Movie News

ఇప్పుడు సినిమా తియ్యకండి సార్ ప్లీజ్

ఢిల్లీలో ఒక ఆగంతకుడు తన ప్రేయసిని చంపేసి 35 ముక్కలు చేసి.. మూడ్నెళ్ళు ఫ్రిజ్‌లో ఉంచి.. తరువాత ఒక్కో శరీరభాగాన్ని ఒక్కోచోట పడేయటం అనేది పెద్ద సంచలనమే. దీన్ని క్యాష్ చేసుకుంటున్న టివి ఛానల్స్ ఆల్రెడీ రోజూ ఈ న్యూస్‌‌పైన స్పెషల్ స్టోరీలు వేసుకుంటూ టి.ఆర్.పి.లు పెంచుకుంటున్నాయ్. ఏ చిన్న క్లూ గురించి ఇన్ఫర్‌మేషన్ దొరికినా కూడా.. వెంటనే దానిని భూతద్దంలో చూపించేసి, సదరు క్రైమ్ గురించి భయంకరమైన స్టోరీలు వేస్తున్నాయ్. సరే, పబ్లిక్‌కు మ్యాటర్ తెలియాలి కాబట్టి, చూపించడంలో తప్పే లేదు. కాని రామ్ గోపాల్ వర్మ వంటి డైరక్టర్లు ఈ బ్రూటల్ మర్డర్ గురించి ప్రస్తావిస్తుంటే మాత్రం భయం వేస్తోంది.

”దేవుడికి నేను చేసుకునే విన్నపం ఏంటంటే.. కఠినమైన చట్టాలు ఉన్నంతమాత్రాన కరుడుగట్టిన నేరస్తులు నేరాలు చేయడం మానేయరు. అదే చనిపోయినవారి ఆత్మలు తిరిగొచ్చి వీళ్ళని చంపేస్తే మాత్రం భయం ఉంటుంది” అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ వేశాడు. దీన్ని చూస్తుంటే మాత్రం, వర్మ ఏదో సలహా ఇచ్చినట్లు లేదు, ఈ ఇన్సిడెంట్‌ను వాడుకుని తను తీయబోతున్న సినిమా తాలూకు లైన్ చెబుతున్నట్లుంది. అందుకే ఇప్పుడు ఆ ట్వీట్ చూసినవారందరూ.. దయచేసి మీరు ఈ టాపిక్ మీద సినిమా తియ్యకండి సార్ అంటూ వర్మను రిక్వెస్ట్ చేస్తున్నారు.

అప్పట్లో తన ప్రియుడు నీరజ్ గ్రోవర్.. మారియా సుసైరాజ్ అనే నటీమణి ఘోరంగా చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఇలాగే ప్యాక్ చేసి పాడేసింది. ఈ టాపిక్ తీసుకుని, ‘నాట్ ఏ లవ్ స్టోరీ’ అంటూ రాము సినిమా తీసేశాడు. ఆ తరువాత నల్గొండ జిల్లాలో జరిగిన ప్రణయ్ హత్యోదంతాన్ని కూడా మనోడు సినిమా రూపంలో తెరకెక్కించేశాడు. అలాగే హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక సామూహిక రేప్ ఇన్సిడెంట్‌ను కూడా సినిమాగా మార్చేశాడు. ఈ సినిమా వలన ప్రజలకు కలిగే ఎంటర్టయిన్మెంట్ ఏంటో రామూకే తెలియాలి కాని.. అనవసరంగా ఆడియన్స్ మాత్రం భయపడే ఛాన్సుంది. కాబట్టి వర్మ ఈ కొత్త మర్డర్‌ను ప్రశాంతంగా వదిలేయాలని జనాలు కూడా కోరుకుంటున్నారు.

This post was last modified on November 17, 2022 11:51 am

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

24 minutes ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

35 minutes ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

54 minutes ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

1 hour ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

2 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

4 hours ago