దివంగత పునీత్ రాజ్ కుమార్ కు కన్నడ ప్రభుత్వం ఒక బిరుదును కట్టబెడుతున్న తరుణంలో చీప్ గెస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళిన సంగతి. ఇదే ఈవెంటుకు ఇన్ఫోసిస్ సుధామూర్తి కూడా విచ్చేశారు. వీళ్ళందరూ ఏదో ఒక రూపంలో కన్నడ బాషతో నేలతో టచ్ ఉన్నవారే. రజనీ పెరిగింది, కండక్టర్ గా పనిచేసిందీ బెంగుళూరులోనే.
అలాగే సుధామూర్తి ఏకంగా బెంగుళూరు సిలికాన్ వేలీకి ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలి వైఫ్. పైగా కన్నడిగ కూడాను. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తల్లి ద్వారి హాఫ్ కన్నడిగుడే. అందుకే వీళ్ళని ఇన్వయిట్ చేశారనేది వేరేగా చెప్పక్కర్లేదు. ఇకపోతే ఇప్పుడు ఉత్పన్నం అవుతున్న సందేహం ఏంటంటే.. మనం కన్నడ సినిమాలను కన్నడ హీరోలను సొంతం చేసుకున్నట్లు.. అక్కడ కూడా మన ఎన్టీఆర్ ను సొంతం చేసుకుంటారా?
నిజానికి మన బాహుబలి, ఆర్ఆర్ఆర్ అక్కడ కూడా బాగానే ఆడేశాయి కాని.. అందులో సగం కలక్షన్లు కర్ణాటకలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రేక్షుకుల ద్వారా వచ్చినవే. ఇకపోతే కొంతమంది ఈ సినిమాల స్టార్లకు అభిమానులు అయిపోయారు కాని, మన దగ్గర కాంతార సినిమా చూసి రిషబ్ షెట్టికి, కెజిఎఫ్ ద్వారా యశ్ కు అయినంత రేంజులో అభిమానులు అయ్యారా అనేదే సందేహం. ఒకవేళ అదే నిజమైతే.. తనెలాగో హాఫ్ కన్నడవాడే కాబట్టి.. ఎన్టీఆర్ ను సొంతం చేసుకోవాల్సిందే. తదుపరి ఎన్టీఆర్ సినిమాలకు కర్ణాటకలో విపరీతమైన ఆదరణ లభించడమే కాకుండా.. దాదాపు ప్రతీ సినిమా తెలుగు వర్షన్ రేంజులో కన్నడలో కూడా రిలీజవ్వాలి.
ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ కూడా కన్నడ ప్రేక్షకులని తన కన్నడ స్పీచ్ తో బాగా అలరిస్తున్నాడు. తనకు మాతృబాష కావడంతో.. హైదరాబాదులో పెరిగినా కూడా.. కన్నడలో కూడా గుక్కతిప్పుకోకుండా మాట్లాడేస్తున్నాడు. చూద్దాం మరి కన్నడనాట మనోడి తదుపరి సినిమాల ప్రభావం వైభవం ఎలా ఉండబోతుందో.
This post was last modified on November 1, 2022 10:16 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…