విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ సార్జా దర్శకత్వంలో మొన్నీ మధ్యే ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అర్జున్ ఈ సినిమాతో తన కూతురు ఐశ్వర్య ను హీరోయిన్ గా లాంచ్ చేయాలనుకున్నారు. హీరో విశ్వక్ లేకుండా కొన్ని రోజులు షూటింగ్ జరిగిన ఈ సినిమా ఇప్పుడు అనుకోకుండా క్యాన్సెల్ అయిపోయింది. స్వయంగా అర్జున్ మీడియా ముందుకొచ్చి విశ్వక్ సేన్ ప్రవర్తన నచ్చలేదని , ఎప్పటికప్పుడు షూటింగ్ పోస్ట్ పోన్ చేయమంటూ చెప్తూ ఫైనల్ గా తనని తన టీం అందరినీ అవమానించాడని తన వర్షన్ బయట పెట్టి త్వరలోనే మరో హీరోతో సినిమా చేస్తానని తెలిపాడు.
విశ్వక్ కి కథ బాగా నచ్చిందని , కానీ కొందరు టాప్ టెక్నీషియన్స్ వర్క్ ఆయనకి సాటిస్ఫ్యాక్షన్ ఇవ్వలేదని చెప్పాడు అర్జున్. ఈ సినిమాకు డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా , ఆయన డైలాగ్స్ విశ్వక్ సేన్ కి నచ్చలేదని, అలాగే చంద్ర బోస్ లిరిక్స్ ఇష్టపడటంలేదని , ఇక అనూప్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం కూడా ఇష్టం లేదని ఈ రీజన్స్ వల్లే తను నన్ను టీం ను ఇబ్బంది పెట్టి షూటింగ్ కి రాకుండా స్కిప్ కొడుతున్నాడని అర్జున్ చెప్పుకున్నాడు.
నిజానికి విశ్వక్ సేన్ స్క్రిప్ట్ లో వేలు పెడతాడని, షూటింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాడని ముందు నుండి ఓ టాక్ ఉంది. దాస్ కా దమ్కీ సినిమాకు ముందుగా వేరే దర్శకుడిని పెట్టి తర్వాత విశ్వక్ అతన్ని ప్రాజెక్ట్ నుండి తప్పించి డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే రైటర్ ప్రసన్న దగ్గర కథ తీసుకొని తనకి తోచిన మార్పులు చేసుకున్నాడనే వార్త కూడా మార్కెట్ లో వినిపిస్తుంది. అందుకే రైటర్ ప్రసన్న కూడా ఈ ప్రాజెక్ట్ కి దూరంగా ఉంటున్నాడని టాక్ ఉంది. అయితే ఇప్పుడు టెక్నీషియన్స్ విషయంలో విశ్వక్ సేన్ ఇవాల్వ్ అవుతాడని అర్జున్ మాటలు వింటుంటే క్లియర్ గా అర్థమవుతుంది. మరి తనపై ప్రెస్ మీట్ పెట్టి అర్జున్ చెప్పిన ఈ విషయాలకు విశ్వక్ సేన్ ఎలా క్లారిటీ ఇస్తాడో .. టెక్నీషియన్స్ గురించి తన వర్షన్ ఏం వినిపిస్తాడో తెలియాలి.
This post was last modified on November 6, 2022 8:17 am
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…