సీనియర్ హీరో అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మరీ యంగ్ హీరో విశ్వక్సేన్ గురించి ప్రొఫెషనలిజం లేని నటుడంటూ కామెంట్ చేశాడు. అయితే మన ఫలక్నామాదాస్ మాత్రం.. కథలో చేంజెస్ అడిగితే రియాక్ట్ అవ్వలేదని, అందుకే ఇబ్బందిగా అనిపించి పక్కకు తప్పుకున్నానని సెలవిచ్చాడు. ఏదేమైనా కూడా, విశ్వక్ అసలు డైరక్టర్ అండ్ రైటర్ పనుల్లో వేలుపెట్టేస్తున్నాడంటూ ఇప్పుడు టాలీవుడ్ అంతా ఒక హాట్ టాపిక్గా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఇది మనోడికి ప్లస్సా మైనస్సా అంటే మాత్రం.. రెండూ అనే చెప్పాలి.
వాస్తవానికి యాక్టర్ అవ్వడానికి ముందే విశ్వక్ ఎడిటర్గా కూడా పనిచేశాడు. కాబట్టి నేచురల్గా సినిమా రాస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు అతగాడి ఇన్పుట్స్ కాస్త ఎక్కువగానే ఉండే ఛాన్సుంటుంది. అలాగే తనే సొంతంగా ఇప్పటికి రెండు సినిమాలు (ఫలక్నామాదాస్, ధమ్కీ) డైరక్ట్ చేశాడు కాబట్టి, ఆ యాంగిల్లో కూడా ఖచ్చితంగా తననుండి దర్శకుడికి ఎంతోకొంత ప్రెజర్ ఉండకపోదు. కాకపోతే ఇలా చెయ్యడం కారణంగా.. సినిమాలో వేలు పెట్టేస్తాడని చాలామంది దర్శకులు ఫ్యూచర్లో మనోడి దగ్గరకు రాకపోవచ్చు. అది మైనస్. కాని ఇతగాడి చేతిలో సినిమాలు పెడితే, డైరక్టర్ నుండి ప్రతీ యొక్కరి జాబ్ వరకు తనే కేర్ తీసుకుంటాడని ప్రొడ్యూసర్లు అనుకునే ఛాన్సుంది. అది ప్లస్.
ఒక విధంగా చెప్పాలంటే.. ఎవరో పెద్ద హీరో కథ చెప్పాడనో పెద్ద ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇచ్చాడనో సినిమాలు సైన్ చెయ్యకుండా.. ముందుగానే బౌండ్ స్క్రిప్ట్ అడిగి… అది నచ్చాక.. విశ్వక్సేన్ సినిమాలను సైన్ చేస్తే బెటర్. ఇది అర్జున్ సినిమా కాబట్టి సరిపోయింది.. అదే ఎవరన్నా పెద్ద డైరక్టర్ సినిమానో, పెద్ద బ్యానర్ తీసే సినిమానో అయితే ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిపోయేదే!
This post was last modified on November 8, 2022 9:00 am
మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…
టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…
వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భాగంగా ఇటీవల కాలంలో `రప్పా-రప్పా` డైలాగులు తరచుగా వినిపించేవి. రప్పా-రప్పా అని రాసున్న బ్యానర్లు,…
వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…
పురాణ గాథలను తెరకెక్కించేటపుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విషయం…
వైసీపీ అధినేత జగన్ తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను ఆయన పరామర్శించారు. తొలుత…