Movie News

విజయ్‌తో గోవిందం.. రష్మిక కూడా రిపీటేనా?

హీరోగా పెళ్ళిచూపులు సినిమాతో అలరించి.. అర్జున్ రెడ్డితో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించి.. గీతా గోవిందం సినిమాతో భారీ బాక్సాఫీస్ కలక్షన్లు రాబట్టగలనని నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ ఆడకపోయినా కూడా.. ఇప్పటికీ తన క్రేజును మాత్రం అలాగే కొనసాగిస్తున్నాడు. అయితే లైగర్ సినిమా ఫ్లాపైన తరువాత.. ఖుషీ సినిమా ముస్తాబవుతున్నా కూడా.. ఈసారి మాత్రం చాలా కేర్ఫుల్ గా ఒక రొమాంటిక్ కామెడీతో రావాలని యోచిస్తున్నాడట. ఈ తరుణంలో ఒక ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది.

గీత గోవిందం సినిమాను తీసిన దర్శకుడు పరశురాం ఆ తరువాత మహేష్ బాబుతో ‘సర్కారువారి పాట’ అంటూ ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్టయినర్ తో విచ్చేశాడు. సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా.. మహేష్‌ స్టార్డమ్ వలన భారీ కలక్షన్లు వచ్చేశాయి. కాకపోతే ఈ సినిమా కంటెంట్ చూశాక.. పరశురామ్ తో సినిమా చేయాల్సిన నాగచైతన్య ఈ ప్రాజెక్ట్ పక్కనపెట్టి వెంకట్ ప్రభు సినిమాను లైన్లో పెట్టేశాడు. ఇక పెద్ద హీరోల డేట్స్ లేకపోవడంతో.. మరోసారి విజయ్ దేవరకొండతో చేతులుకలపాలని పరశురాం ఒక ఆసక్తికరమైన కథను తీసుకురాగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాతో జతకట్టాలని యోచిస్తున్నాడట విజయ్. ఓ విధంగా చూస్తే ఇది ‘గీత గోవిందం 2’ అవుతుందని చెప్పాలి.

ఆల్రెడీ గీతా గోవిందం తరువాత డియర్ కామ్రేడ్ సినిమా కోసం విజయ్ అండ్ రష్మిక జంటగా ముందుకొచ్చారు కాని, ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో నిరాశ చెందారు. ఈ మధ్యనే ఇద్దరూ కలసి ‘ఫ్రెండ్స్’ అంటూనే మాల్డీవ్స్ హాలిడేస్ కు వెళ్ళిరావడంతో.. ఈ జంటపై మీడియా అటెన్షన్ మరియు ఆడియన్స్ కి కుతూహలం కూడా బాగా పెరిగింది. చూద్దాం వీళ్ళు నిజంగానే జతకడతారో లేదో మరి.

This post was last modified on November 1, 2022 10:16 pm

Share
Show comments
Published by
prasad bh

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

4 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

4 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

6 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

6 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

6 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

8 hours ago