రెండు సినిమాలు దర్శకత్వం వహించిన అనంతరం ఊహించని విధంగా మరణించిన డైరెక్టర్ శోభన్ కొడుకు సంతోష్ శోభన్ ‘తను నేను’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బిజీ యాక్టర్ అనిపించుకున్నాడు. అయితే సంతోష్ శోభన్ కి టాలెంట్ ఉంది. నటనలో మంచి ఈజ్ తో ముందుకు వెళ్తున్నాడు. బడా సంస్థలు , మంచి దర్శకుల నుండి ఆఫర్లు రానే వస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సపోర్ట్ కూడా ఉండనే ఉంది. కానీ కుర్ర హీరోకి మాత్రం సరైన హిట్ పడట్లేదు. కెరీర్ మొదలు పెట్టి ఏడేళ్ళవుతుంది ఇంత వరకూ సంతోష్ కి థియేటర్స్ లో హిట్ అనిపించుకున్న ఒక్క సినిమా లేదు.
డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన ‘ఏక్ మినీ కథ’ సంతోష్ కి మంచి గుర్తింపు తెచ్చింది. ఓటీటీ ఆడియన్స్ ను ఆ సినిమా అలరించింది. దీంతో సంతోష్ ఓటీటీ లో సక్సెస్ అయ్యాడు. కానీ థియేటర్స్ లో రిలీజైన ‘పేపర్ బాయ్’ , ‘మంచి రోజులొచ్చాయి’ మాత్రం ఫ్లాప్ అనిపించుకున్నాయి. తాజాగా లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ అనే సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కుర్ర హీరోకి మరో ఫ్లాప్ ఎదురైంది. సినిమా పాయింట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేనందున ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరిస్తున్నారు. పైగా కామెడీ సిల్లీగా ఉందనే టాక్ అందుకుంది.
తన టాలెంట్ తో మంచి అవకాశాలు అందుకుంటున్నా సంతోష్ కి ఎందుకో లక్ చేతికి చిక్కడం లేదు. నెక్స్ట్ నందిని రెడ్డి దర్శకత్వంలో ‘అన్ని మంచి శకునములే’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రేమ్ కుమార్ అనే సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. రాబోయే ఈ సినిమాలయినా థియేటర్స్ లో విజయం అందుకొని సంతోష్ ని హీరోగా నిలబెడతాయేమో చూడాలి.
This post was last modified on November 6, 2022 12:44 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…