పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగ పున:ప్రవేశం ఖరారవ్వగానే.. స్వల్ప వ్యవధిలో మూడు సినిమాలు అంగీకరించాడు. అందులో ముందుగా ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ను మొదలుపెట్టాడు. ఇది చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దీని తర్వాత క్రిష్ సినిమాను కూడా మొదలుపెట్టి కొంత మేర షూటింగ్ చేశాడు. ఈ రెండూ పూర్తి చేసి హరీష్ శంకర్-మైత్రీ మూవీ మేకర్స్ సినిమా మొదలుపెట్టాలన్నది ప్రణాళిక.
అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికే ‘వకీల్ సాబ్’ విడుదలయ్యేది. క్రిష్ సినిమా కూడా పూర్తి కావచ్చేది. ఈ ఏడాది చివర్లో హరీష్ శంకర్ సినిమా కూడా మొదలయ్యేది. కానీ కరోనా వచ్చి అన్ని ప్రణాళికల్ని చెడగొట్టేసింది.
ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలను పవన్ పూర్తి చేసి ఖాళీ అవ్వడానికి అటు ఇటుగా ఏడాది సమయం పట్టొచ్చేమో. అప్పటిదాకా హరీష్ శంకర్ ఖాళీగా ఉండాల్సిందే. ఇప్పటికే పవన్ సినిమాకు స్క్రిప్టు పూర్తి చేసేసిన హరీష్.. ఈ ఖాళీలో వేరే సినిమా చేస్తాడేమో అన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఐతే ఈ ప్రచారానికి హరీష్ ఓ ఇంటర్వ్యూలో తెరదించాడు.
పవన్ సినిమా ముందు మరే చిత్రం చేసే అవకాశం లేదన్నాడు. తాను తన శ్రద్ధాసక్తులన్నింటినీ పవన్ సినిమా మీదే కేంద్రీకరించానని.. దాన్నుంచి పక్కకు వెళ్లాలనుకోవట్లేదని అతను స్పష్టం చేశాడు. పవన్ సినిమాకు స్క్రిప్టు పూర్తయిందన్న హరీష్.. ఇది ‘గబ్బర్ సింగ్’ లాగే అభిమానుల్ని ఉర్రూతలూగించేలా ఉంటుందని చెప్పాడు. పవన్ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తానని.. ఈ సినిమాను వాళ్లు మళ్లీ మళ్లీ చూస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…