశాంతంగా వదిలేయాలని జనాలు కూడా కోరుకుంటున్నారు.
This post was last modified on November 17, 2022 11:51 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…