ఒక్క ‘మాష్టర్’ ఫేం అర్జున్ దాస్ తప్పిస్తే.. మనకు ఏమాత్రం తెలియన ఒక కొత్త కాస్ట్తో ఇప్పుడు సితార ఎంటర్టయిన్మెంట్ సంస్థ ‘బుట్టబొమ్మ’ అనే సినిమాతో విచ్చేస్తోంది. ఈరోజు తమ డార్లింగ్ డైరక్టర్ త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా, ఈ సంస్థ సదరు సినిమా టీజర్ను విడుదల చేసిందిలే. ఇకపోతే మలయాళం సినిమాలను అదే పనిగా చూసేవాళ్ళకు, ఈ సినిమా ‘కప్పేలా’ అనే మల్లూ మూవి రీమేక్ అని ఇట్టే అర్ధమవుతోంది. ఇద్దరు డైరక్టర్లు కలసి రూపొందించిన ఈ రీమేక్లో మరి భీమ్లానాయక్ను మార్చేసినట్లు ఏమన్నా చేంజెస్ చేశారా లేకుంటే యాజిటీజ్ దించేశారా అనేదే ఇప్పుడు ఆడియన్స్ గమనిస్తున్న అంశం.
భీమ్లానాయక్ సినిమాను మాత్రం యాజిటీజ్ దించేయకుండా చాలా జాగ్రత్తగా రీమేక్ చేసేశారు సితార వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్నాడనో, లేదంటే సినిమాను త్రివిక్రమ్ రాస్తున్నాడనో కాని, ఒరిజినల్లో లేని హీరోయిజంను జోడించి, సీన్లలో పదును పెంచి, అయ్యప్పానుం కోషియానుం సినిమా రూపురేఖలు మార్చేశారు. అయితే ఇప్పుడు మాత్రం బుట్టబొమ్మ టీజర్ చూస్తుంటే.. కొత్త కాస్టింగ్ మరియు ఒక అందమైన హీరోయిన్ను (అనికా సురేంద్రన్) తేవడం మినహాయిస్తే.. డైలాగులూ, షాట్లు, బ్లాకులూ, చివరకు ట్రైలర్ కట్ కూడా మలయాళం సినిమా ఎలా ఉందో అలాగే దించారు. అరకులోయను అందంగా చూపించడం తప్పించి.. మిగతా అంతా సేమ్ టు సేమ్ అన్నట్లే ఉంది. అందుకే ఇప్పుడు బుట్టబొమ్మ, కప్పేలా ట్రైలర్లను కలిపి చూస్తున్న ఆడియన్స్ అవాక్కవుతున్నారు.
ఈ మధ్యకాలంలో చాలా రీమేక్ సినిమాలు కిక్కివ్వట్లేదు. తెలుగు సినిమాలు హిందీలో ఆడట్లేదు, తమిళ మలయాళ సినిమాలు ఇక్కడ ఆడట్లేదు. కారణం ఏంటంటే.. మనోళ్ళు భారీగా మార్పులూ చేర్పులూ చేయకుండా మాతృకలో ఉన్నవి యాజిటీజ్ దించేయడం వలనే. ఈ తరుణంలో సితార వంటి సంస్థ మరో రీమేక్తో వస్తోందంటే.. జనాలకు ఎక్సపెక్టేషన్లు కాస్త ఎక్కువగానే ఉంటాయ్. అందుకే ఇప్పుడు బుట్టబొమ్మ గురించి అంతలా చర్చిస్తున్నారు.
This post was last modified on November 7, 2022 4:02 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…