అదేంటో మైత్రి మూవీ మేకర్స్ సినిమాలకే లీకుల బెడద ఎక్కువగా ఉంటోంది. తాజాగా ఈ లిస్టులో వీరసింహారెడ్డి మొదటి స్థానంలో ఉంది. ఆ మధ్య కర్నూలు జిల్లాలో టైటిల్ సాంగ్ చిత్రీకరించినప్పుడు దాని తాలూకు చిన్న వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది. టీమ్ అలెర్ట్ అయిపోయి డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం నడిపింది కానీ అప్పటికీ దాని రీచ్ ఎక్కడికో వెళ్ళింది.
తాజాగా అనంతపురం జిల్లా పెనుగొండలో జరుగుతున్న చిత్రీకరణ సైతం దీని బారిన పడక తప్పలేదు. విలన్ దునియా విజయ్ మీద షూట్ చేసిన కొన్ని సీన్లు బయటికి రావడం ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. అందులో ఫ్లాష్ బ్యాక్ గెటప్ లో ప్రతాప్ రెడ్డిగా నటిస్తున్న విజయ్ తాలూకు సన్నివేశాలున్నాయి. తుపాకీలతో జరిపే ఓ పందెంలో పాల్గొనే దృశ్యం కూడా ఉంది. ట్విట్టర్ లో చూస్తే ఇవి ఎక్కువ కన్నడ ఫ్యాన్స్ నుంచి బయటికి వస్తున్నాయి.
షూటింగ్ జరుగుతున్న ప్రాంతం కర్ణాటక బోర్డర్ కు దగ్గర కావడంతో అభిమానులు తండోపతండాలుగా వెళ్ళిపోయి తమ సెల్ ఫోన్ కెమెరాలను పని చెబుతున్నారు. అవుట్ డోర్ అందులోనూ గ్రామీణ ప్రాంతం కావడంతో వీటిని కట్టడి చేయడం యూనిట్ కి కష్టసాధ్యంగా మారింది. దాంతో ఇప్పటికిప్పుడు వీటిని ఎవరూ ఆపలేని పరిస్థితి నెలకొంది.
వీటి సంగతెలా ఉన్నా అఫీషియల్ కాకపోయినా ఇవన్నీ వీరసింహారెడ్డి మీద అంచనాలు పెంచేలానే ఉన్నాయి.
పవర్ ఫుల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలకృష్ణ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో టీజరో ట్రైలరో రిలీజ్ అయితే క్లారిటీ వస్తుంది. సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేర్ వీరయ్యతో పోటీ పడబోతున్న వీరసింహారెడ్డి జనవరి 12 రిలీజ్ లాక్ చేసుకుందని ఇన్ సైడ్ టాక్. అధికారిక ప్రకటన ఇప్పుడే జరగకపోవచ్చు. వీరయ్య డేట్ ని లాక్ చేశాక రెండింటిని ఎప్పుడు రివీల్ చేయాలన్నది డిసైడ్ చేస్తారు. వారసుడు కూడా వెయిటింగ్ లోనే ఉంది.
This post was last modified on November 13, 2022 3:33 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…