రెండు సినిమాలు దర్శకత్వం వహించిన అనంతరం ఊహించని విధంగా మరణించిన డైరెక్టర్ శోభన్ కొడుకు సంతోష్ శోభన్ ‘తను నేను’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బిజీ యాక్టర్ అనిపించుకున్నాడు. అయితే సంతోష్ శోభన్ కి టాలెంట్ ఉంది. నటనలో మంచి ఈజ్ తో ముందుకు వెళ్తున్నాడు. బడా సంస్థలు , మంచి దర్శకుల నుండి ఆఫర్లు రానే వస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సపోర్ట్ కూడా ఉండనే ఉంది. కానీ కుర్ర హీరోకి మాత్రం సరైన హిట్ పడట్లేదు. కెరీర్ మొదలు పెట్టి ఏడేళ్ళవుతుంది ఇంత వరకూ సంతోష్ కి థియేటర్స్ లో హిట్ అనిపించుకున్న ఒక్క సినిమా లేదు.
డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన ‘ఏక్ మినీ కథ’ సంతోష్ కి మంచి గుర్తింపు తెచ్చింది. ఓటీటీ ఆడియన్స్ ను ఆ సినిమా అలరించింది. దీంతో సంతోష్ ఓటీటీ లో సక్సెస్ అయ్యాడు. కానీ థియేటర్స్ లో రిలీజైన ‘పేపర్ బాయ్’ , ‘మంచి రోజులొచ్చాయి’ మాత్రం ఫ్లాప్ అనిపించుకున్నాయి. తాజాగా లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ అనే సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కుర్ర హీరోకి మరో ఫ్లాప్ ఎదురైంది. సినిమా పాయింట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేనందున ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరిస్తున్నారు. పైగా కామెడీ సిల్లీగా ఉందనే టాక్ అందుకుంది.
తన టాలెంట్ తో మంచి అవకాశాలు అందుకుంటున్నా సంతోష్ కి ఎందుకో లక్ చేతికి చిక్కడం లేదు. నెక్స్ట్ నందిని రెడ్డి దర్శకత్వంలో ‘అన్ని మంచి శకునములే’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రేమ్ కుమార్ అనే సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. రాబోయే ఈ సినిమాలయినా థియేటర్స్ లో విజయం అందుకొని సంతోష్ ని హీరోగా నిలబెడతాయేమో చూడాలి.
This post was last modified on November 6, 2022 12:44 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…