పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగ పున:ప్రవేశం ఖరారవ్వగానే.. స్వల్ప వ్యవధిలో మూడు సినిమాలు అంగీకరించాడు. అందులో ముందుగా ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ను మొదలుపెట్టాడు. ఇది చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దీని తర్వాత క్రిష్ సినిమాను కూడా మొదలుపెట్టి కొంత మేర షూటింగ్ చేశాడు. ఈ రెండూ పూర్తి చేసి హరీష్ శంకర్-మైత్రీ మూవీ మేకర్స్ సినిమా మొదలుపెట్టాలన్నది ప్రణాళిక.
అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికే ‘వకీల్ సాబ్’ విడుదలయ్యేది. క్రిష్ సినిమా కూడా పూర్తి కావచ్చేది. ఈ ఏడాది చివర్లో హరీష్ శంకర్ సినిమా కూడా మొదలయ్యేది. కానీ కరోనా వచ్చి అన్ని ప్రణాళికల్ని చెడగొట్టేసింది.
ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలను పవన్ పూర్తి చేసి ఖాళీ అవ్వడానికి అటు ఇటుగా ఏడాది సమయం పట్టొచ్చేమో. అప్పటిదాకా హరీష్ శంకర్ ఖాళీగా ఉండాల్సిందే. ఇప్పటికే పవన్ సినిమాకు స్క్రిప్టు పూర్తి చేసేసిన హరీష్.. ఈ ఖాళీలో వేరే సినిమా చేస్తాడేమో అన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఐతే ఈ ప్రచారానికి హరీష్ ఓ ఇంటర్వ్యూలో తెరదించాడు.
పవన్ సినిమా ముందు మరే చిత్రం చేసే అవకాశం లేదన్నాడు. తాను తన శ్రద్ధాసక్తులన్నింటినీ పవన్ సినిమా మీదే కేంద్రీకరించానని.. దాన్నుంచి పక్కకు వెళ్లాలనుకోవట్లేదని అతను స్పష్టం చేశాడు. పవన్ సినిమాకు స్క్రిప్టు పూర్తయిందన్న హరీష్.. ఇది ‘గబ్బర్ సింగ్’ లాగే అభిమానుల్ని ఉర్రూతలూగించేలా ఉంటుందని చెప్పాడు. పవన్ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తానని.. ఈ సినిమాను వాళ్లు మళ్లీ మళ్లీ చూస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…