ఢిల్లీలో ఒక ఆగంతకుడు తన ప్రేయసిని చంపేసి 35 ముక్కలు చేసి.. మూడ్నెళ్ళు ఫ్రిజ్లో ఉంచి.. తరువాత ఒక్కో శరీరభాగాన్ని ఒక్కోచోట పడేయటం అనేది పెద్ద సంచలనమే. దీన్ని క్యాష్ చేసుకుంటున్న టివి ఛానల్స్ ఆల్రెడీ రోజూ ఈ న్యూస్పైన స్పెషల్ స్టోరీలు వేసుకుంటూ టి.ఆర్.పి.లు పెంచుకుంటున్నాయ్. ఏ చిన్న క్లూ గురించి ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా.. వెంటనే దానిని భూతద్దంలో చూపించేసి, సదరు క్రైమ్ గురించి భయంకరమైన స్టోరీలు వేస్తున్నాయ్. సరే, పబ్లిక్కు మ్యాటర్ తెలియాలి కాబట్టి, చూపించడంలో తప్పే లేదు. కాని రామ్ గోపాల్ వర్మ వంటి డైరక్టర్లు ఈ బ్రూటల్ మర్డర్ గురించి ప్రస్తావిస్తుంటే మాత్రం భయం వేస్తోంది.
”దేవుడికి నేను చేసుకునే విన్నపం ఏంటంటే.. కఠినమైన చట్టాలు ఉన్నంతమాత్రాన కరుడుగట్టిన నేరస్తులు నేరాలు చేయడం మానేయరు. అదే చనిపోయినవారి ఆత్మలు తిరిగొచ్చి వీళ్ళని చంపేస్తే మాత్రం భయం ఉంటుంది” అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ వేశాడు. దీన్ని చూస్తుంటే మాత్రం, వర్మ ఏదో సలహా ఇచ్చినట్లు లేదు, ఈ ఇన్సిడెంట్ను వాడుకుని తను తీయబోతున్న సినిమా తాలూకు లైన్ చెబుతున్నట్లుంది. అందుకే ఇప్పుడు ఆ ట్వీట్ చూసినవారందరూ.. దయచేసి మీరు ఈ టాపిక్ మీద సినిమా తియ్యకండి సార్ అంటూ వర్మను రిక్వెస్ట్ చేస్తున్నారు.
అప్పట్లో తన ప్రియుడు నీరజ్ గ్రోవర్.. మారియా సుసైరాజ్ అనే నటీమణి ఘోరంగా చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఇలాగే ప్యాక్ చేసి పాడేసింది. ఈ టాపిక్ తీసుకుని, ‘నాట్ ఏ లవ్ స్టోరీ’ అంటూ రాము సినిమా తీసేశాడు. ఆ తరువాత నల్గొండ జిల్లాలో జరిగిన ప్రణయ్ హత్యోదంతాన్ని కూడా మనోడు సినిమా రూపంలో తెరకెక్కించేశాడు. అలాగే హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక సామూహిక రేప్ ఇన్సిడెంట్ను కూడా సినిమాగా మార్చేశాడు. ఈ సినిమా వలన ప్రజలకు కలిగే ఎంటర్టయిన్మెంట్ ఏంటో రామూకే తెలియాలి కాని.. అనవసరంగా ఆడియన్స్ మాత్రం భయపడే ఛాన్సుంది. కాబట్టి వర్మ ఈ కొత్త మర్డర్ను ప్రశాంతంగా వదిలేయాలని జనాలు కూడా కోరుకుంటున్నారు.
This post was last modified on November 17, 2022 11:51 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…