దివంగత పునీత్ రాజ్ కుమార్ కు కన్నడ ప్రభుత్వం ఒక బిరుదును కట్టబెడుతున్న తరుణంలో చీప్ గెస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళిన సంగతి. ఇదే ఈవెంటుకు ఇన్ఫోసిస్ సుధామూర్తి కూడా విచ్చేశారు. వీళ్ళందరూ ఏదో ఒక రూపంలో కన్నడ బాషతో నేలతో టచ్ ఉన్నవారే. రజనీ పెరిగింది, కండక్టర్ గా పనిచేసిందీ బెంగుళూరులోనే.
అలాగే సుధామూర్తి ఏకంగా బెంగుళూరు సిలికాన్ వేలీకి ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలి వైఫ్. పైగా కన్నడిగ కూడాను. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తల్లి ద్వారి హాఫ్ కన్నడిగుడే. అందుకే వీళ్ళని ఇన్వయిట్ చేశారనేది వేరేగా చెప్పక్కర్లేదు. ఇకపోతే ఇప్పుడు ఉత్పన్నం అవుతున్న సందేహం ఏంటంటే.. మనం కన్నడ సినిమాలను కన్నడ హీరోలను సొంతం చేసుకున్నట్లు.. అక్కడ కూడా మన ఎన్టీఆర్ ను సొంతం చేసుకుంటారా?
నిజానికి మన బాహుబలి, ఆర్ఆర్ఆర్ అక్కడ కూడా బాగానే ఆడేశాయి కాని.. అందులో సగం కలక్షన్లు కర్ణాటకలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రేక్షుకుల ద్వారా వచ్చినవే. ఇకపోతే కొంతమంది ఈ సినిమాల స్టార్లకు అభిమానులు అయిపోయారు కాని, మన దగ్గర కాంతార సినిమా చూసి రిషబ్ షెట్టికి, కెజిఎఫ్ ద్వారా యశ్ కు అయినంత రేంజులో అభిమానులు అయ్యారా అనేదే సందేహం. ఒకవేళ అదే నిజమైతే.. తనెలాగో హాఫ్ కన్నడవాడే కాబట్టి.. ఎన్టీఆర్ ను సొంతం చేసుకోవాల్సిందే. తదుపరి ఎన్టీఆర్ సినిమాలకు కర్ణాటకలో విపరీతమైన ఆదరణ లభించడమే కాకుండా.. దాదాపు ప్రతీ సినిమా తెలుగు వర్షన్ రేంజులో కన్నడలో కూడా రిలీజవ్వాలి.
ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ కూడా కన్నడ ప్రేక్షకులని తన కన్నడ స్పీచ్ తో బాగా అలరిస్తున్నాడు. తనకు మాతృబాష కావడంతో.. హైదరాబాదులో పెరిగినా కూడా.. కన్నడలో కూడా గుక్కతిప్పుకోకుండా మాట్లాడేస్తున్నాడు. చూద్దాం మరి కన్నడనాట మనోడి తదుపరి సినిమాల ప్రభావం వైభవం ఎలా ఉండబోతుందో.
This post was last modified on November 1, 2022 10:16 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…