Movie News

దిల్ రాజుకు నిర్మాతల మండలి షాక్

అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ మధ్య తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తన నిర్మాణంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా కోసం కార్తికేయ-2ను వాయిదా వేయించాడనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనకు అప్పుడు బాగానే డ్యామేజ్ జరిగింది. కవర్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక ఇప్పుడేమో తన ప్రొడక్షన్లో రానున్న కొత్త చిత్రం వారసుడుకు నైజాం ఏరియాలో సంక్రాంతికి ఎక్కువ స్క్రీన్లు అట్టిపెట్టుకుంటున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారాయన.

గతంలో తమిళ చిత్రం పేటకు థియేటర్లు ఇచ్చే విషయమై వివాదం తలెత్తినపుడు.. పండుగలకు తెలుగు సినిమాలను కాదని వేరే భాషా చిత్రానికి ఎలా స్క్రీన్లు ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో తమిళ అనువాద చిత్రమే అయిన వారసుడు కోసమని ఎక్కువ థియేటర్లు కేటాయిస్తుండడం దుమారం రేపుతోంది.

దీనిపై ఇప్పటికే చిరంజీవి, బాలయ్య అభిమానులు దిల్ రాజును టార్గెట్ చేశారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలను కాదని వారసుడు కు ఎక్కువ స్క్రీన్లు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. ఐతే ఎవరో నెటిజన్లు విమర్శలు చేయడం వేరు. కానీ ఇప్పుడు తెలుగు నిర్మాతల మండలి ఈ విషయమై ఏకంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 12న జరిగిన ఫిలిం ఛాంబర్ అత్యవసర సమావేశం సందర్భంగా పండుగలప్పుడు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలకే మెజారిటీ థియేటర్లు ఇవ్వాలన్న నిర్ణయం జరిగిందనే విషయాన్ని ఈ ప్రెస్ నోట్లో ప్రస్తావించారు.

అంతే కాక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దిల్ రాజు పాత వీడియోను ఉటంకిస్తూ అప్పటి మాటలకు దిల్ రాజు కట్టుబడి సంక్రాంతికి తెలుగు చిత్రాలకే అధిక ప్రాధాన్యం దక్కేలా చూడాలని పేర్కొన్నారు. మీడియాలో, సోషల్ మీడియలో విమర్శలను అయితే పట్టించుకోకుండా ఉండిపోవచ్చు కానీ ఇలా నేరుగా నిర్మాతల మండలే లేఖ రాయడం అంటే దిల్ రాజుకు పెద్ద షాకే. ఇప్పుడాయన ఏం చేస్తారో చూడాలి మరి.

This post was last modified on November 13, 2022 10:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

31 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago