Movie News

విజయ్‌తో గోవిందం.. రష్మిక కూడా రిపీటేనా?

హీరోగా పెళ్ళిచూపులు సినిమాతో అలరించి.. అర్జున్ రెడ్డితో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించి.. గీతా గోవిందం సినిమాతో భారీ బాక్సాఫీస్ కలక్షన్లు రాబట్టగలనని నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ ఆడకపోయినా కూడా.. ఇప్పటికీ తన క్రేజును మాత్రం అలాగే కొనసాగిస్తున్నాడు. అయితే లైగర్ సినిమా ఫ్లాపైన తరువాత.. ఖుషీ సినిమా ముస్తాబవుతున్నా కూడా.. ఈసారి మాత్రం చాలా కేర్ఫుల్ గా ఒక రొమాంటిక్ కామెడీతో రావాలని యోచిస్తున్నాడట. ఈ తరుణంలో ఒక ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది.

గీత గోవిందం సినిమాను తీసిన దర్శకుడు పరశురాం ఆ తరువాత మహేష్ బాబుతో ‘సర్కారువారి పాట’ అంటూ ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్టయినర్ తో విచ్చేశాడు. సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా.. మహేష్‌ స్టార్డమ్ వలన భారీ కలక్షన్లు వచ్చేశాయి. కాకపోతే ఈ సినిమా కంటెంట్ చూశాక.. పరశురామ్ తో సినిమా చేయాల్సిన నాగచైతన్య ఈ ప్రాజెక్ట్ పక్కనపెట్టి వెంకట్ ప్రభు సినిమాను లైన్లో పెట్టేశాడు. ఇక పెద్ద హీరోల డేట్స్ లేకపోవడంతో.. మరోసారి విజయ్ దేవరకొండతో చేతులుకలపాలని పరశురాం ఒక ఆసక్తికరమైన కథను తీసుకురాగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాతో జతకట్టాలని యోచిస్తున్నాడట విజయ్. ఓ విధంగా చూస్తే ఇది ‘గీత గోవిందం 2’ అవుతుందని చెప్పాలి.

ఆల్రెడీ గీతా గోవిందం తరువాత డియర్ కామ్రేడ్ సినిమా కోసం విజయ్ అండ్ రష్మిక జంటగా ముందుకొచ్చారు కాని, ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో నిరాశ చెందారు. ఈ మధ్యనే ఇద్దరూ కలసి ‘ఫ్రెండ్స్’ అంటూనే మాల్డీవ్స్ హాలిడేస్ కు వెళ్ళిరావడంతో.. ఈ జంటపై మీడియా అటెన్షన్ మరియు ఆడియన్స్ కి కుతూహలం కూడా బాగా పెరిగింది. చూద్దాం వీళ్ళు నిజంగానే జతకడతారో లేదో మరి.

This post was last modified on November 1, 2022 10:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొదటి పరీక్షలో బుచ్చిబాబు మార్కులెన్ని

ఒక చిన్న టీజర్ కోసం ఫ్యాన్స్ ఇంతగా ఎదురు చూడటం మెగా ఫ్యాన్స్ కు పెద్ది విషయంలోనే జరిగింది. కొత్త…

44 minutes ago

క్రికెట్ ఫ్యాన్స్ ను కొట్టబోయిన పాక్ ఆటగాడు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో విసిగిపోయింది. తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో 0-3 తేడాతో ఓడిన తర్వాత అభిమానుల…

1 hour ago

కాటేరమ్మ కొడుకులు.. ఈసారి ఏం చేస్తారో?

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఆశించినంత బాగాలేదు. తొలి మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిపించిన జట్టు, ఆ…

1 hour ago

హ్యాండ్సప్!.. అమెరికా రోడ్డెక్కిన జనం!

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలకు తెర లేసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సహా వాణిజ్య రాజధాని న్యూయార్క్……

1 hour ago

రాజా సాబ్….త్వరగా తేల్చేయండి ప్లీజ్

గత ఏడాది డిసెంబర్ అన్నారు. తర్వాత ఏప్రిల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు దసరా లేదా దీపావళికి రావడం అనుమానమే అంటున్నారు.…

4 hours ago