అల్లు అర్జున్-సుకుమార్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం పుష్పలో ఓ కీలక పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరగడం.. పైగా కరోనా వచ్చి పెద్ద బ్రేక్ వేయడంతో సేతుపతికి తలనొప్పి మొదలైంది. అతడికి తమిళంలో ఇబ్బడి ముబ్బడిగా సినిమాలున్నాయి. రెండంకెల సంఖ్యలో కమిట్మెంట్లు ఇచ్చాడట. కరోనా ప్రభావం తగ్గాక ఆ సినిమాలకు డేట్లు సర్దుబాటు చేయడమే తలకు మించిన భారంగా ఉంది. ఇక బల్క్ డేట్లు అవసరమైన పుష్ప సినిమాకు ఎలా కాల్ షీట్లు కేటాయించాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో అతను పుష్ప నుంచి తప్పుకున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
కానీ ఈ విషయంలో స్పష్టత లేకపోయింది. అధికార ప్రకటన ఏదీ లేదు. ఐతే ఇప్పుడు స్వయంగా విజయ్ సేతుపతే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. ఓ తమిళ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను పుష్ప సినిమా నుంచి తప్పుకున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమా కోసం తనను అడగడం, పాత్ర నచ్చి అంగీకారం తెలపడం నిజమే అని.. కానీ ఇప్పుడు డేట్ల సమస్య తలెత్తడంతో ఈ చిత్రం నుంచి తప్పుకోక తప్పలేదని అతను తెలిపాడు. ఇప్పుడు హామీ ఇచ్చి.. తీరా షూటింగ్ మొదలయ్యే సమయానికి డేట్లు సర్దుబాటు చేయలేకపోతే ఇబ్బందని.. కాబట్టి తప్పుడు హామీలు ఇవ్వలేకే ఈ సినిమా నుంచి తప్పుకున్నానని విజయ్ స్పష్టం చేశాడు. విజయ్ ఈ విషయంలో ముందే సంకేతాలు ఇవ్వడంతో ఆ పాత్రలో బాబీ సింహా లేదా అరవింద్ స్వామిని నటింపజేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on July 14, 2020 1:03 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…