ఈ మధ్య హాలీవుడ్ సినిమాలకు మన దేశంలోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. మొన్న రిలీజైన బ్లాంక్ పాంథర్ వకాండ ఫరెవర్ కు హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో కటవుట్ పెట్టి, బాణాసంచా కాల్చి, హంగామా చేస్తే ఆ హడావిడిని ఇంగ్లీష్ ఛానల్స్ సైతం కవరేజ్ ఇవ్వడం విశేషం. అంతగా మనకు సూపర్ హీరోస్ ఫీవర్ పాకిపోతోంది. ఇండియాలోనూ సెన్సేషనల్ ఓపెనింగ్ అందుకున్న ఈ నల్ల వజ్రపు విజువల్ వండర్ మొదటి రోజు 18 కోట్ల 70 లక్షల దాకా గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ సమాచారం.
గత కొన్నేళ్లలో కొందరు తలలు పండిన మీడియం రేంజ్ బాలీవుడ్ స్టార్లకు సైతం సాధ్యం కానీ ఫిగర్ ఇది. దీని బట్టి బ్లాంక్ పాంథర్ మీద క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ లో నటించిన చాడ్విక్ బ్రోస్మన్ ఈ సీక్వెల్ తీయడానికి ముందే చనిపోవడంతో వకాండ మీద అభిమానులు ఎమోషనల్ కనెక్షన్ పెంచుకున్నారు. తనకు నివాళిగా టీమ్ ఇందులో చాలా భావోద్వేగాలను జోడించింది.
విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ అద్భుతంగా ఆవిష్కృతమైన ఈ రెండో భాగంలో నిడివి ఎక్కువవ్వడం టాక్ మీద ప్రభావం చూపిస్తోంది. భావోద్వేగాలను బలంగా చూపించే క్రమంలో ల్యాగ్ కి చోటివ్వడంతో బ్రోస్మన్ వీరాభిమానులకు ఓకే అనిపిస్తుంది కానీ కామన్ ఆడియన్స్ కి మాత్రమే కొంత ఇబ్బందే. వకాండ రాజు చనిపోతే అక్కడ దొరికే అరుదైన వైబ్రేనియంని కొల్లగొట్టేందుకు ఇతర దేశాలు ప్లాన్లు వేస్తాయి.
వాళ్ళను ఎదురుకుంటూ తమ దేశ సంపదను కాపాడుకునే క్రమంలో ఎదురయ్యే సంఘటనలు, శత్రువులు సృష్టించే విధ్వంసాలు, కొత్త బ్లాంక్ పాంథర్ గా ఎవరు అవతరించారనే ట్విస్టులు ఇలా ఫ్యాన్స్ కు కావాల్సిన కమర్షియల్ బొనాంజా గట్టిగానే దట్టించారు. కాకపోతే కొంత ఓపిగ్గా చూస్తే నచ్చేస్తుంది. మొన్న శుక్రవారం రిలీజైన కొత్త సినిమాల్లో తెలుగు రాష్ట్రాల్లో దీన్ని తాకిడిని తట్టుకుని నిలబడింది ఒక్క యశోద మాత్రమే. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో రెండు పోటాపోటీగా ఉన్నాయి.
This post was last modified on November 13, 2022 12:26 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…