మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలొచ్చారు. అందులో చాలామంది నిలదొక్కుకున్నారు. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తిరుగులేని ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించారు. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా పర్వాలేదు. వైష్ణవ్ తేజ్కు గ్రాండ్ ఎంట్రీ దక్కింది. ఆ తర్వాత కొంచెం తడబడుతున్నప్పటికీ.. మళ్లీ పుంజుకోగలడనే అంచనాలు ఉన్నాయి. కానీ అరంగేట్రం చేసి చాలా ఏళ్లయినా హీరోగా సరైన ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్న మెగా హీరో అంటే అల్లు శిరీష్ అనే చెప్పాలి.
‘గౌరవం’ లాంటి డిజాస్టర్తో హీరోగా పరిచయం కావడం అతడికి పెద్ద మైనస్. రెండో సినిమా ‘కొత్త జంట’ కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ‘శ్రీరస్తు శుభమస్తు’ ఒకటి అతడికి మంచి ఫలితాన్నిచ్చింది. కానీ ఆ విజయాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఒక్క క్షణం, ఏబీసీడీ సినిమాలు అతణ్ని మళ్లీ కిందికి లాగేశాయి. ఆ తర్వాత మూడేళ్ల పాటు శిరీష్ సినిమా ఏదీ రిలీజ్ కాకపోవడంతో అతణ్ని అందరూ మరిచిపోయారు.
శిరీష్ మీద మొదట్నుంచి ఎందుకో ఒక నెగెటివిటీ ఉండిపోయింది. టాలెంట్ లేకపోయినా బలవంతంగా రుద్దుతున్నారనో.. అతడికి యాటిట్యూడ్ అనో జనాలు అతణ్ని కొంచెం నెగెటివ్ కోణంలో చూశారు కెరీర్ ఆరంభంలో. కొన్నిసార్లు వ్యక్తిగతంగా హీరో మీద ఉన్న అభిప్రాయం కూడా సినిమాల మీద ప్రభావం చూపుతుంటుంది. శిరీష్ విషయంలో కూడా అదే జరిగింది. ‘శ్రీరస్తు శుభమస్తు’ మంచి సినిమా కావడం వల్ల ఆడింది. అంతే తప్ప శిరీష్ దానికి ప్లస్ కాలేదన్నది స్పష్టం.
ఐతే గత సినిమాల సంగతి పక్కన పెడితే ‘ఊర్వశివో రాక్షసివో’లో మాత్రం ప్రేక్షకులకు కొత్త శిరీష్ కనిపించాడు. ఈ సినిమా ప్రమోషన్ల టైంలో కూడా శిరీష్ కొత్తగా కనిపించాడు. వయసుతో పాటు వచ్చిన మెచ్యూరిటీ వల్ల కావచ్చు అతడి మాటతీరు మారింది. ఇంతకుముందున్న నెగెటివిటీ పోయింది. సినిమాలో కూడా పాత్రను అర్థం చేసుకుని చక్కగా నటించాడు. ఎక్కడా అతి చేయలేదు. నటన విషయంలో ఇబ్బంది పడలేదు. అమాయకమైన కుర్రాడిగా ఒదిగిపోయాడు. ఆ పాత్రు చెడగొట్టకపోవడమే పెద్ద ప్లస్. శిరీష్ మీద నెగెటివ్ ఫీలింగ్ ఉన్న వాళ్లు కూడా ఈ సినిమా చూశాక తన మీద అభిప్రాయం మార్చుకుంటారనడంలో సందేహం లేదు. సినిమా మంచి టాక్, వసూళ్లతో సాగిపోతుండడంతో శిరీష్ కెరీర్ ఊపందుకునేలాగే కనిపిస్తోంది.
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…