ఆ మధ్య ఎంతో అట్టహాసంగా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా విశ్వక్ సేన్ హీరోగా లాంచ్ చేసిన సినిమా తాలూకు ప్రారంభోత్సవం ఇంకా జనాలు పూర్తిగా మర్చిపోలేదు. జగపతిబాబుతో పాటు ఎందరో సీనియర్ క్యాస్టింగ్ అందులో ఉన్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, అనూప్ రూబెన్స్ సంగీతం ఇలా టెక్నికల్ టీమ్ మొత్తం పక్కాగా సెట్ చేసుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడా ప్రాజెక్టు ఆగిపోయింది. విశ్వక్ సేన్ ప్రవర్తన వల్లే తాను ఆపేస్తున్నానని అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.
అర్జున్ చెప్పిన వెర్షన్ ప్రకారం ఇప్పటికే పలుమార్లు విశ్వక్ వల్ల షూటింగ్ వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, నవంబర్ మొదటి వారంలో ప్లాన్ చేసుకున్న షూట్ కు సైతం తెల్లవారుఝామున అయిదు గంటల ప్రాంతంలో రాలేనని చెప్పి ఇబ్బంది పెట్టాడని, ఇది తనకు మాత్రమే కాదు యూనిట్ మొత్తానికి అవమానంగా భావిస్తూ ఇకపై కొనసాగించే ఉద్దేశం తనకు ఎంత మాత్రం లేదని కుండబద్దలు కొట్టేశారు. తన నలభై రెండేళ్ల కెరీర్ లో ఎప్పుడూ ఎవరి గురించి మాట్లాడని తనకు ఇప్పుడిలా మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో అర్థం చేసుకోమని అన్ని విషయాలు చెప్పారు.
ఇది సోషల్ మీడియాలో ఉదయం నుంచే లీకవుతున్న వార్తనే అయినా అర్జున్ అఫీషియల్ గా చెప్పాక మబ్బులన్నీ వీడిపోయాయి. అల్లు అర్జున్, రామ్ లాంటి యంగ్ స్టర్స్ తో పనిచేసినప్పుడు కలగని ఇబ్బంది ఇప్పుడే వచ్చిందని, స్కిన్ టాన్ అయ్యిందని, బాడీ షేపింగ్ చేసుకుని పర్ఫెక్ట్ గా వస్తానని చెప్పిన విశ్వక్ తర్వాత ఇలా చేయడం పట్ల చాలా మనస్థాపం చెందానని అర్జున్ వివరించారు. ఇకపై వేరే హీరోతో ఇదే బృందంతో కంటిన్యూ చేస్తానని చెప్పిన అర్జున్ త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తారట. యాక్షన్ కింగ్ అంతటి సీనియర్ అభాండాలు వేశారు కాబట్టి ఇప్పుడు విశ్వక్ సేన్ తనవైపు ఏం చెప్తాడనే దాన్ని బట్టి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా వెంటనే ఒక నిర్ధారణకు రాలేం
This post was last modified on November 5, 2022 5:31 pm
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…