అల్లు అర్జున్-సుకుమార్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం పుష్పలో ఓ కీలక పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరగడం.. పైగా కరోనా వచ్చి పెద్ద బ్రేక్ వేయడంతో సేతుపతికి తలనొప్పి మొదలైంది. అతడికి తమిళంలో ఇబ్బడి ముబ్బడిగా సినిమాలున్నాయి. రెండంకెల సంఖ్యలో కమిట్మెంట్లు ఇచ్చాడట. కరోనా ప్రభావం తగ్గాక ఆ సినిమాలకు డేట్లు సర్దుబాటు చేయడమే తలకు మించిన భారంగా ఉంది. ఇక బల్క్ డేట్లు అవసరమైన పుష్ప సినిమాకు ఎలా కాల్ షీట్లు కేటాయించాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో అతను పుష్ప నుంచి తప్పుకున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
కానీ ఈ విషయంలో స్పష్టత లేకపోయింది. అధికార ప్రకటన ఏదీ లేదు. ఐతే ఇప్పుడు స్వయంగా విజయ్ సేతుపతే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. ఓ తమిళ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను పుష్ప సినిమా నుంచి తప్పుకున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమా కోసం తనను అడగడం, పాత్ర నచ్చి అంగీకారం తెలపడం నిజమే అని.. కానీ ఇప్పుడు డేట్ల సమస్య తలెత్తడంతో ఈ చిత్రం నుంచి తప్పుకోక తప్పలేదని అతను తెలిపాడు. ఇప్పుడు హామీ ఇచ్చి.. తీరా షూటింగ్ మొదలయ్యే సమయానికి డేట్లు సర్దుబాటు చేయలేకపోతే ఇబ్బందని.. కాబట్టి తప్పుడు హామీలు ఇవ్వలేకే ఈ సినిమా నుంచి తప్పుకున్నానని విజయ్ స్పష్టం చేశాడు. విజయ్ ఈ విషయంలో ముందే సంకేతాలు ఇవ్వడంతో ఆ పాత్రలో బాబీ సింహా లేదా అరవింద్ స్వామిని నటింపజేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on July 14, 2020 1:03 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…