Movie News

హైప్ పెంచుతున్న వీరసింహా లీకులు

అదేంటో మైత్రి మూవీ మేకర్స్ సినిమాలకే లీకుల బెడద ఎక్కువగా ఉంటోంది. తాజాగా ఈ లిస్టులో వీరసింహారెడ్డి మొదటి స్థానంలో ఉంది. ఆ మధ్య కర్నూలు జిల్లాలో టైటిల్ సాంగ్ చిత్రీకరించినప్పుడు దాని తాలూకు చిన్న వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది. టీమ్ అలెర్ట్ అయిపోయి డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం నడిపింది కానీ అప్పటికీ దాని రీచ్ ఎక్కడికో వెళ్ళింది.

తాజాగా అనంతపురం జిల్లా పెనుగొండలో జరుగుతున్న చిత్రీకరణ సైతం దీని బారిన పడక తప్పలేదు. విలన్ దునియా విజయ్ మీద షూట్ చేసిన కొన్ని సీన్లు బయటికి రావడం ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. అందులో ఫ్లాష్ బ్యాక్ గెటప్ లో ప్రతాప్ రెడ్డిగా నటిస్తున్న విజయ్ తాలూకు సన్నివేశాలున్నాయి. తుపాకీలతో జరిపే ఓ పందెంలో పాల్గొనే దృశ్యం కూడా ఉంది. ట్విట్టర్ లో చూస్తే ఇవి ఎక్కువ కన్నడ ఫ్యాన్స్ నుంచి బయటికి వస్తున్నాయి.

షూటింగ్ జరుగుతున్న ప్రాంతం కర్ణాటక బోర్డర్ కు దగ్గర కావడంతో అభిమానులు తండోపతండాలుగా వెళ్ళిపోయి తమ సెల్ ఫోన్ కెమెరాలను పని చెబుతున్నారు. అవుట్ డోర్ అందులోనూ గ్రామీణ ప్రాంతం కావడంతో వీటిని కట్టడి చేయడం యూనిట్ కి కష్టసాధ్యంగా మారింది. దాంతో ఇప్పటికిప్పుడు వీటిని ఎవరూ ఆపలేని పరిస్థితి నెలకొంది.
వీటి సంగతెలా ఉన్నా అఫీషియల్ కాకపోయినా ఇవన్నీ వీరసింహారెడ్డి మీద అంచనాలు పెంచేలానే ఉన్నాయి.

పవర్ ఫుల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలకృష్ణ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో టీజరో ట్రైలరో రిలీజ్ అయితే క్లారిటీ వస్తుంది. సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేర్ వీరయ్యతో పోటీ పడబోతున్న వీరసింహారెడ్డి జనవరి 12 రిలీజ్ లాక్ చేసుకుందని ఇన్ సైడ్ టాక్. అధికారిక ప్రకటన ఇప్పుడే జరగకపోవచ్చు. వీరయ్య డేట్ ని లాక్ చేశాక రెండింటిని ఎప్పుడు రివీల్ చేయాలన్నది డిసైడ్ చేస్తారు. వారసుడు కూడా వెయిటింగ్ లోనే ఉంది.

This post was last modified on November 13, 2022 3:33 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

33 mins ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

34 mins ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

42 mins ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

58 mins ago

ఏపీ ఎలక్షన్స్: చిరంజీవి రాక తప్పేలా లేదు.!

మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ.? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం జనసేన అభ్యర్థి పంచకర్ల…

1 hour ago

ఉండి పై రఘురామ ఉడుం పట్టు.!

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన…

1 hour ago