పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగ పున:ప్రవేశం ఖరారవ్వగానే.. స్వల్ప వ్యవధిలో మూడు సినిమాలు అంగీకరించాడు. అందులో ముందుగా ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ను మొదలుపెట్టాడు. ఇది చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దీని తర్వాత క్రిష్ సినిమాను కూడా మొదలుపెట్టి కొంత మేర షూటింగ్ చేశాడు. ఈ రెండూ పూర్తి చేసి హరీష్ శంకర్-మైత్రీ మూవీ మేకర్స్ సినిమా మొదలుపెట్టాలన్నది ప్రణాళిక.
అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికే ‘వకీల్ సాబ్’ విడుదలయ్యేది. క్రిష్ సినిమా కూడా పూర్తి కావచ్చేది. ఈ ఏడాది చివర్లో హరీష్ శంకర్ సినిమా కూడా మొదలయ్యేది. కానీ కరోనా వచ్చి అన్ని ప్రణాళికల్ని చెడగొట్టేసింది.
ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలను పవన్ పూర్తి చేసి ఖాళీ అవ్వడానికి అటు ఇటుగా ఏడాది సమయం పట్టొచ్చేమో. అప్పటిదాకా హరీష్ శంకర్ ఖాళీగా ఉండాల్సిందే. ఇప్పటికే పవన్ సినిమాకు స్క్రిప్టు పూర్తి చేసేసిన హరీష్.. ఈ ఖాళీలో వేరే సినిమా చేస్తాడేమో అన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఐతే ఈ ప్రచారానికి హరీష్ ఓ ఇంటర్వ్యూలో తెరదించాడు.
పవన్ సినిమా ముందు మరే చిత్రం చేసే అవకాశం లేదన్నాడు. తాను తన శ్రద్ధాసక్తులన్నింటినీ పవన్ సినిమా మీదే కేంద్రీకరించానని.. దాన్నుంచి పక్కకు వెళ్లాలనుకోవట్లేదని అతను స్పష్టం చేశాడు. పవన్ సినిమాకు స్క్రిప్టు పూర్తయిందన్న హరీష్.. ఇది ‘గబ్బర్ సింగ్’ లాగే అభిమానుల్ని ఉర్రూతలూగించేలా ఉంటుందని చెప్పాడు. పవన్ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తానని.. ఈ సినిమాను వాళ్లు మళ్లీ మళ్లీ చూస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on July 13, 2020 6:03 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…