టాలీవుడ్లో ప్రభాస్ పెళ్లి ఒకప్పుడు హాట్ టాపిక్. ఇది ఎంతకీ తెగే వ్యవహారంలా కనిపించకపోవడంతో ఈ చర్చను పక్కన పెట్టేశారు జనం. ప్రభాస్ పెళ్లి చేయాలని ఎంతో ఆశపడ్డ కృష్ణంరాజు ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. మరి ప్రభాస్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడో తెలియట్లేదు. తమిళ సినీ పరిశ్రమలో విశాల్ పెళ్లి వ్యవహారం కూడా ఇలాగే తయారైంది.
ఒకప్పుడు వరలక్ష్మి శరత్కుమార్తో డీప్ లవ్లో ఉన్నట్లుగా కనిపించిన విశాల్.. ఆమెను పెళ్లి చేసుకోవడమే తరువాయి అన్నారు. కానీ వాళ్లిద్దరూ తర్వాత విడిపోయారు. ఆపై అనీషా అనే హైదరాబాద్ అమ్మాయితో విశాల్కు నిశ్చితార్థం జరిగి రద్దవడం తెలిసిందే. ఆ తర్వాత విశాల్ పెళ్లి గురించి పెద్దగా చర్చ లేదు. కానీ ఈ మధ్య విశాల్ తనే కల్పించుకుని తన పెళ్లి గురించి మాట్లాడుతుండడం విశేషం. నడిగర్ సంఘం భవన నిర్మాణ పనులు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని పాత పాటే పాడాడు.
దాంతో పాటుగా త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేస్తానని చెప్పాడు విశాల్. కాగా తన కొత్త చిత్రం ‘లాఠీ’కి సంబంధించి హైదరాబాద్లో ఒక ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న విశాల్కు యాంకర్ నుంచి పెళ్లి సంబంధిత ప్రశ్నే ఎదురైంది. మీరు అభినయ అనే అమ్మాయిని పెళ్లాడుతున్నారట నిజమేనా అని విశాల్ను ఆమె ప్రశ్నించడం విశేషం. దీనికి విశాల్ బదులిస్తూ.. ఎప్పట్నుంచో చెబుతున్నట్లే తాను నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని.. అందరికీ త్వరలోనే తన పెళ్లి గురించి క్లారిటీ ఇస్తానని చెప్పాడు.
సినిమా ఈవెంట్లో యాంకర్ ఇలా ప్రశ్నించింది అంటే.. ఇదంతా ముందుగా ప్లాన్ చేసుకున్న విషయం అనిపిస్తోంది. ఇప్పుడిక ఈ అభినయ గురించి అందరూ తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. నాడోడిగల్ (తెలుగులో శంభో శివ శంభో) చిత్రంతో నటిగా పరిచయం అయిన అభినయ.. తెలుగులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె మూగ అమ్మాయి కావడం విశేషం. మరి నిజంగా విశాల్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.
This post was last modified on November 14, 2022 1:15 pm
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…