హీరోగా పెళ్ళిచూపులు సినిమాతో అలరించి.. అర్జున్ రెడ్డితో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించి.. గీతా గోవిందం సినిమాతో భారీ బాక్సాఫీస్ కలక్షన్లు రాబట్టగలనని నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ ఆడకపోయినా కూడా.. ఇప్పటికీ తన క్రేజును మాత్రం అలాగే కొనసాగిస్తున్నాడు. అయితే లైగర్ సినిమా ఫ్లాపైన తరువాత.. ఖుషీ సినిమా ముస్తాబవుతున్నా కూడా.. ఈసారి మాత్రం చాలా కేర్ఫుల్ గా ఒక రొమాంటిక్ కామెడీతో రావాలని యోచిస్తున్నాడట. ఈ తరుణంలో ఒక ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది.
గీత గోవిందం సినిమాను తీసిన దర్శకుడు పరశురాం ఆ తరువాత మహేష్ బాబుతో ‘సర్కారువారి పాట’ అంటూ ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్టయినర్ తో విచ్చేశాడు. సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా.. మహేష్ స్టార్డమ్ వలన భారీ కలక్షన్లు వచ్చేశాయి. కాకపోతే ఈ సినిమా కంటెంట్ చూశాక.. పరశురామ్ తో సినిమా చేయాల్సిన నాగచైతన్య ఈ ప్రాజెక్ట్ పక్కనపెట్టి వెంకట్ ప్రభు సినిమాను లైన్లో పెట్టేశాడు. ఇక పెద్ద హీరోల డేట్స్ లేకపోవడంతో.. మరోసారి విజయ్ దేవరకొండతో చేతులుకలపాలని పరశురాం ఒక ఆసక్తికరమైన కథను తీసుకురాగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాతో జతకట్టాలని యోచిస్తున్నాడట విజయ్. ఓ విధంగా చూస్తే ఇది ‘గీత గోవిందం 2’ అవుతుందని చెప్పాలి.
ఆల్రెడీ గీతా గోవిందం తరువాత డియర్ కామ్రేడ్ సినిమా కోసం విజయ్ అండ్ రష్మిక జంటగా ముందుకొచ్చారు కాని, ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో నిరాశ చెందారు. ఈ మధ్యనే ఇద్దరూ కలసి ‘ఫ్రెండ్స్’ అంటూనే మాల్డీవ్స్ హాలిడేస్ కు వెళ్ళిరావడంతో.. ఈ జంటపై మీడియా అటెన్షన్ మరియు ఆడియన్స్ కి కుతూహలం కూడా బాగా పెరిగింది. చూద్దాం వీళ్ళు నిజంగానే జతకడతారో లేదో మరి.
This post was last modified on November 1, 2022 10:16 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…