ఈ మధ్య హాలీవుడ్ సినిమాలకు మన దేశంలోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. మొన్న రిలీజైన బ్లాంక్ పాంథర్ వకాండ ఫరెవర్ కు హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో కటవుట్ పెట్టి, బాణాసంచా కాల్చి, హంగామా చేస్తే ఆ హడావిడిని ఇంగ్లీష్ ఛానల్స్ సైతం కవరేజ్ ఇవ్వడం విశేషం. అంతగా మనకు సూపర్ హీరోస్ ఫీవర్ పాకిపోతోంది. ఇండియాలోనూ సెన్సేషనల్ ఓపెనింగ్ అందుకున్న ఈ నల్ల వజ్రపు విజువల్ వండర్ మొదటి రోజు 18 కోట్ల 70 లక్షల దాకా గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ సమాచారం.
గత కొన్నేళ్లలో కొందరు తలలు పండిన మీడియం రేంజ్ బాలీవుడ్ స్టార్లకు సైతం సాధ్యం కానీ ఫిగర్ ఇది. దీని బట్టి బ్లాంక్ పాంథర్ మీద క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ లో నటించిన చాడ్విక్ బ్రోస్మన్ ఈ సీక్వెల్ తీయడానికి ముందే చనిపోవడంతో వకాండ మీద అభిమానులు ఎమోషనల్ కనెక్షన్ పెంచుకున్నారు. తనకు నివాళిగా టీమ్ ఇందులో చాలా భావోద్వేగాలను జోడించింది.
విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ అద్భుతంగా ఆవిష్కృతమైన ఈ రెండో భాగంలో నిడివి ఎక్కువవ్వడం టాక్ మీద ప్రభావం చూపిస్తోంది. భావోద్వేగాలను బలంగా చూపించే క్రమంలో ల్యాగ్ కి చోటివ్వడంతో బ్రోస్మన్ వీరాభిమానులకు ఓకే అనిపిస్తుంది కానీ కామన్ ఆడియన్స్ కి మాత్రమే కొంత ఇబ్బందే. వకాండ రాజు చనిపోతే అక్కడ దొరికే అరుదైన వైబ్రేనియంని కొల్లగొట్టేందుకు ఇతర దేశాలు ప్లాన్లు వేస్తాయి.
వాళ్ళను ఎదురుకుంటూ తమ దేశ సంపదను కాపాడుకునే క్రమంలో ఎదురయ్యే సంఘటనలు, శత్రువులు సృష్టించే విధ్వంసాలు, కొత్త బ్లాంక్ పాంథర్ గా ఎవరు అవతరించారనే ట్విస్టులు ఇలా ఫ్యాన్స్ కు కావాల్సిన కమర్షియల్ బొనాంజా గట్టిగానే దట్టించారు. కాకపోతే కొంత ఓపిగ్గా చూస్తే నచ్చేస్తుంది. మొన్న శుక్రవారం రిలీజైన కొత్త సినిమాల్లో తెలుగు రాష్ట్రాల్లో దీన్ని తాకిడిని తట్టుకుని నిలబడింది ఒక్క యశోద మాత్రమే. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో రెండు పోటాపోటీగా ఉన్నాయి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…