కొన్నేళ్ల నుంచి నవంబరు నెల టాలీవుడ్కు శాపంలా మారుతోంది. ఆ నెలలో సినిమాలేవీ పెద్దగా ఆడట్లేదు. అలా అని ఈ నెలలో సరైన సినిమాలు రిలీజ్ కావట్లేదా.. వాటికి మంచి టాక్ రావట్లేదా.. అంటే అదేమీ లేదు. కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి. మంచి టాక్ కూడా తెచ్చుకుంటున్నాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర అవి సందడి చేయలేకపోతున్నాయి. ఈ నవంబరు సంగతే తీసుకుంటే.. తొలి వారం ‘ఊర్వశివో రాక్షసివో’ లాంటి యూత్ను ఆకట్టుకునే సినిమా వచ్చింది.
ఈ సినిమా డీసెంట్ బజ్తో రిలీజైంది. పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మౌత్ పబ్లిసిటీ కూడా బాగానే ఉంది. కానీ టాక్కు తగ్గట్లుగా సినిమా వసూళ్లు రాబట్టలేకపోయింది. చివరికి బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ రిజల్ట్తో సరిపెట్టుకుంది. వీకెండ్ తర్వాత ‘ఊర్వశివో రాక్షసివో’ పెద్దగా సౌండే చేయలేదు. ఈ పరిణామం చూసి టాలీవుడ్ కొంచెం కంగారు పడే ఉంటుంది.
ఇక ఈ వారం ‘యశోద’ సినిమాతో సమంత బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమైంది. ఈ వారం తెలుగులో ఇది కాకుండా చెప్పుకోదగ్గ రిలీజ్లేమీ లేవు. హాలీవుడ్ మూవీ ‘బ్లాక్ పాంతర్’ కొత్త వెర్షన్ నుంచి మాత్రమే దీనికి క్లాష్ ఉంది. పెద్దగా పోటీ లేకుండా, మంచి బజ్తో రిలీజవుతున్న సమంత సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ చేస్తుందన్నది ఆసక్తికరం. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు వస్తాయా.. ప్రేక్షకులను థియేటర్లకు ఆశించిన స్థాయిలో ఈ సినిమా రప్పించగలదా అని ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
దాదాపు రూ.24 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ కీలకం. మరి సమంత బాక్సాఫీస్ స్టామినా ఎంత వరకు ఈ సినిమాకు ఉపయోగపడి ఓపెనింగ్స్ రప్పిస్తుందో చూడాలి. హరి-హరీష్ అనే ఇద్దరు తమిళ దర్శకులు కలిసి ఈ బహు భాషా చిత్రాన్ని రూపొందించారు. మరి తమిళం, హిందీ భాషల్లో సామ్ సినిమా ఏమాత్రం ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరం. సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ‘యశోద’ చిత్రాన్ని రూపొందించారు.
This post was last modified on November 11, 2022 1:47 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…