మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలొచ్చారు. అందులో చాలామంది నిలదొక్కుకున్నారు. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తిరుగులేని ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించారు. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా పర్వాలేదు. వైష్ణవ్ తేజ్కు గ్రాండ్ ఎంట్రీ దక్కింది. ఆ తర్వాత కొంచెం తడబడుతున్నప్పటికీ.. మళ్లీ పుంజుకోగలడనే అంచనాలు ఉన్నాయి. కానీ అరంగేట్రం చేసి చాలా ఏళ్లయినా హీరోగా సరైన ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్న మెగా హీరో అంటే అల్లు శిరీష్ అనే చెప్పాలి.
‘గౌరవం’ లాంటి డిజాస్టర్తో హీరోగా పరిచయం కావడం అతడికి పెద్ద మైనస్. రెండో సినిమా ‘కొత్త జంట’ కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ‘శ్రీరస్తు శుభమస్తు’ ఒకటి అతడికి మంచి ఫలితాన్నిచ్చింది. కానీ ఆ విజయాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఒక్క క్షణం, ఏబీసీడీ సినిమాలు అతణ్ని మళ్లీ కిందికి లాగేశాయి. ఆ తర్వాత మూడేళ్ల పాటు శిరీష్ సినిమా ఏదీ రిలీజ్ కాకపోవడంతో అతణ్ని అందరూ మరిచిపోయారు.
శిరీష్ మీద మొదట్నుంచి ఎందుకో ఒక నెగెటివిటీ ఉండిపోయింది. టాలెంట్ లేకపోయినా బలవంతంగా రుద్దుతున్నారనో.. అతడికి యాటిట్యూడ్ అనో జనాలు అతణ్ని కొంచెం నెగెటివ్ కోణంలో చూశారు కెరీర్ ఆరంభంలో. కొన్నిసార్లు వ్యక్తిగతంగా హీరో మీద ఉన్న అభిప్రాయం కూడా సినిమాల మీద ప్రభావం చూపుతుంటుంది. శిరీష్ విషయంలో కూడా అదే జరిగింది. ‘శ్రీరస్తు శుభమస్తు’ మంచి సినిమా కావడం వల్ల ఆడింది. అంతే తప్ప శిరీష్ దానికి ప్లస్ కాలేదన్నది స్పష్టం.
ఐతే గత సినిమాల సంగతి పక్కన పెడితే ‘ఊర్వశివో రాక్షసివో’లో మాత్రం ప్రేక్షకులకు కొత్త శిరీష్ కనిపించాడు. ఈ సినిమా ప్రమోషన్ల టైంలో కూడా శిరీష్ కొత్తగా కనిపించాడు. వయసుతో పాటు వచ్చిన మెచ్యూరిటీ వల్ల కావచ్చు అతడి మాటతీరు మారింది. ఇంతకుముందున్న నెగెటివిటీ పోయింది. సినిమాలో కూడా పాత్రను అర్థం చేసుకుని చక్కగా నటించాడు. ఎక్కడా అతి చేయలేదు. నటన విషయంలో ఇబ్బంది పడలేదు. అమాయకమైన కుర్రాడిగా ఒదిగిపోయాడు. ఆ పాత్రు చెడగొట్టకపోవడమే పెద్ద ప్లస్. శిరీష్ మీద నెగెటివ్ ఫీలింగ్ ఉన్న వాళ్లు కూడా ఈ సినిమా చూశాక తన మీద అభిప్రాయం మార్చుకుంటారనడంలో సందేహం లేదు. సినిమా మంచి టాక్, వసూళ్లతో సాగిపోతుండడంతో శిరీష్ కెరీర్ ఊపందుకునేలాగే కనిపిస్తోంది.
This post was last modified on November 7, 2022 10:32 am
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…