పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగ పున:ప్రవేశం ఖరారవ్వగానే.. స్వల్ప వ్యవధిలో మూడు సినిమాలు అంగీకరించాడు. అందులో ముందుగా ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ను మొదలుపెట్టాడు. ఇది చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దీని తర్వాత క్రిష్ సినిమాను కూడా మొదలుపెట్టి కొంత మేర షూటింగ్ చేశాడు. ఈ రెండూ పూర్తి చేసి హరీష్ శంకర్-మైత్రీ మూవీ మేకర్స్ సినిమా మొదలుపెట్టాలన్నది ప్రణాళిక.
అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికే ‘వకీల్ సాబ్’ విడుదలయ్యేది. క్రిష్ సినిమా కూడా పూర్తి కావచ్చేది. ఈ ఏడాది చివర్లో హరీష్ శంకర్ సినిమా కూడా మొదలయ్యేది. కానీ కరోనా వచ్చి అన్ని ప్రణాళికల్ని చెడగొట్టేసింది.
ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలను పవన్ పూర్తి చేసి ఖాళీ అవ్వడానికి అటు ఇటుగా ఏడాది సమయం పట్టొచ్చేమో. అప్పటిదాకా హరీష్ శంకర్ ఖాళీగా ఉండాల్సిందే. ఇప్పటికే పవన్ సినిమాకు స్క్రిప్టు పూర్తి చేసేసిన హరీష్.. ఈ ఖాళీలో వేరే సినిమా చేస్తాడేమో అన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఐతే ఈ ప్రచారానికి హరీష్ ఓ ఇంటర్వ్యూలో తెరదించాడు.
పవన్ సినిమా ముందు మరే చిత్రం చేసే అవకాశం లేదన్నాడు. తాను తన శ్రద్ధాసక్తులన్నింటినీ పవన్ సినిమా మీదే కేంద్రీకరించానని.. దాన్నుంచి పక్కకు వెళ్లాలనుకోవట్లేదని అతను స్పష్టం చేశాడు. పవన్ సినిమాకు స్క్రిప్టు పూర్తయిందన్న హరీష్.. ఇది ‘గబ్బర్ సింగ్’ లాగే అభిమానుల్ని ఉర్రూతలూగించేలా ఉంటుందని చెప్పాడు. పవన్ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తానని.. ఈ సినిమాను వాళ్లు మళ్లీ మళ్లీ చూస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…