దక్షిణాది స్టార్ హీరోల్లో కమల్ హాసన్ తర్వాత అన్ని ప్రయోగాత్మక పాత్రలు చేసిన హీరో సూర్యనే కావచ్చు. అప్పుడప్పుడూ సింగం లాంటి రెగ్యులర్ మాస్ సినిమాలు కూడా చేస్తుంటాడు కానీ.. వాటిని పక్కన పెడితే సూర్య మిగతా సినిమాలన్నీ భిన్నంగానే ఉంటాయి.
ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉంటాడతను. ఈ వైవిధ్యమే సౌత్ ఇండియా అంతటా అతడికి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. గత కొన్నేళ్లలో సరైన విజయాలు లేక సూర్య కొంచెం వెనుకబడ్డాడు కానీ.. ఇప్పటికీ అతడి ఫాలోయింగ్ ఏమీ తగ్గలేదు. త్వరలోనే సూరారై పొట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా)తో పలకరించబోతున్నాడు సూర్య.
దీని తర్వాత సూర్య హీరోగా తెరకెక్కే కొత్త చిత్రాల గురించి రకరకాల వార్తలొస్తున్నాయి. ఐతే వాటి సంగతేమో కానీ.. సూర్య త్వరలోనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నది తాజా హాట్ న్యూస్. బాలీవుడ్లో సైఫ్ అలీ ఖాన్, అభిషేక్ బచ్చన్ లాంటి పెద్ద హీరోలు వెబ్ సిరీస్లు చేశారు కానీ.. దక్షిణాది హీరోలు మాత్రం వాటి పట్ల అంతగా ఆసక్తి చూపించట్లేదు. వెబ్ సిరీస్లను తక్కువగా చూస్తున్నారేమో అనిపిస్తోంది. ఐతే భవిష్యత్తు డిజిటల్ మీడియాదే అని అర్థం చేసుకున్న సూర్య.. అందులోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయాడట.
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నిర్మించబోయే నవరస అనే సిరీస్లో సూర్య నటించనున్నాడట. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ సిరీస్ను నటులు సిద్దార్థ్, అరవింద్ స్వామి డైరెక్ట్ చేయనున్నారట. వారు ఈ సిరీస్తోనే దర్శకులుగా పరిచయం కానున్నారట. ఈ కాంబినేషన్ సౌత్ ఇండియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on July 14, 2020 10:21 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…